breaking news
inappropriate assets
-
కుక్కల కోసం లగ్జరీ ఫ్లాట్.. పార్థ చటర్జీ ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో ఆయనకు సంబంధించిన మరిన్ని అక్రమాస్తులు బయటపడుతున్నాయి. కోల్కతాలో ఖరీదైన డైమండ్ సిటీలో మంత్రిగారికి మూడు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఒకటి కేవలం కుక్కల కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఆ ఫ్లాట్కు ఏసీ కూడా ఉందట. పార్థ చటర్జీకి జంతుప్రేమికుడని గుర్తింపు ఉంది. అందుకే శునకాల కోసం ప్రత్యేకంగా ఫ్లాట్ను కొనుగోలు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పార్థ చటర్జీని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదు, రూ.కోటి కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్పితకు పార్థ చటర్జీ మూడు ఫ్లాట్స్ను కానుకగా ఇచ్చారని, వాటిలో ఒక నివాసంలోనే డబ్బు, బంగారం సీజ్ చేసినట్లు ఈడీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు వీరిద్దరి పేరు మీద బోల్పుర్లోని శాంతినికేతన్లో ఓ అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. దీంతో శాంతినికేతన్లోని ఏడు ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లపై అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మమతకు ఫోన్ అరెస్టయిన రోజు మంత్రి పార్థ చటర్జీ సీఎం మమతా బెనర్జీకి నాలుగు సార్లు ఫోన్ కాల్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఉదయం 1:55 గంటలకు, 2:33 గంటలకు ఫోన్ చేస్తే మమత ఎత్తలేదని పేర్కొన్నాయి. ఆ తర్వాత తిరిగి 3:37 గంటలకు, 9:35 గంటలకు ఫోన్ చేసినా మమత నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పాయి. అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేయమని అడిగినప్పుడు సీఎంకే ఆయన ఫోన్ చేసినట్లు వివరించాయి. అయితే టీఎంసీ మాత్రం దీన్ని ఖండించింది. సీఎం మమతకు పార్థ చటర్జీ ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని పేర్కొంది. చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..! -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
-
పీసీబీ ఇంజనీర్కు 6 కోట్ల అక్రమాస్తులు
-
పీసీబీ ఇంజనీర్కు 6 కోట్ల అక్రమాస్తులు
కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఇంజనీర్ రమేష్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ఆయనకు సుమారు రూ .6 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 10 చోట్ల ఉన్న రమేష్ ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిగాయి. రమేష్ ఆస్తులతోపాటు ఆయన భార్య శశి ఆస్తులను కూడా వారు తనిఖీ చేశారు. ఆయనకు మొత్తం పది ఇళ్ల స్థలాలు, మూడు ఫ్లాట్లు, పదెకరాల వ్యవసాయ భూమి, 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రమేష్ భార్య శశి పేరు మీద మూడు బ్యాంక్ లాకర్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 30-40 తులాల వరకు బంగారం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు పీసీబీ ఇంజనీర్ రమేష్ను అదుపులోకి తీసుకున్నారు.