breaking news
Indus Water
-
పాకిస్తాన్కు చెక్ పెట్టిన భారత్.. సింధు నదిపై మాస్టర్ప్లాన్!
సింధు నదిపై భారత్ వేసిన ఓ చిన్న అడుగు ఇప్పుడు పాకిస్తాన్ను టెన్షన్కు గురి చేస్తోంది. లడఖ్లోని ఉప్షి వద్ద సింధు నదిపై భారత్ తొలిసారిగా రాక్ చెక్డ్యామ్ నిర్మించింది. సహజ రాళ్లతో నిర్మించిన ఈ చెక్డ్యామ్ వల్ల నదిలో నీటి మట్టం దాదాపు 10 అడుగులు పెరిగింది. దీంతో ఇన్నాళ్లుగా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సరిహద్దు గ్రామాల రైతులకు నీరు అందే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ప్రాజెక్టును కేవలం రైతుల కోసం చేపట్టిన నీటి సంరక్షణ చర్యగానే చూడాలా? లేక భవిష్యత్తులో సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకునే భారత్ వ్యూహంలో ఇది తొలి అడుగా? అన్న చర్చ మొదలైంది.ఇక్కడ పాకిస్తాన్కు తక్షణంగా భారీ నష్టం లేకపోయినప్పటికీ.. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని ప్రాంతాల్లో వరుసగా నిర్మిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. లడఖ్ పరిపాలన ఇప్పటికే మరో 36 చెక్డ్యామ్లు, వీయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లేహ్లో ఏడు హిమాలయన్ రాక్ చెక్డ్యామ్లు, కార్గిల్లో 29 చెక్డ్యామ్లు లేదా వీయర్లను నిర్మించే ప్రతిపాదన ఉంది. అంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నీటిని అక్కడికక్కడే నిల్వ చేసి స్థానిక అవసరాలకు వినియోగించే మౌలిక వసతులను భారత్ క్రమంగా పెంచుకుంటోంది.నీటి నిల్వతో పాక్కు టెన్షన్.. ఇదే అంశం పాకిస్తాన్కు ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. సింధు నదీ వ్యవస్థ ఆ దేశ వ్యవసాయానికి, నీటి సరఫరాకు, ఆహార భద్రతకు అత్యంత కీలకం. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఈ నదీ వ్యవస్థపై భారీగా ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన భూభాగంలో లభించే సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకోవడం ప్రారంభిస్తే.. భవిష్యత్తులో పాకిస్తాన్కు చేరే నీటి ప్రవాహం, దాని సమయంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఉప్షి వద్ద నిర్మించిన ఈ చెక్డ్యామ్ ప్రధాన ఉద్దేశం స్థానికంగా నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించడమే. లడఖ్లోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వ్యవసాయాన్ని కాపాడుకోవడం అక్కడి ప్రజలకు కీలకంగా మారింది. నది లోతైన గార్జ్లలో ప్రవహించడం, వసంతకాలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో రైతులు నేరుగా పంపుల ద్వారా నీటిని తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. చెక్డ్యామ్ నిర్మాణంతో ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తోంది.పహల్గామ్ ఎఫెక్ట్?అయితే దీని వెనుక వ్యూహాత్మక కోణం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. 2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. అదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ‘అబేయన్స్’లో ఉంచింది. అప్పటి నుంచి సింధు జలాల అంశం ఇరు దేశాల మధ్య కీలక వ్యూహాత్మక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని భారత్ పెంచుకోవడం పాకిస్తాన్కు సహజంగానే ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. భారత్ ఇప్పటివరకు పరిమితంగా వినియోగించిన నీటి వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకునే మౌలిక వసతులను పెంచుకుంటే.. దాని ప్రభావం భవిష్యత్తులో పాకిస్తాన్పై పరోక్షంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి ప్రాజెక్టులు ఒక్కటిగా కాకుండా వరుసగా అమలైతే.. సరిహద్దు ప్రాంతాల్లో నీటి నిల్వ, సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరగొచ్చు.ఇదీ చదవండి: కాంగ్రెస్కు బిగ్ షాకిచ్చిన టీవీకేఅందుకే ఉప్షి వద్ద నిర్మించిన చెక్డ్యామ్ పరిమాణంలో చిన్నదైనా.. దాని వెనుక ఉన్న సందేశం మాత్రం పెద్దదిగా కనిపిస్తోంది. ఒకవైపు లడఖ్ రైతులకు సాగునీరు అందించడం, మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో నీటి భద్రతను బలోపేతం చేయడం.. భవిష్యత్తులో సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఒక్క చెక్డ్యామ్తో పాకిస్తాన్కు నీళ్లు ఆగిపోవు.. కానీ ఇలాంటి ప్రాజెక్టుల సంఖ్య పెరిగితే సింధు జలాలపై భారత్ వినియోగ సామర్థ్యం మాత్రం పెరగవచ్చు. ఇదే ఇప్పుడు పాకిస్తాన్కు అసలు టెన్షన్గా మారుతోంది. -
మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్లో పాకిస్తాన్కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
పాక్ జలఖడ్గంపై కేంద్ర ప్రకటన విడ్డూరం
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్తాన్కు ఇవ్వాల్సిన నీటి వాటాను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు. కశ్మీర్, పంజాబ్లలో ప్రాజెక్టులు కట్టి పాక్కు నీటి వాటాను తగ్గించాలని 2016లోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్కు నీటివాటాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాక్పై దేశ ప్రజలకున్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అహ్మద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయమేమిటంటే!! ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని అందుకే తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారని భారత్ ఆరోపిస్తోంది. దీంతో సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్కు వెళ్తున్న నీటి వాటాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని జల వనరుల మంత్రి నితిన్ గడ్కారీ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే 6 సంవత్సరాలు పట్టొచ్చని, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అప్పటిలోగా 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్లను నిర్మిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశ ప్రజలకు దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్కు వెళ్తున్న మన నీటిని నిలిపివేసి కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు సరఫరా చేయాలని యోచిస్తున్నామని తెలిపిన విషయం తెలిసిందే. (పాక్పై జలఖడ్గం) -
పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు: ముషార్రఫ్
న్యూఢిల్లీ: సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్ తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిప్రక్రియ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రతిదానికి పాకిస్థాన్ ను నిందించడం సరికాదన్నారు. ఉడీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్థాన్ కారణమంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని విమర్శించారు. సార్క్ సమావేశాల నుంచి భారత్ తప్పుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారత్ ప్రభావితం చేయడం వల్లే అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా సార్క్ సదస్సుకు దూరమయ్యాయని ఆరోపించారు. బలూచిస్థాన్ లో పాకిస్థాన్ జాతీయ పతకాలను తగులబెట్టిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.


