-
కీర్తి ఘనం.. వసతులు శూన్యం!
సాక్షి, గుంటూరు: గుంటూరు వైద్య కళాశాల.. 70 ఏళ్ల కీర్తి కిరీటాన్ని తలపై అలంకరించుకున్న వైద్య దేవాలయం.. ఎందరో నిష్ణాతులైన వైద్యులను, మరెందరో ఉద్ధండులైన రాజకీయ నాయకులను జిల్లా నుంచి అందించిన కీర్తి మకుటం.. ఇక్కడ సీటు వస్తే చాలు.. జీవితంలో ఉన్నత శిఖరాల ఆనందపు అంచులు అందుకున్నంత సంబరం..ఇదంతా గతం.. కాలక్రమేణా పాలకుల అసమర్థత వైద్య కళాశాలలోని ప్రతి మూలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. మంచి కళాశాలలో సీటు వచ్చిందనే ఆనందాన్ని ఆదిలోనే ఆవిరి చేస్తోంది. ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో కాలేజీలోకి అడుగు పెడితే.. అడుగడుగునా సమస్యల తోరణం గుమ్మంలోనే స్వాగతం పలుకుతోంది. కనీసం కూర్చొని పాఠాలు వినడానికి సరిపడా తరగతి గదిలేని దయనీయ స్థితి కళాశాల దుస్థితికి అద్దం పడుతోంది. సౌకర్యాలపై సర్దుకుపోయినా పాఠాలు పూర్తిగా చెప్పే గురువులు లేని దుస్థితి రేపటి భవిష్యత్ను ఆందోళనలో పడేస్తోంది. ఆరేళ్ల క్రితం ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని సంతోషపడినంతలోనే.. వసతులలేమి దుఃఖంలో ముంచెత్తుతోంది. మొత్తంగా ఉన్నతాధికారుల చెవికి చేరని వైద్య విద్యార్థుల వేదన కాలేజీలో నాలుగు గోడల మధ్యే కన్నీరవుతోంది. రాష్ట్ర రాజధాని జిల్లా గుంటూరులో ఉన్న గుంటూరు వైద్య కళాశాలలో సరైన సౌకర్యాలు లేక వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సరిపడా వైద్యులు కూడా లేకపోవటంతో చికిత్స కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చే పేద రోగులు సైతం సకాలంలో వైద్యం అందక అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వం రాజధాని జిల్లాలోని వైద్య కళాశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా మిన్నకుండిపోయింది. పేరుకే జిల్లా రాజధానిలో ఉన్న వైద్య కళాశాల అని చెప్పుకోవటమే మినహా వైద్య విద్యార్థులకు తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు కూడా కనీస సౌకర్యాలు లేవు. కళాశాల ప్రిన్సిపాల్గా నియమించిన డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావును మూడేళ్ల క్రితం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత లేని వ్యక్తిగా నిర్ధారించింది. మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన సమయంలో అర్హత లేని డాక్టర్ సుబ్బారావుని పక్కన కూర్చోబెట్టి డాక్టర్ మోహనరావును ఆ స్థానంలో ఉంచారు. దీంతో సీనియర్స్ ప్రాధాన్యత లేకపోయింది. దీనంతటికీ టీడీపీ ప్రభుత్వ తీరే కారణమని సీనియర్ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందరో ఆణిముత్యం లాంటి వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత అందుకున్న గుంటూరు వైద్య కళాశాలలో నేడు కనీసం బోధన చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా అక్కడ గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న వైద్యులు కనిపిస్తారు. వైద్య కళాశాలకు సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ చదువుకున్న వైద్యులు చాలా మంది దేశంలోని ఉన్నత పదవులను సైతం అలంకరించారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన వైద్యుల్లో చాలా మంది గుటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులే. వైద్యుల పోస్టుల ఖాళీలతో బోధన ఎలా? గుంటూరు వైద్య కళాశాల ప్రారంభంలో తొలి బ్యాచ్లో కేవలం 50 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు ఉండగా 1960 సంవత్సరం నాటికి 150 మందికి పెరిగారు. 2013–14 విద్యా సంవత్సరంలో గుంటూరు వైద్య కళాశాలకు 50 సీట్లు అదనంగా వచ్చి ప్రస్తుతం 200 మంది వైద్య విద్యార్థులు ఎనిమిదో బ్యాచ్ 2019–20 సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నీట్ ఫలితాలు కూడా ప్రకటించటంతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య విభాగాలన్నీ కలిపి 32 వరకు జీజీహెచ్లో, వైద్య కళాశాలలో ఉన్నాయి. పీజీ సీట్లు 100 ఉండగా ఏడాదికి వంద మందికిపైగా పారా మెడికల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరందరికీ బోధన చేసేందుకు కళాశాలలో 66 మంది ప్రొఫెసర్లు, 50 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 201 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో బోధన అంతంతమాత్రమే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు ప్రొఫెసర్, 3 అసోసియేట్ ప్రొఫెసర్స్ 3, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 200 సీట్లకు సరిపడా వైద్యులు ఎక్కడ ? భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల ప్రకారం గుంటూరు వైద్య కళాశాలలో బోధన సిబ్బంది లేరు. ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీల సమయంలో బోధనా సిబ్బంది ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. దీంతో వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఖాళీగా ఉన్న 34 ఖాళీ పోస్టులతోపాటు పెరిగిన సీట్లకు అనుగుణంగా మరో 15 నుంచి 20 వైద్యుల పోస్టులు అవసరం. ముఖ్యంగా సీనియర్ రెసిడెంట్ వైద్యుల కొరత వేధిస్తోంది. సూపర్ స్పెషాలిటీ, పీజీ సీట్లకు గుర్తింపు రావాలంటే అసోసియేట్ ప్రొఫెసర్స్ను నూతనంగా మంజూరు చేయాల్సి ఉంది. ఈ పోస్టులు సరిపడా లేకపోవటంతో వైద్యులకు పదోన్నతులు కూడా సక్రమంగా రాని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వం కింది స్థాయి అసిస్టెంట్స్కు పదోన్నతులు కల్పించింది. అసోసియేట్స్, ప్రొఫెసర్స్కు పదోన్నతులు ఇవ్వలేదు. దీంతో వారు పదోన్నతి పొందే అవకాశం లేకుండాపోయింది. కూర్చొనే చోటు కూడా లేదు ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు సైతం తరగతి గదుల్లో కూర్చునేందుకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదులు 125 మంది మాత్రమే కూర్చునేందుకు సరిపోయేలా నిర్మాణం చేశారు. ప్రస్తుతం 200 మంది వైద్య విద్యార్థులు ఉండటంతో కొంత మంది ఇరుక్కుని కూర్చుని లేదా నిలబడే క్లాసులు వినాల్సి వస్తుంది. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రసరణ లేదు. విద్యార్థులకు క్లాస్ రూమ్లోని బ్లాక్ బోర్డు చాలా దూరంగా ఉండి కంటి సమస్యలు వస్తున్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోవుతున్నారు. మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు సరిపడా లేక వైద్య విద్యార్థులకు అవస్థలు తప్పటం లేదు. మళ్లీ కేంద్ర ప్రభుత్వం మరో 50 సీట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సీట్లకే వైద్యులు, వైద్య సౌకర్యాలు లేక సతమతవుతుంటే అదనంగా వచ్చే 50 ఎంబీబీఎస్ సీట్లకు ఏ విధంగా వసతుల కల్పిస్తారో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రోగులకు తప్పని ఇక్కట్లు గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జీజీహెచ్ ఉంది. ఇక్కడ ఓపీలో వైద్య సేవలు పొందేందుకు ప్రతి రోజూ నాలుగు వేల మంది రోగులు వస్తున్నారు. వీరికి వైద్యసేవలను అందించే వైద్యులు సరిపడా లేరు. దీంతో రోగులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా ఆస్పత్రిలో 15 వైద్య యూనిట్స్ను పెంచాల్సి ఉంది. ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను మంజూరు చేయాలి. -
ఎమ్మెల్యే గారికి ఏ రోగం వచ్చింది?
ఎమ్మెల్యే గారికి ఏదైనా రోగం వస్తే దాని గురించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద తెలుసు కోవచ్చా? పది రూపాయల ఫీజుతో ఏదైనా అడగ వచ్చనే ధోరణి మనకు కనిపిస్తోంది. ప్రజలతో సంబంధం లేని, ప్రజాప్రయోజనం లేని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రొత్సహించడం మంచిది కాదు. ఒక్కోసారి ఎమ్మెల్యే చికిత్సకు విపరీతంగా ప్రజాధనం ఖర్చుచేసినప్పుడు అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో సురూప్ సింగ్ హ్రియా నాయక్ అనే ఎమ్మెల్యే కోర్టు ధిక్కార నేరం చేశారని సుప్రీంకోర్టు నెల రోజుల శిక్ష విధించింది. ఆయనను జైలుకు తీసుకుపోయిన ఒకటి రెండు రోజులకే ఛాతీ పట్టుకుని నొప్పి అనగానే అధికార పక్ష ఎమ్మెల్యే కనుక ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. 27 రోజులు చికిత్స చేశాక జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యేకు చేసిన చికిత్స ఆయన వ్యక్తిగత సమాచారం కాదు. ఆయ నకు అనారోగ్యం నిజమేనా? జైలు శిక్ష తప్పించు కుని, సకల సౌకర్యాలున్న ఆస్పత్రిలో గడపడానికి ఇలా నాటకమాడారా? అనే విషయం తెలుసుకోవల సిన అవసరం ఉంది. ప్రజాసేవకుడి గురించి సమా చారం దాచడానికి వీల్లేదన్నది నియమం. ఆయన వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదనేది దానికి మినహా యింపు. ఆ మినహాయింపునకు కూడా ఒక మినహా యింపు ఉంది, అదేమంటే ప్రజాప్రయోజనం ఉంద నుకుంటే ఆ సమాచారం కూడా ఇవ్వవలసిందే. భారత వైద్య మండలి చట్టం 1976 కింద ప్రొఫె షనల్ కాండక్ట్ (ఎటికెట్ అండ్ ఎథిక్స్) రెగ్యులేషన్ 2002 ప్రకారం వైద్య దస్తావేజులు, రోగి వైద్య పత్రాలు ఇతరులనుంచి గోపనీ యంగా ఉంచాలి. అవి అందరికీ ఇవ్వా ల్సిన వివరాలు కావు. కాని సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 8(1)(జే) ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రజాప్రయోజనం కోసం ఇవ్వవచ్చు. ఈ రెండు నియమాల మధ్య వైరుధ్యం ఏర్ప డినప్పుడు ఏ నియమాన్ని అనుసరిం చాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది. సూరూప్ సింగ్ హ్రియా నాయక్ కేసులో సమాచార హక్కు చట్టం కింద ఆయన రోగ వివరాల గురించి అడిగితే అది ఆయన వ్యక్తి గత సమాచారం అవుతుంది కనుక ఇచ్చేది లేదని ఆస్పత్రి వర్గాలు తిరస్కరించాయి. కేసు హైకోర్టుకు చేరింది. నాయక్ వైద్య చికిత్స, జబ్బు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జైలు శిక్ష తప్పించుకోవడానికే రోగం వచ్చినట్టు నటిస్తే అది న్యాయవ్యవస్థను మోసం చేసినట్టవుతుంది. ఛాతీ నొప్పికి 27 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయవ లసిన అవసరం రాదు. ఒకవేళ రోగం నకిలీ అనీ, చికిత్స పేరుతో జైలు శిక్ష తప్పించుకునే మోసమని తేలితే అది శిక్షార్హమైన నేరం అవుతుంది. కనుక ప్రజా ప్రయోజనం దృష్ట్యా సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. బాంబే హైకోర్టు మరో అంశాన్ని కూడా పరిశీలిం చింది. పార్లమెంటు, శాసనసభలకు నిరాకరించని సమాచారాన్ని ప్రజలకు నిరాకరించడానికి వీల్లేదని సెక్షన్ 8(1) కింద మినహాయింపు చేర్చారు. ఒకవేళ ఎమ్మెల్యే జబ్బు గురించి శాసనసభలో ఎవరైనా అడి గితే ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పకత ప్పదు. పౌరుడు సమాచారహక్కు చట్టం కింద అడిగితే కూడా ఇవ్వక తప్పదు. సమాచార హక్కు చట్టంతో వైద్య మండలి నియమాలు విభేదిస్తే, సమాచార హక్కు చట్టం నియమాలనే అనుసరిం చాల్సి వస్తుందని సమాచార చట్టంలో సెక్షన్ 22 స్పష్టంగా వివరిస్తోంది. కనుక సురూప్ సింగ్ హ్రియా నాయక్ జబ్బు, చికిత్స సమాచారం చెప్పవలసిందేనని బోంబే హైకోర్టు వివరించింది. ఈ విషయంలో ఏఐఆర్ 2007 బాంబే 121లో ప్రచురితమైన తీర్పు వెల్లడి నియమాలను నిర్దేశించింది. నిషాప్రియా భాటియా వర్సెస్ మానవ ప్రవర్తనా పరిశోధనా సంస్థ కేసులో ఒక మహిళ తనకు ఆస్పత్రిలో చేసిన చికిత్స వివ రాలు అడిగింది. దానికి ఆ ఆస్పత్రి అధికారులు తాము ఆమె భర్తపై నమ్మకంతో సమాచారం ఇచ్చా మని, దాన్ని వెల్లడించలేమని ఆ మహిళకు జవాబి చ్చారు. తప్పకుండా ఆ సమాచారాన్ని వెల్లడిం చాల్సిందేనని సమాచార కమిషనర్ 2014 జూలై24న ([CIC/AD/A/2013/001681SA) తీర్పు చెప్పారు. ఒక వ్యక్తికి చేసిన చికిత్స వివరాలు వాణిజ్య గోపనీయత కిందికి ఎలా వస్తాయో అధికారులు వివరించలేకపోయారు. ఇది ఒక అన్యాయాన్ని, నేర స్వభావాన్ని రక్షించడానికి సమాచారం నిరాకరించే దుర్మార్గం తప్ప మరొకటి కాదు. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
మా అనుమతితోనే వెళ్లాలి!
* విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోసం వెళ్లేవారికి ఎంసీఐ సూచన * లేదంటే సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేయలేమని స్పష్టీకరణ * అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ, ఈ ఏడాది నుంచే అమల్లోకి సాక్షి, హైదరాబాద్: ఏటా వేలాది మంది విద్యార్థులు కన్సల్టెన్సీల మాటలు నమ్మి విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా కోర్సు పూర్తిచేసి తిరిగొచ్చాక వారి సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు భారతీయ వైద్యమండలి అంగీకరించడం లేదు. కారణం వారు చదివిన కాలేజీలకు గుర్తింపు లేకపోవడమో, ప్రమాణాలు పాటించకపోవడమో సాకుగా చూపుతున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ..తామే చెబుతామంటోంది ఎంసీఏ. వైద్యవిద్య చదివేందుకు ఏ దేశానికి వెళ్తున్నారో, ఏ కాలేజీలో చదువుతున్నారో ముందుగానే తమకు చె ప్పాలని, తాము అనుమతిస్తేనే వెళ్లాలని సూచిస్తోంది. లేదంటే వచ్చాక తాము సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేయలేమని చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. ఈ ఆదేశాల్లో.. ‘భారతదేశం నుంచి ఎవరైనా విదేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లాలనుకుంటే దేశం విడిచి వెళ్లేముందే భారతీయ వైద్యమండలి నుంచి అర్హత ధ్రువపత్రం తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం ఈ సర్టిఫికెట్ తీసుకుని వెళితేనే విదేశాల్లో చేసిన ఎంబీబీఎస్ డిగ్రీని అనుమతిస్తాం. లేదంటే దాన్ని అంగీకరించలేమ’ని తెలిపింది. ఇది ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. ఈ నిబంధన 2014 నుంచే ఉన్నా చాలామంది అనుమతి లేకుండానే వెళ్తున్నారని ఎంసీఐ పేర్కొంది. ఇవి తప్పనిసరి... * విదేశాల్లో చదవడానికి వెళ్లేముందే ఎంసీఐ రూపొందించిన ప్రత్యేక దరఖాస్తు పూర్తిచేయాలి. * దరఖాస్తు ఫారాలను www.mciindia.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఢిల్లీలోని ఎంసీఐ ప్రధాన కార్యాలయంలో అందజేయాలి. * ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత కలిగిన ధ్రువపత్రాలను అందజేయాలి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement