-
ఎంఈఐఎల్ 130 ప్రాజెక్టుల రికార్డు!
ఇంజినీరింగ్, ఇన్ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 220 కేవీ సబ్స్టేషన్ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట్ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది. 2018-19 సంవత్సరానికి గాను తెలంగాణాలో మిషన్ భగీరథ కింద కరీంనగర్, సిరిసిల్లా, వెములవాడ, చొప్పదండి, పెద్దపల్లి-రమగుండం,మహబూబ్నగర్, నల్గొండ, పాలేరు-వరంగల్ వంటి ప్రాజెక్ట్లతో పాటు రాజస్థాన్లోని రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్ ప్లాంట్, అసింద్, కోట్రి, షాపుర, పాలి, ఓడిషాలోనిభూవనేశ్వర్ బల్క్ వాటర్, కియోన్జహర్ వాటర్ ప్రాజెక్ట్, అలాగే ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఆగ్రా లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక సాగునీటి రంగంలో పురుషోత్తపట్నం స్టేజ్-2, కొండవీటివాగు, చింతలపూడి, హంద్రీ-నీవా ఫేస్-2, కర్నాటకలోని ఉత్తర కోలార్, దసరహళ్లి, కాన్వా, గుజరాత్లోని సౌనీయోజనతో పాటు ఆరు ఎత్తిపోతల పథకాలను దిగ్విజయంగా పూర్తిచేసింది. అలాగే విద్యుత్ రంగంలో నర్సాపూర్, కలికిరి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం, పొదిలి, సత్తేనపల్లి ప్రాజెక్ట్లను పూర్తి చేసింది. ఎంఈఐఎల్ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్ల్లో భాగమైన నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్గానే పరిగణిస్తారు. రికార్డ్ సమయంలో రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్... రికార్డ్ సమయంలో రాజస్థాన్లోని రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ను 6 నెలల్లోనే పూర్తి చేసింది. కెయిర్న్ ఇండియా కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులను 2018 సెప్టెంబర్లో మొదలుపెట్టి మార్చి 2019 నాటికి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ఎంఈఐఎల్ 18నెలల పాటు చూడనుంది. సౌరాష్ట్ర బ్రాంచ్కెనాల్పై జల విద్యుత్... అలాగే గుజరాత్లోని సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్పైన రెండు హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఎంఈఐఎల్ పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందులో ఒక్కో యూనిట్లో 15 మెగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. మరో 15 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్లాంటును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. మూడో ప్లాంటు అందుబాటులోకి వస్తే మొత్తం 45 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి అవుతుంది. రాయచూర్లో వైటీపీఎస్ ఇక కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో వైటీపీఎస్ ప్రాజెక్ట్ను గడువుకంటే ముందే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ప్లాంటుకు అవసరమైన నీటిని కృష్ణనది నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కసారి ప్లాంట్లులో వాడిన నీటిని (బూడిద నీరు) చెరువులకు పంపించి చెరువు ద్వారా మళ్లీ నీటినివైటీపీఎస్ ప్లాంట్కు తరళించేలా ఏర్పాట్లు చేశారు. నీటి వృథా కాకుండా ఎంఈఐల్ ఇలా ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలోని లింక్-1 సబ్స్టేషన్లు... ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లింక్-1 సబ్స్టేషన్లను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ప్యాకేజ్-8 సబ్స్టేషన్ను విజయంతంగా పూర్తిచేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని నాలుగు సబ్స్టేషన్లు అందుబాటులోకివచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్కు గుండెకాయ లాంటి లింక్-1లోని ప్యాకేజ్-8 రామడుగు 400 కేవీ సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ విజయవంతంగా చార్జ్చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భూగర్భ పంపింగ్స్టేషన్ను ప్యాకేజ్-8లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ పంప్హౌస్లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంకలిగిన 7 భారీ పంప్మోటార్లకు విద్యుత్ అందించేలా రామడుగులో 400/13.8/11 కేవీ సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ విజయంతంగా చార్జ్ చేసింది. 360 మెగావాట్ల మొత్తం సామర్థ్యం కలిగిన 9 పంప్మోటర్లను సుందిళ్లలో ఏర్పాటు చేశారు. ఈ మోటార్లకు విద్యుత్ను అందించేందుకు 400 కేవీ సబ్ష్టేషన్, 480 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్హౌజ్లోని 12 పంప్ మోటార్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీఅన్నారం సబ్స్టేషన్, 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మేడిగడ్డ పంప్హౌజ్లోని 17 పంప్మోటార్లకు విద్యుత్ను అందించేందుకు 220/11 కేవీ మేడిగడ్డ సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరానికి తాగునీటి సరఫరా పథకంలో భాగంగా 70,000 గృహాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ప్రాజెక్టును కూడా ఎంఈఐఎల్ దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇందుకుగాను ఎంఈఐఎల్ 544 కిలోవాట్ల సామర్థ్యం గల మూడు టర్బైన్ పంప్లను ఏర్పాటు చేసింది. రోజుకు 122 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసేలా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో పురుషోత్తపట్నం స్టేజ్-2, హంద్రీనీవా రెండో దశ, కొండవీటివాగు, చింతలపూడి ప్రాజెక్టులను కూడా రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. -
‘జూరాల’లో కాలిన టర్బయిన్లు
గద్వాల (మహబూబ్నగర్), న్యూస్లైన్: మహబూబ్నగర్ జిల్లా జూరాల జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో మూడు టర్బయిన్లు కాలిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా 2,3,5 టర్బయిన్లు పూర్తిగా.. 6వ టర్బయిన్ పాక్షికంగా కాలిపోయాయి. దీంతో జెన్కోకు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లయింది. గ్రిడ్ నుంచి రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని జెన్కో అధికారులు తెలిపారు. నాలుగు టర్బయిన్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి కనీసం ఏడాది పడుతుందని విద్యుత్రంగ నిపుణులు చెబుతున్నారు. గత నెల 21నే తొలిసారి ఆరు టర్బయిన్ల ద్వారా పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటిద్వారా 200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి సమయంలో సాంకేతిక లోపం కారణంగా 2, 3, 5, 6 టర్బయిన్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సమీపంలోని వెల్టూరు గ్రిడ్కు లింక్ ఉన్నందున రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతో మూడు టర్బయిన్లు(2,3,5) కాలిపోగా, 6వ టర్బయిన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 1, 4 టర్బయిన్లు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ రెండు టర్బయిన్లకు విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద ఉన్న 11కెవీ సబ్స్టేషన్తో అనుసంధానం ఉన్నందున రివర్స్ విద్యుత్ సరఫరా అయినప్పటికీ కాలిపోకుండా నిలిచిపోయాయి. మిగతా నాలుగు టర్బయిన్లకు సబ్స్టేషన్తో అనుసంధానం లేకపోవడంవల్లనే కాలిపోయాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే టర్బయిన్లలో వైరింగ్ పూర్తిగా కాలిపోయి ఉండకపోవచ్చని, కేవలం ప్యానల్స్ మాత్రమే కాలిపోయి ఉంటాయని జెన్కో అధికారులు భావిస్తున్నారు. బుధవారం టర్బయిన్లను ఓపెన్ చేస్తేకాని నష్టాన్ని అంచనా వేయలేమంటున్నారు. ఒప్పందం ప్రకారం సీఎంఈసీ రెండేళ్లపాటు ఈ టర్బయిన్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే టర్బయిన్ల ఏర్పాటు ఆలస్యమైన నేపథ్యంలో చైనా కంపెనీ ఇచ్చిన వారంటీ గత ఏడాదితో ముగిసింది. దీంతో ప్రస్తుతం జూరాల జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద నష్టాన్ని జెన్కోనే భరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సాంకేతిక లోపమే కారణం: ఆదిశేషు, జెన్కో డెరైక్టర్ సాంకేతిక లోపంతో టర్బయిన్లు నిలిచిపోయాయి. రివర్స్ విద్యుత్ సరఫరావల్ల కాలిపోయాయి. చైనా నిపుణులతో ఇప్పటికే సంప్రదించాం. త్వరలోనే నిపుణులను పిలిపించి వీలైనంత త్వరగా టర్బయిన్లను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
తల్లడిల్లుతున్నారు..!
భారత బాక్సర్ల పసిడి పంచ్
పుతిన్ ఐదోసారి ప్రమాణం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement