-
వచ్చేనెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు 14న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిíßంచాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, క్యాంపు అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు. వచ్చేనెల నెల 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది. 7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 12న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. వారికి వచ్చేనెల 14న సీట్లు కేటాయించనుంది. ప్రస్తుతం ఐసెట్లో అర్హత సాధించిన వారు 69,900 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అది పూర్తి కాగానే సీట్ల సంఖ్య తేలనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాల్సిన వివరాలు, వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, హెల్ప్లైన్ కేంద్రాల వివరాలను ్టటజీఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో పొందొచ్చు. స్పెషల్ కేటగిరీ వారికి మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈసారి కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు. వెంటతెచ్చుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు హా ఐసెట్ ర్యాంకు కార్డు, హా హాల్టికెట్, హా ఆధార్ కార్డు, హా డిగ్రీ మార్కుల మె మో, పాస్ సర్టిఫికెట్, హా ఇంటర్మీడియట్ తత్సమాన మార్కుల మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, హా పదో తరగతి మార్కుల మెమో, హా 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, హా 2017 జనవరి 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, హా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు హా నాన్ లోకల్ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రులు 10 ఏళ్లు తెలంగాణలో నివసించిన నివాస ధ్రువీకరణ పత్రం, హా రెగ్యులర్గా చదువుకోని వారైతే 7 ఏళ్ల నివాస ధ్రువీకరణపత్రం. -
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్లైన్: వాయిదాలు పడుతూవస్తున్న ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు మంగళవారం ప్రారంభమైంది. ఉన్నత విద్యామండలి ఎంబీఏ, ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్టు ఐసెట్- 2013 వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థుల ధ్రువీ కరణ పత్రాలను పరిశీలించగా తొలిరోజు 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 వేల లోపు ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ ప్రక్రియ ఉదయం తొమ్మిది గంటలకు షెడ్యూల్ మేరకు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంటర్నెట్ మొరాయించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రెండున్నర గంటలు ఆలస్యంగా 11.30 గంటలకు ప్రారంభించారు. యూపీఎస్ ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ను ప్రారంభించే సరికి జాప్యం జరగడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే సాయంత్రం వరకూ సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన జరగడంతో ఊపిరి పీల్చు కున్నారు. బీఆర్ఏయూ వీసీ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ కౌన్సెలింగ్ను పర్యవే క్షించారు. ఐసెట్లో 91వ ర్యాంకు సాధించిన స్వాతికుమారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీసీ ఈమెకు స్క్రాచ్ కార్డు అందజేసి అభినందనలు తెలియజేశారు. రిజస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, సీడీసీ డీన్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, కౌన్సెలింగ్ ఇన్చార్జి డాక్టర్ విజయభాస్కర్ కూడా కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. బుధవారం 40 వేల ర్యాంకులోపు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. వర్సిటీ సహాయ కేంద్రానికి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల విద్యార్థులు హాజరు అవుతుండటంతో తాకిడి ఎక్కువగానే ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement