breaking news
humsafar express
-
ఇంటి వద్దకు డీజిల్ బల్క్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తాజాగా ముంబై, పరిసర ప్రాంతాల్లో ఇంటి వద్దకే బల్క్గా డీజిల్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇందుకోసం యాప్ ఆధారిత డీజిల్ డోర్ డెలివరీ సేవల సంస్థ హమ్సఫర్ ఇండియా, ఒకారా ఫ్యూయెలాజిక్స్తో చేతులు కలిపింది. త్వరలో మహారాష్ట్రలోని పుణె, నాగ్పూర్, నాసిక్ తదితర నగరాలకు ఈ సర్వీసులు విస్తరించనున్నట్లు ఐవోసీ చీఫ్ జనరల్ మేనేజర్ (మహారాష్ట్ర ఆఫీస్) రాజేశ్ సింగ్ తెలిపారు. డీజిల్ పంపిణీలో ఇదొక వినూత్న విధానమని ఆయన వివరించారు. వ్యవసాయ రంగం, ఆస్పత్రులు, హౌసింగ్ సొసైటీలు, భారీ యంత్రాల కేంద్రాలు, మొబైల్ టవర్లు మొదలైన వాటికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటిదాకా భారీ మొత్తంలో డీజిల్ కొనుక్కునే (బల్క్) వినియోగదారులు బ్యారెళ్లలో రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేదని సింగ్ తెలిపారు. దీని వల్ల గమ్యస్థానానికి చేరేలోగా డీజిల్లో కొంత భాగం కారిపోవడం తదితర సమస్యల వల్ల నష్టపోవాల్సి వచ్చేదని ఆయన వివరించారు. డీజిల్ డోర్ డెలివరీతో ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని, బల్క్ కస్టమర్లకు చట్టబద్ధంగా డీజిల్ సరఫరా సాధ్యపడుతుందని సింగ్ పేర్కొన్నారు. -
తిరుపతి నుంచి ఢిల్లీకి హమ్సఫర్ ఎక్స్ప్రెస్
గురువారం ప్రారంభించనున్న రైల్వే మంత్రి తిరుపతి అర్బన్: ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి ఏసీ బోగీలతో కూడిన ఎక్స్ప్రెస్ రైలు రాయలసీమ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. తిరుపతి–జమ్ముతావి మధ్య హమ్సఫర్ ఎక్స్ప్రెస్ పేరుతో నడవనున్న ఈ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ హమ్సఫర్ ఎక్స్ప్రెస్(22705) ప్రతి మంగళవారం సాయంత్రం 5.10కి తిరుపతి నుంచి బయల్దేరి గురువారం రాత్రి 9.10కి జమ్ముతావి చేరుకుంటుంది. ఈ రైలు(22706) తిరిగి జమ్ముతావి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 5.30కు బయల్దేరి ఆదివారం ఉదయం 11.20కి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోనీ, మంత్రాలయం రోడ్డు, రాయచూర్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఖాజీపేట, రామగుండం, నాగపూర్, ఢిల్లీ, అంబాలా, లూథియానా, మీదుగా జమ్ముతావి వెళుతుంది. -
పట్టాలపైకి ‘హంసఫర్’
- గుంతకల్లు–తిరుపతి మధ్య ట్రయల్ రన్ గుంతకల్లు : సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ ఆమితాబ్ ఓజా చెప్పారు. 2016–17 రైల్వే బడ్జెట్లో రైల్వే మంత్రి సురేష్ప్రభు తిరుపతి నుంచి ఉత్తరాది రాష్ట్రంలోని జమ్మూతావి క్షేత్రంలోని వైష్ణవిదేవి ఆలయం సందర్శనార్థం హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రవేశపెట్టారు. ఈ రైలు గుంతకల్లు నుంచి తిరుపతి మధ్య శుక్రవారం ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం అమితాబ్ ఓజా, ఏడీఆర్ఎం సుబ్బరాయుడు తదితర అధికారుల బృందం గుంతకల్లులో రైలును పరిశీలించారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ సాధారణ ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించాలనే ఉద్దేశంతోనే హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారన్నారు. కోచ్లను జీపీఎస్ (గ్లోబుల్ పొజిషన్ సిస్టం) బేస్డ్ ప్యాసింజర్ పద్ధతిన నిర్మించినట్టు చెప్పారు. ప్రయాణ సమయంలో ముందస్తు రైల్వేస్టేషన్ వివరాలు, ప్రయాణ దూరం తెలియజేస్తూ ఆటోమెటిక్ డిస్ప్లే అవుతుందన్నారు. సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కావడంతో వేగాన్ని పరిశీలించడానికి ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెప్పారు. ట్రయల్ రన్లో డివిజనల్ అధికారులు, సీనియర్ డీఓఎం ఆంజినేయులు, సీనియర్ డీఈఈ (మెయింటెనెన్స్) అంజయ్య, సీనియర్ డీఈఈ (టీఆర్డీ) విజయేంద్రకుమార్, సీనియర్ డీఈఎన్ (కోఆర్డినేషన్) మనోజ్కుమార్, ఏసీఎంలు రాజేంద్రప్రసాద్, ఫణికుమార్, స్టేషన్ మాస్టర్ లక్ష్మానాయక్, సీటీఐ వై ప్రసాద్, సీఎంఎస్లు ఫజుల్ రహిమాన్, ఖాదర్భాషా పాల్గొన్నారు. ‘హంసఫర్’ ప్రత్యేకతలు - రైలులో 18 త్రీటైర్ ఏసీ కోచ్లు ఉంటాయి. ప్రతి కోచ్లోనూ 6 సీసీ కెమెరాలు, కోచ్ ప్రధాన ద్వారం రెండు వైపులా 2 చొప్పున సీసీ కెమెరాలు ఉంటాయి. - అగ్ని ప్రమాదాలు, సాంకేతిక లోపాల కారణంగా పొగలు తదితరాలు ఏర్పడితే ఆటోమెటిక్ అలారం మోగుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం అలారం యంత్రంలో డిస్ప్లే అవుతుంది. - బోగీలో సీటు సీటుకు ప్రత్యేక కర్టెన్ - అత్యాధునిక పరికరాలతో ఆకర్షణీయ రంగులతో ప్రత్యేక మరుగుదొడ్లు - బాత్రూంలో కూడా అందుబాటులో సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్లు - బోగీ నుంచి బోగీకి మధ్య ఆటోమెటిక్ డోర్ కంట్రోల్ సిస్టం - హాట్కేస్ భోజన, అల్పాహార సదుపాయం - ఆటోమేటిక్ వెడ్డింగ్ మిషన్ ద్వారా టీ, కాఫీ, పాలు ఇతర తేనీటి విందు ఏర్పాటు - హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు చార్జీలు ఇతర మెయిల్, ఎక్స్ప్రెస్ రైలు చార్జీల కంటే 20 శాతం అదనం