breaking news
international circuit
-
బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో సానియా పునరాగమనం
ముంబై: భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చే ఏడాది జనవరిలో బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో అంతర్జాతీయ సర్క్యూట్లో పునరాగమనం చేయనుంది. గత ఏడాది అక్టోబర్లో బాబు ఇజ్హాన్కు జన్మనిచ్చిన సానియా రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ఇటీవల మళ్లీ రాకెట్ పట్టిన ఈ హైదరాబాద్ స్టార్ వారంలో ఆరు రోజులపాటు ప్రాక్టీస్ చేస్తోంది. మహిళల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన సానియా మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్గా కూడా నిలిచింది. జనవరిలో బ్రిస్బేన్ ఓపెన్, హోబర్ట్ ఓపెన్ టోర్నీల్లో ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిషెనోక్తో కలిసి ఆడనున్న 33 ఏళ్ల సానియా ఆ తర్వాత సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్లో కూడా బరిలోకి దిగనుంది. ప్రస్తుతం రోజూ ఉదయం నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేస్తున్న సానియా సాయంత్రం వేళలో జిమ్లో కసరత్తులు చేస్తోంది. ‘పునరాగమనంలో కొత్తగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా ఆడతాను. నా టెన్నిస్ కెరీర్లో కోరుకున్న విజయాలన్నీ సాధించాను. భవిష్యత్లో సాధించే విజయాలన్నీ బోనస్లాంటివే’ అని సానియా వ్యాఖ్యానించింది -
వచ్చే ఏడాదీ భారత్లో లేదు
ఫార్ములావన్ రేసుపై ఎకిల్స్టోన్ న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసు నిర్వాహకులకు ఎఫ్1 యజమాని బెర్నీ ఎకిల్స్టోన్ షాకిచ్చారు. ఇప్పటికే 2014లో రేసును రద్దు చేయగా, 2015లోనూ భారత్లో రేసు జరగబోదని ప్రకటించారు. భారీ స్థాయిలో పన్నులతో పాటు రాజకీయ నాయకులు, అధికారుల నుంచి వేధింపుల కారణంగానే వచ్చే ఏడాది కూడా భారత్కు అవకాశం ఇవ్వడం లేదని ఎకిల్స్టోన్ స్పష్టం చేశారు. 2016 నాటికి ఈ సమస్యల్ని అధిగమిస్తే తిరిగి పరిశీలిస్తామన్నారు. దీంతో వచ్చే ఏడాదైనా మళ్లీ రేసు నిర్వహించాలన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో 2011 నుంచి మూడేళ్లపాటు ఇండియన్ గ్రాండ్ప్రి జరిగింది.