breaking news
Implument bail
-
అందని ‘చంద్రన్న పెళ్లి కానుక’
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తాం. చంద్రన్న పెళ్లి కానుక అందించి ఆర్థికంగా ఆసర కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలింకా కార్యరూపం దాల్చలేదు. ఆర్భాటంగా ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకం ప్రకటించి.. కానుకలివ్వకుండా సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చేసి వధూవరులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పథకంలో రాష్ట్రంలో తొలిసారిగా నమోదైన పెళ్లికే కానుక అందని పరిస్థితి విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 18న చంద్రన్నపెళ్లి కానుక జీవో విడుదలైంది. నగరంలో ఏవీఎన్ కళాశాల సున్నపు వీధికి చెందిన రావులపూడి నందిని(ఎస్సీ)కి హరీష్(కాపు)నకు సింహాచలం పుష్కరిణి కల్యాణ మండపంలో అదే నెల 21న కులాంతర వివాహం జరిగింది. ప్రభుత్వ సూచనల మేరకు నందిని తల్లిదండ్రులు 1100కి ఫోన్ చేసి ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో తొలిసారి చంద్రన్న పెళ్లి కానుకకు అర్హులయ్యారని ప్రభుత్వం భారీగానే ప్రచారం చేసుకుంది. వీరిని లబ్ధిదారులుగా ప్రకటించింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ అధికార యంత్రాంగంతో పెళ్లికి హాజరయ్యారు. కులాంతర వివాహం.. అందులోనూ వధువు నుంచి గానీ, వరుడు నుంచి గానీ పిలుపు లేకుండానే అతిరథమహాశయులు వచ్చారని అంతా ఆశ్చర్యపోయారు. తాము చంద్రన్న పెళ్లి కానుక నేపథ్యంలో వచ్చామని చెప్పి వివాహ శుభాకాంక్షల పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చి ఆశీర్వదించారు. అయితే చంద్రబాబు ప్రకటించిన ప్రకారం ఈ దంపతులకు రూ. 75 వేల నగదు కానుక అందాల్సి ఉంది. వివాహ తంతు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా.. ప్రభుత్వం నుంచి దంపతుల ఖాతాలో రూపాయి కూడా పడలేదు. దీంతో వధువు తల్లిదండ్రులు రవి, లలిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 1100 కి ఫోన్ చేస్తే వెలుగు ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడికి వెళ్తే జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లాలని పంపేస్తున్నారు. అక్కడికి వెళితే సర్వర్ సమస్య చెబుతున్నారు. ఇలా అధికారులు తమను బంతాట ఆడుకుంటున్నారని రవి, లలిత ఆవేదన చెందుతున్నారు. ఆటో డ్రైవర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించే రవి భార్యతో కలిసి చంద్రన్న పెళ్లికానుక పత్రంతో ప్రదక్షిణలు చేస్తుండడం అందరికీ జాలి గొలుపుతోంది. -
ఏసీబీ వలలో సీసీఎస్ సీఐ
బెయిల్ ఇంప్లూమెంట్కు డబ్బులు డిమాండ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు పథకం ప్రకారం సీఐ, హెడ్కానిస్టేబుల్ను పట్టుకున్న వైనం పోచమ్మమైదాన్, న్యూస్లైన్ : ఏసీబీ అధికారుల చేతి కి మరో అవినీతి చేప చిక్కింది. బెయిల్ ఇంప్లూమెం ట్(కొనసాగించేందుకు) కోసం డబ్బులు డిమాండ్ చేసినందుకు వరంగల్ అర్బన్ సీసీఎస్-2 సీఐ శివసాంబిరెడ్డితోపాటు హెడ్ కానిస్టేబుల్ ఐలయ్యను బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు పథకం ప్రకా రం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథ నం ప్రకారం.. డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ సస్పెండ్కు గురైన ఫక్రుద్దీన్ బధీ ర ఉపాధ్యాయుల అక్రమ నియామకం కేసులో నింది తుడు. 2012 డీఎస్సీలో నలుగురు బధీర ఉపాధ్యాయుల నియామకాల్లో ఫక్రుద్దీన్ హస్తం కూడా ఉంద ని వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు ఇటీవల అతడికి అరె స్ట్ వారెంట్ను జారీచేశారు. దీంతో ముందస్తు బెయిల్ ఫక్రుద్దీన్ వరంగల్ కోర్టులో ఇటీవల దరఖా స్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో ఫక్రుద్దీన్ బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు హైకోర్టు అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ను ఇంప్లూమెంట్ చేయాలని ఫక్రుద్దీన్ ఇటీవల వరంగల్ అర్బన్ సీసీఎస్ సీఐ శివసాంబిరెడ్డిని కోరాడు. కాగా, బె యిల్ ఇంప్లూమెంట్ కోసం సీఐ.. ఫక్రుద్దీన్ నుంచి రూ. 50వేలు డిమాండ్ చేశారు. అయితే తన దగ్గర అంత డ బ్బు లేదని చెబుతూ.. తన సమీప బంధువు రిటైర్డ ఎస్సై మస్తాన్ను తీసుకెళ్లి సీఐ దగ్గర ప్రాధేయపడ్డాడు. దీంతో కనీసం తనకు రూ.27వేలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేయగా దానికి ఫక్రుద్దీన్ ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా మొత్తం నాలుగు కేసుల్లో సీఐ రెండింటికి బెయిల్ మంజూరు చేశాడు. అయితే మరో రెండింటికి డబ్బులిచ్చినాకానే ఇస్తానని సీఐ చెప్పాడు. కాగా, ఇదే విషయమై సీఐ.. ఫక్రుద్దీన్కు ప్రతి రోజు ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు తీసుకొస్తున్నావని వేధిస్తున్నాడు. దీంతో సీఐ వేధింపులను భరించలేని బాధితుడు ఫక్రుద్దీన్ తన సమీప బంధువు రిటైర్డ ఎస్సై మస్తాన్ సాయంతో ఇటీవల ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు మట్టెవాడలోని అర్బన్ సీసీఎస్ పోలీస్స్టేషన్కు చేరుకుని డబ్బులు తీసుకొచ్చినట్లు రిటైర్డ ఎస్సై మస్తాన్.. సీఐ శివసాంబి రెడ్డికి సమాచారం అందించాడు. దీంతో సీఐ వెంటనే తన పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ అయిలయ్యను పిలిచి ఫక్రుద్దీన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకురా.. అని బయటకు పంపించాడు. కాగా, ఫక్రుద్దీన్, రిటైర్డ ఎస్సై మస్తాన్లు పోలీస్స్టేషన్ సమీపంలోని కారులో కూర్చుని కానిస్టేబుల్ అయిలయ్యకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అయిలయ్య దగ్గర ఉన్న రూ. 25వేల నగదును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏసీబీ అధికారులు రిటైర్డ ఎస్సై మస్తాన్ దగ్గర ఉన్న వాయిస్ రికార్డింగ్ ను పరిశీలించి సీఐ శివసాంబిరెడ్డిని, ఐలయ్య అరెస్ట్ చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రఘువేందర్రావు, సాంబయ్య, బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి రెండు సార్లు సస్పెండ్..? ఇదిలా ఉండగా, ఏసీబీకి చిక్కిన సీసీఎస్ సీఐ శివసాంబిరెడ్డి ఇప్పటివరకు రెండుసార్లు విధుల నుంచి సస్పెండ్ అయినట్లు తెలిసింది. నర్సంపేట పోలీస్స్టేషన్లో నల్లబెల్లం కేసులో, అలాగే నర్మెటలో భూమి కేసులో సస్పెండ్ అయినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి.