-
శరవేగంగా పోలవరం పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం), జలవిద్యుత్ కేంద్రం పనులకు శుక్రవారం భూమి పూజ చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ శనివారం పనులు ప్రారంభించింది. శరవేగంగా పనులు పూర్తి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, 24 గంటలూ పనులు చేయడం ద్వారా రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ సంస్థ ప్రణాళిక రచించింది. భారీగా యంత్ర సామగ్రిని ప్రాజెక్టు వద్దకు తరలించింది. పోలవరం సీఈ సుధాకర్బాబు పర్యవేక్షణలో మేఘా ఇంజనీర్లు, కార్మికులు పనులు ప్రారంభించారు. గోదావరికి ఇటీవల వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పాడైన అప్రోచ్ రోడ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేస్తున్నారు. భారీ యంత్రాలు 24 గంటలూ రాకపోకలు సాగించడానికి వీలుగా రహదారులను పటిష్టంగా నిర్మిస్తున్నారు. నదిలో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తొలుత స్పిల్ వే పనులను చేపట్టాలని కాంట్రాక్టు సంస్థకు అధికారులు దిశానిర్దేశం చేశారు. దాంతో స్పిల్ వే పనులకు శ్రీకారం చుట్టిన మేఘా.. స్పిల్ వే, స్పిల్ చానల్ సమీపంలో నిల్వ ఉన్న నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క గోదావరిలో వరద తగ్గే కొద్దీ పనుల వేగం పెంచేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. స్పిల్ వే, స్పిల్ చానల్ పనులకు సమాంతరంగా వరద తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, జలవిద్యుత్ కేంద్రం పనులను చేపట్టి.. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని మేఘా పేర్కొంది. -
8.120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో గురువారం నుంచి శుక్రవారం వరకు 8.120 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టులో 4.089 మిలియన్ యూనిట్లు, తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టులో 4.031 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. రెండు పవర్హౌస్లలో డిమాండ్ను అనుసరించి ఉత్పాదన జరుగుతోంది. ఉత్పాదన అనంతరం సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 109 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 861 అడుగులుగా నమోదైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement