breaking news
Hyundai Eon
-
హ్యుందాయ్ ఇయాన్పై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ : హ్యుందాయ్ ఇండియా తన ఐకానిక్ శాంట్రోను రీ-లాంచ్ చేయబోతుంది. ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ప్రధాన పోటీదారుగా శాంట్రో మార్కెట్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ మోడల్ ఇయాన్పై భారీ డిస్కౌంట్ను హ్యుందాయ్ ప్రకటించింది. ఇయాన్పై 45వేల రూపాయల వరకు డిస్కౌంట్ను, అదనపు ఎక్స్చేంజ్ బోనస్గా మరో 10వేల రూపాయలను అందించనున్నట్టు పేర్కొంది. డిస్కౌంట్కు ముందు హ్యుందాయ్ ఇయన్ బేస్ వేరియంట్ ధర ఎక్స్షోరూం ఢిల్లీలో రూ.3.3 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.4.66 లక్షలుగా ఉంది. కంపెనీ అందిస్తున్న రూ.60వేల వరకు డిస్కౌంట్ అనంతరం, బేస్ వేరియంట్ ధర రూ.2.7 లక్షలకు తగ్గింది. రెండు ఇంజిన్ వేరియంట్లలో ఈ కారు లభ్యమవుతుంది. ఒకటి 0.8 లీటర్ ఇంజిన్, మరొకటి 1 లీటరు ఇంజిన్. మారుతీ బెస్ట్ సెల్లింగ్ వాహనాలు వ్యాగన్ ఆర్, ఆల్టోలకు ఇయాన్ ప్రధాన పోటీదారిగా ఉంటుంది. ఇంధన పరంగా పెట్రోల్, ఎల్పీజీ మోడల్స్లో ఇది లభ్యమవుతుంది. హ్యుందాయ్ తన కొత్త శాంట్రోను ఈ పండుగ సీజన్ల కంటే ముందే లాంచ్ చేస్తోంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ కారుగా కంపెనీ దీన్ని ప్రమోట్ చేస్తోంది. హ్యుందాయ్ తొలి ఏఎంటీ గేర్బాక్స్తో ఈ కొత్త వాహనం మార్కెట్లోకి వస్తోంది. భారత్లో హ్యుందాయ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును విపణి నుండి తొలగించిప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ శాంట్రో కారును మళ్లీ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. శాంట్రో బ్రాండ్ యథావిధిగా కొనసాగినప్పటికీ, డిజైన్ పరంగా పూర్తి కొత్తగా ఉండబోతుంది. -
హ్యుందాయ్ ఇయాన్.. కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన ఎంట్రీలెవెల్ చిన్న కారు ‘ఇయాన్’లో కొత్త వేరియంట్ను మంగళవారం ఇక్కడ ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.3.83 లక్షలు(ఎక్స్షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. 1 లీటర్ కప్పా ఇంజిన్(ఇయాన్ మాగ్నా ప్లస్)తో పాటు ఇప్పుడున్న 0.8 లీటర్ ఇంజిన్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈఓ బీఎస్ సియో చెప్పారు. ఈ కొత్త వేరియంట్ అధిక ఇంజిన్ సామర్థ్యం, తక్కువ కాలుష్యం, మరింత మెరుగైన మైలేజీని అంది స్తుందన్నారు. కస్టమర్ల డిమాండ్కు అనుగుణంగా తమ కార్లలో వినూత్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు చేర్చుతున్నామని, దీని ద్వారా దేశీ మార్కెట్లో తమ వాటా మరింత సుస్థిరం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.