-
IPL 2024- SRH: సన్రైజర్స్ కెప్టెన్గా అతడే!
ఐపీఎల్ ఎడిషన్లు మారుతున్నా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారడం లేదు. 2016లో తొలిసారి టైటిల్ను ముద్దాడిన రైజర్స్.. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గత కొన్ని సీజన్లుగా మరీ పేలవంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతోంది. జట్టును చాంపియన్గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను తప్పించిన తర్వాత.. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్కు పగ్గాలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కేన్ మామకూ ఉద్వాసన పలికి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో రైజర్స్ ఐపీఎల్-2023 సీజన్లో మరీ దారుణంగా పద్నాలుగింట 4 మాత్రమే గెలిచి అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్ వేటలో పడ్డ సన్రైజర్స్ యాజమాన్యం మినీ వేలంలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్కప్-2023లో ఆసీస్ను జగజ్జేతగా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్లో తమ కెప్టెన్గా కమిన్స్ను నియమించడం ఖాయమని సన్రైజర్స్ ఫ్రాంఛైజీ చెప్పకనే చెప్పిందని అభిమానులు భావిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘ప్యాట్ కమిన్స్ను కొనుగోలు చేయడం ఎస్ఆర్హెచ్ తెలివైన నిర్ణయం. అయితే, అతడి కోసం కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టిన మాట వాస్తవమే. కానీ.. సన్రైజర్స్కు నాయకుడి అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా ఆ వెలితితో జట్టు సమస్య ఎదుర్కొంటోంది. గత సీజన్లో చెత్త కెప్టెన్సీ కారణంగా భారీ మూల్యమే చెల్లించారు. ఈసారి ప్యాట్ కమిన్స్ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడు. కచ్చితంగా అతడినే కెప్టెన్గా నియమిస్తారు. సారథిగా తను తప్పక ప్రభావం చూపుతాడు’’ అని సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు.. కానీ ఆ జట్టులో మాత్రం ఛాన్స్!
లోన్ నాసిర్.. జమ్మూ కశ్మీర్ నయా పేస్ సంచలనం. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గే సత్తా అతడిది. ఐపీఎల్-2024 వేలంలో అందరి కళ్లు అతడిపైనే ఉండేవి. ఈ యువ పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని అందరూ భావించారు. కానీ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన నాసిర్ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని లోన్ నాసిర్కు.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసే ఛాన్స్ లభించింది. రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్లకు ఎంపిక చేసిన జమ్మూ కశ్మీర్ జట్టులో లోన్ నాసిర్కు చోటుదక్కింది. రంజీ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును జమ్మూ కశ్మీర్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. ఈ జట్టుకు శుభమ్ ఖజురియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. అదే విధంగా గాయం నుంచి కోలుకున్న ఉమ్రాన్ మాలిక్ కూడా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024కు జమ్మూ కాశ్మీర్ జట్టు: శుభమ్ ఖజురియా(కెప్టెన్), కమ్రాన్ ఇక్బాల్, అభినవ్ పూరి, వివ్రాంత్ శర్మ, అబ్దుల్ సమద్, శుభమ్ సింగ్ పుండిర్, ఫాజిల్ రషీద్ (వికెట్ కీపర్), ముసైఫ్ ఐజాజ్, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా,ఉమ్రాన్ మలీర్క్, లోన్ మలీక్ ఉమర్ నజీర్, ఔకిబ్ నబీ, రోహిత్ శర్మ. చదవండి:సచిన్ వేరొక గ్రహం నుంచి వచ్చాడనుకుంటా.. గొప్ప వ్యక్తి! లారా కంటే బెటర్ -
'మా నాన్న పాన్ షాప్ నడిపాడు.. ఐపీఎల్ డబ్బులతో ఇల్లు కొనాలనుకుంటున్నా'
ఐపీఎల్-2024 వేలంలో విధర్భ ఆటగాడు శభమ్ దూబేపై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో దూబేను రూ.5.60 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దేశీవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న 28 ఏళ్ల దూబే.. ఇప్పుడు క్యాష్రిచ్ లీగ్లోనూ సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఇక తాజాగా తన మనసులోని మాటను దూబే బయటపెట్టాడు. ఐపీఎల్లో వచ్చిన డబ్బులతో తన కుటుంబం కోసం కోసం ఇళ్లు కొంటానని దూబే తెలిపాడు. 'మా కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. క్రికెట్ కిట్ కొనే స్థోమత లేదు. కానీ మా నాన్న ఇప్పటికీ తన కష్టంతో నాకు క్రికెట్ కిట్ని కొని ఇస్తున్నారు. నేను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కారణం మా నాన్నే. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ నన్ను వేరే పని చేయమని ఎప్పుడూ బలవంతం చేయలేదు. మా నాన్న నిరాడంబరమైన వ్యక్తి. కుటంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడ్డారు. మొదటిలో పాన్ స్టాల్ నిర్వహించారు. ఆ తర్వాత హోటల్ మేనేజర్గా కూడా పనిచేశారు. మా నాన్నతో పాటు నా సోదరుడు కూడా ఎంతో మద్దతుగా నిలిచాడు. నాపై ఎటువంటి ఒత్తడి కలగకుండా తన కూడా ఎదో ఒక పనిచేసి మా నాన్నకు సాయంగా ఉండేవాడు. నేను గాయపడి క్రికెట్కు దూరంగా ఉన్న సమయంలో కూడా నా కుటుంబం చాలా సపోర్ట్గా ఉంది. ఇకపై వారికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవాలనకుంటున్నాను. నేను ముందుగా నా ఫ్యామిలీ కోసం ఇల్లు కొనాలనుకుంటున్నానని" రాజస్తాన్ రాయల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుబే పేర్కొన్నాడు. చదవండి: IND vs AFG: అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే? -
IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై?
‘‘ముంబై ఇండియన్స్తో పోలిస్తే అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ పూర్తి భిన్నమైనది. ఇరు ఫ్రాంఛైజీల సంస్కృతి, లక్ష్యాలు వేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగమయ్యేందుకు 2021లో సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లు చెల్లించింది. అయితే, ఎంఐ ఫ్రాంఛైజీ ఇందుకు భిన్నమైనది. అతిపెద్ద వ్యాపార కుటుంబం ఈ ఫ్రాంఛైజీని నడిపిస్తోంది. మరోవైపు.. సీవీసీ అనేది ఒక పెట్టుబటి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సీవీసీకి 40 మంది మేనేజింగ్ పార్ట్నర్లు, ఆయా చోట్ల 29 స్థానిక కార్యాలయాలు ఉన్నాయి. ఆ సంస్థకు సంబంధించిన వెబ్సైట్లో గుజరాత్ టైటాన్స్ ఒక ప్రత్యేకమైన పోర్ట్ఫొలియోలో లిస్ట్ అయింది. నిజానికి హార్దిక్ను ట్రేడ్ చేయడం ద్వారా గుజరాత్ టైటాన్స్ పర్సు రూ. 15 కోట్ల మేర ఖాళీ అయింది. అయితే, దానిని పూడ్చడంతో పాటు ట్రేడింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ ఫీజు కూడా లభించింది. అయితే, అది ఎంత మొత్తం అన్నది కేవలం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. కానీ ఇందుకు సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రూ. 100 కోట్లకు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరిగిందనేది వాటి సారాంశం’’... టీమిండియా స్టార్ ఆల్రౌండర్, టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి తాజాగా వినిపిస్తున్న వార్తలు. నెట్టింట చర్చకు దారితీసిన ట్వీట్ ఈ మేరకు.. ‘‘హార్దిక్ ఎంఐకి వెళ్లిపోయేందుకు గుజరాత్ టైటాన్స్ ఎందుకు అంగీకరించింది?’’ అన్న శీర్షికతో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రచురించినట్లు క్రికెట్ గురించి అప్డేట్లు అందించే ఎక్స్ యూజర్ ముఫద్దాల్ వొహ్రా చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. అంతసీన్ లేదు ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఈ పోస్ట్కు వీక్షణలు లభించడం విశేషం. అయితే, ఈ విషయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. హార్దిక్కోసం మరీ 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పని లేదని.. ఇలాంటివి కేవలం హైప్ క్రియేట్ చేసేందుకే సృష్టిస్తారని పేర్కొంటున్నారు. బంగారు బాతు.. పైసా వసూల్ పెర్ఫామెన్స్ గ్యారెంటీ మరికొందరు మాత్రం.. ‘‘హార్దిక్ పాండ్యా బంగారు బాతు లాంటివాడు. అతడి కోసం ముంబై ఒకవేళ నిజంగానే వంద కోట్లు ఖర్చు పెట్టినా అందుకు రెట్టింపు పైసా వసూల్ ప్రదర్శన ఇస్తాడు’’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కష్టకాలంలో గుజరాత్ కెప్టెన్గా ముంబై ఇండియన్స్ ఆఫర్ మేరకు గుజరాత్ టైటాన్స్ను వీడి తిరిగి సొంతగూటికి చేరాడు. తనకు లైఫ్ ఇచ్చినప్పటికీ.. గడ్డుకాలంలో తనను వదిలించుకున్న ముంబై వైపే మొగ్గు చూపి టైటాన్స్కు వీడ్కోలు పలికాడు. కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. పాండ్యాను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. భారీ ఆఫర్ ఇచ్చిన ముంబై.. టైటాన్స్ పాండ్యా టాటా అంతకు ముందు సారథిగా పనిచేసిన అనుభవం లేకపోయినా.. పూర్తి ఫిట్నెస్ సాధించకపోయినా హార్దిక్పై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లుగానే హార్దిక్.. అరంగేట్ర సీజన్లోనే టైటాన్స్ను విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఫైనల్కు కూడా తీసుకువచ్చాడు. అయితే, అనూహ్యంగా ముంబై ఇండియన్స్తో ఒప్పందం కుదుర్చుకుని టైటాన్స్కు టాటా చెప్పాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: Ind vs SA: వికెట్ కీపర్ విషయంలో ద్రవిడ్ క్లారిటీ .. తప్పుబట్టిన మాజీ క్రికెటర్ Hardik Pandya's trade details (Indian Express): pic.twitter.com/MNiN5grdYC — Mufaddal Vohra (@mufaddal_vohra) December 24, 2023 -
IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్!
ముస్తాబాద్(సిరిసిల్ల): క్రికెట్ అండర్–19 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికై , సంచలనం సృష్టించాడు 18 ఏళ్ల ఎరవెల్లి అవనీష్రావు. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుకు ఆడబోతున్నాడు కూడా! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవనీష్రావును.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది. దుబాయ్లో గత మంగళవారం జరిగిన ఐపీఎల్-2024 వేలంలో అతడిని సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసులో ఆట ప్రారంభం వికెట్ కీపర్గా, లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్గా రాణిస్తున్న అవనీష్రావు.. నెల రోజుల వ్యవధిలో ఆసియా కప్, ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ట్రై సీరిస్తోపాటు.. జనవరి 19 నుంచి జరగనున్న అండర్–19 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐపీఎల్లో పెద్ద జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడు పోతుగల్కు చెందిన ఎరవెల్లి బాలకిషన్రావు సబ్రిజిస్ట్రార్గా రిటైరయ్యారు. ఆయన కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ లక్ష్మణ్రావు–సుష్మ దంపతుల కుమారుడు అవనీష్రావు బాల్యం హైదరాబాద్లోనే గడిచింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించగా తండ్రి ప్రోత్సహించారు. నిత్యం జింఖానా మైదానంలో 10 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడు. పాఠశాల చదువు సమయంలోనే అవనీష్రావు హైదరాబాద్ అండర్–14, 16కు ఎంపికయ్యాడు. హెచ్సీఏ సైతం అతని ప్రతిభ చూసి, చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బీసీసీఐ దృష్టిలో పడగా, అండర్–19 భారత జట్టుకు ఎంపిక చేసింది. తక్కువ వయసులో క్రికెట్లో రాణిస్తున్న అవనీష్రావు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ స్ఫూర్తి.. చిన్నప్పటి నుంచి తనకు ఆడమ్ గిల్క్రిస్ట్ అంటే ఇష్టమని అవనీష్రావు తెలిపాడు. ఎడమ చేతివాటంతో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో.. తాను కూడా అలా కావాలనుకున్నానని తెలిపాడు. తాను మొదట హైదరాబాద్లోని హిందూ మహావిద్యాలయలో చేరి, కోచ్ చందు ఆధ్వర్యంలో ఆటపై పట్టు సాధించానని, అనంతరం ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అకాడమీలో చేరి, మరింత రాటుదేలినట్లు తెలిపాడు. పలు టోర్నీల్లో అవకాశాలు వచ్చాయని, అండర్–19 వరల్డ్ కప్కు ఎంపికవ్వాలనే లక్ష్యంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేశానన్నాడు. తన లక్ష్యం భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడమేనని పేర్కొన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్న్యూస్!.. కెప్టెన్ దూరం!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement