-
మూడో నెలా ‘సేవలు’ పేలవం!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్వేవ్ నేపథ్యంలో సేవల రంగం వరుసగా మూడవనెల జూలైలోనూ క్షీణతలోనే ఉంది. ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జూలైలో 45.4గా నమోదయ్యింది. జూన్లో ఇది 41.2 వద్ద ఉంది. అయితే సూచీ 50పైన ఉంటేనే దానిని వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సేవల రంగంలో వ్యాపార క్రియాశీలత, కొత్త ఆర్డర్లు, ఉపాధి కల్పన మరింత భారీగా పడిపోయినట్లు నెలవారీ సర్వే వెల్లడించినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. రాబోయే ఏడాది ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమలు నిరాశాజనకంగా ఉండడం మరో అంశం. ఈ తరహా నిరాశావాద ధోరణి ఏడాదిలో ఇదే తొలిసారి. మహమ్మారి కనుమరుగవడంపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు జూలైలో వ్యాపార విశ్వాసాన్ని దెబ్బతీసినట్లు డీ లిమా పేర్కొన్నారు. ఈ రంగంలో వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ ఉపాధి అవకాశాలు క్షీణతలోనే ఉన్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా సేవల రంగానిదే. సేవలు, తయారీ కలిపినా మైనస్సే... మరోవైపు సేవలు, తయారీ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ వరుసగా మూడవనెలా క్షీణతలోనే కొనసాగింది. జూన్లో 43.1 వద్ద ఇండెక్స్ ఉంటే, జూలైలో 49.2 వద్దకు చేరింది. ఇండెక్స్ కొంత పెరగడమే ఇక్కడ ఊరట. 50కి పైన సూచీ వస్తేనే కాంపోజిట్ ఇండెక్స్ వృద్ధిలోకి మారినట్లు భావించాల్సి ఉంటుంది. ముడి పదార్థాల ధరల తీవ్రత సూచీలపై పడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది. జూలైలో ఒక్క తయారీ రంగం మాత్రం క్షీణత నుంచి బయటపడ్డం కొంతలో కొంత ఊరటనిస్తున్న అంశం. జూన్లో 48.1 వద్ద క్షీణతలో ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 55.3 వృద్ధిలోకి మారింది. వరుసగా 36 నెలలు 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ పీఎంఐ, కరోనా కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి 2020 ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చి, అదే జోరును కొనసాగించింది. అయితే సెకండ్వేవ్ ప్రభావంతో జూన్లో తిరిగి క్షీణతలోకి జారింది. -
‘సేవల’పై నీలినీడలు: హెచ్ఎస్బీసీ
న్యూఢిల్లీ: దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 60 శాతం ఉన్న సేవల రంగం మే నెలలో అసలు వృద్ధి లేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఇలాంటి పరిస్థితి గడిచిన 13 నెలల్లో ఇదే తొలిసారి. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజి నెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఏప్రిల్లో 52.4 పాయింట్ల వద్ద ఉంటే మేలో ఈ పాయింట్లు 49.6కు పడిపోయాయి. ఆర్డర్లు తగ్గడం, పెరిగిన ధరలు వంటివి దీనికి కారణమని హెచ్ఎస్బీసీ పేర్కొంది. తాజా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫలితం క్షేత్ర స్థాయిలో వాస్తవ ఆర్థిక అభివృద్ధిపై సందేహాలను లేవనెత్తుతోంది. కాగా తయారీ, సేవల రంగాలు రెండింటికీ సంబంధించి కాంపోజిట్ హెచ్ఎస్బీసీ ఇండెక్స్ కూడా మేలో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడింది. ఏప్రిల్లో ఈ పాయింట్లు 52.5 వద్ద ఉండగా, మేలో 51.2కు తగ్గింది. 50 పాయింట్ల పైన హెచ్ఎస్బీసీ సూచీ ఉంటే, అది సానుకూలంగానే భావించడం జరుగుతుంది. 50 పాయింట్ల లోపునకు పడిపోతే అది క్షీణతకు ప్రతిబింబం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement