breaking news
intake wells
-
రూ.1450 కోట్ల వ్యయంతో పనులు.. ‘సుంకిశాల’.. చకచకా
సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా మూడు దశల ప్రాజెక్టులకు ఈ ఏడాది చివరి నాటికి పుష్కలంగా తాగునీరు అందుబాటులోకి రానుంది. జలాలను తరలించేందుకు ఉద్దేశించిన సుంకిశాల ఇన్టేక్వెల్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ బ్యాక్వాటర్ సుంకిశాల వద్ద రూ.1470 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 50 శాతం.. అంటే రూ.760 కోట్ల మేర పనులు పూర్తయినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది నవంబర్– డిసెంబర్లోగా పనులు పూర్తి చేస్తామని పేర్కొంది. దాహార్తి దూరం.. ►ప్రస్తుతం కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల (16.5 టీఎంసీలు) తాగునీటిని ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ (ఏఎంఆర్పీ) నుంచి తరలిస్తున్నారు. ఏటా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టాలు 510 అడుగుల కంటే దిగువనకు పడిపోయినపుడు డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా డెడ్స్టోరేజీ నుంచి నీటిని తరలించాల్సి వస్తోంది. ►ఈ నేపథ్యంలోనే ఈ ఇన్టేక్వెల్ను అత్యంత లోతున నిర్మిస్తున్నారు. సుమారు 170 మీటర్ల లోతు, 40 మీటర్ల వెడల్పున ఇన్టేక్ వెల్ను నిర్మిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల కారణంగా భవిష్యత్లో మొత్తంగా 20 టీఎంసీల కృష్ణా జలాలను నగరానికి తరలించేందుకు ఈ వెల్ను నిర్మిస్తుండడం విశేషం. మండువేసవిలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎండీడీఎల్(మినిమం డ్రాయల్ డౌన్ లెవెల్) కంటే దిగువ నుంచి కూడా నీటిని తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడనుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పురోగతి ఇలా.. ►అండర్ గ్రౌండ్ షాఫ్ట్ (వెట్ వెల్ డ్రై వెల్): అండర్ గ్రౌండ్ షాఫ్ట్ నిర్మాణం కోసం కీలకమైన రాతి తొలగింపు పనులు పూర్తయ్యాయి. ►8 మీటర్ల డయా వ్యాసార్థంతో యాక్సెస్ టన్నెళ్లు, లింక్ టన్నెళ్ల తవ్వకం పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. మొత్తం 1100 రన్నింగ్ మీటర్లు (ఆర్ఎంటీ)లో 900 ఆర్ఎంటీ మేర పనులు పూర్తయ్యాయి. ఇన్ టేక్ టన్నెళ్ల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ►ఎలక్ట్రో మెకానికల్ ఈక్విప్ మెంట్: ట్రాన్ కో నుంచి ప్రత్యేకంగా హెచ్ టీ ఫీడర్ మెయిన్ తీసుకున్నారు. పంపులు, మోటార్లు, ట్రాన్సా్ఫర్మర్, సబ్ స్టేషన్, ఇతర సామగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. పంపింగ్ మెయిన్లు: 2375 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్కు ప్లేట్లు, పైపుల కొనుగోలు, తయారీ జరుగుతోంది. మొత్తం 5 కిలోమీటర్ల పైపులైన్లు తయారు కాగా, 3 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు పూర్తయ్యింది. మొత్తం ప్రాజెక్టును 2023 నవంబరు– డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. -
మిషన్ వాటర్గ్రిడ్
* పనులకు ఒకేసారి అనుమతులు * ప్రాజెక్టుపై సమీక్షలో కేసీఆర్ వెల్లడి * ఇన్టేక్ బావులు, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పైపులైన్ల ఏర్పాటు వేగవంతం * ఫిబ్రవరి నుంచే సమాంతరంగా నిర్మాణ పనులు * ప్రైవేటు భూముల్లోనూ పైపులైన్లు వేసేందుకు ప్రత్యేక చట్టం.. సత్వర నిర్ణయాల కోసం సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీ * ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం * 25 వేల జనావాసాలకు 56 నీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా 39 టీఎంసీల తాగునీరు * ప్రతి వ్యక్తికీ గ్రామాల్లో వంద, నగరాల్లో 150 లీటర్లు * పరిశ్రమల అవసరాలకూ నీటి సరఫరా: కేటీఆర్ * నీటి కేటాయింపులపై ఇరిగేషన్ శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఆటంకాలు ఏర్పడకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ ఒకేసారి అన్ని అనుమతులను(బ్లాంకెట్ పర్మిషన్లు) ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలిక్ పనులు, ఇన్టేక్ వెల్స్(బావుల) నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు వంటి వాటికి ప్రభుత్వమే ఏకమొత్తంగా అనుమతులు ఇస్తుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లోనూ విద్యుత్ లైన్లు, పైపులైన్ల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. వాటర్గ్రిడ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో ఇన్టేక్ బావులను నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెలలోనే నిర్మాణం చేపట్టి వేసవిలోగా వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ బావుల నిర్వహణకు అవసరమైన విద్యుత్ను అందించే పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని విద్యుత్శాఖ వర్గాలకు నిర్దేశించారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే నిమిత్తం సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని హోటల్ గ్రాండ్ కాకతీయలో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుతో పాటు అటవీ, విద్యుత్, ఆర్అండ్బీ, పురపాలక, రెవెన్యూ, నీటి పారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన పనులు, అవి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ఈ సందర్భంగా సీఎం స్పష్టతనిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని, ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు ఇవ్వడం కోసం చేపట్టిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టును దేశంలోనే మేటిగా నిలిపేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఆయాశాఖల మంత్రులు, ఉన్నతాధికారులు తమ కు అప్పగించిన బాధ్యతలను, చేయాల్సిన పనులను సోమవారం నుంచే ప్రారంభించాలని చెప్పా రు. ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు రాలేదన్న కారణంతో వాటర్గ్రిడ్ పనులను ఆపొద్దని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు తెలి పారు. అనుమతుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను సీఎం ఆదేశించారు. రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్ చట్టం ప్రైవేటు భూముల్లోనూ పైపులైన్లు వేయడం కోసం రైట్ ఆఫ్ వే..రైట్ ఆఫ్ యూజ్(ఆర్డబ్ల్యుఆర్యూ) చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తోం దని, చట్టం అమలు కోసం ఆర్డినెన్స్ తేనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా, ఇన్టేక్ వెల్స్, సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రాజెక్టుల వద్ద స్థలం అప్పగించేందుకు నీటి పారుదల శాఖ సంసిద్ధత వ్యక్తం చే సింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి, పంపింగ్, లిఫ్టింగ్, వాటర్ ట్రీట్మెంట్ కోసం అవసరమయ్యే విద్యుత్ను అందించేందుకు విద్యుత్ శాఖాధికారులు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కరెంట్ స్తంభాల ఏర్పాటుకు కూడా రైట్ ఆఫ్ వే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కూడా ఏకమొత్తంగా అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. ఒకే ఉత్తర్వుతో అనుమతులు వస్తాయని, విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా సబ్స్టేషన్లకు ప్రత్యేక సరఫరా లైన్లు వేయాలని నిర్దేశించారు. ఇక వాటర్గ్రిడ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 56 నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం నిర్మించనుంది. వరంగల్ జిల్లాలోని జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, నల్గొండ జిల్లాలోని భువనగరి, ఆలేరు, మెదక్ జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గాలకు ఎల్లంపల్లి నుంచి మంచినీటిని అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. గ్రిడ్కు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి త్వరలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గ్రిడ్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీని వేయనున్నట్లు చెప్పారు. గర్వ పడుతున్నాం: మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 25 వేల జనావాసాలకు జీవ నదుల నుంచి సురక్షితమైన మంచినీటిని అందించే వాటర్గ్రిడ్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం చేపట్టినందుకు గర్వపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 29 నీటి వనరుల నుంచి 26 సెగ్మెంట్లకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇందుకోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా విభాగాల అధికారులకు అవగాహన కల్పించేందుకు కూడా త్వరలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వాటర్గ్రిడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల మంచినీరు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా వాటర్గ్రిడ్ ద్వారా అందిస్తామన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీటి కేటాయింపులపై కసరత్తు వాటర్గ్రిడ్ పథకానికి నీటి కేటాయింపుల విషయమై ఆర్డబ్ల్యూఎస్ విభాగం నివేదించిన గణాంకాలపై నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోం ది. వివిధ ప్రాజెక్టుల నుంచి అందించాల్సిన నీటి లెక్కలను పరిశీలి స్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీటిని ఇవ్వాలన్న ప్రతి పాదనను ఆశాఖ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే ఎన్టీపీసీ, పరిశ్రమలు, తాగునీటి అవసరాల కోసం 8 టీఎంసీలను కేటాయించిన దృష్ట్యా వాటర్గ్రిడ్కు 3 టీఎంసీల వరకే ఇవ్వగలమని చెబుతోంది. పక్కనే ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీలు వాడుకోవచ్చునని ప్రతిపాదిస్తోంది.