breaking news
ismailkhanpet
-
స్మశానానికి దారిలేక గ్రామస్తుల అవస్థలు
-
మెదక్ జిల్లాలో తల్లీకూతురు సజీవ దహనం
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్ పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. గుడిసెకు నిప్పంటుకొని తల్లీకూతురు సజీవ దహనమైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునే సరికే తల్లీకూతురు సజీవ దహనమైయ్యారు. తల్లీకూతురు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా ఆ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు.