breaking news
horse runs
-
బరాత్లో పేలిన పటాకులు: పెళ్లి కొడుకుతో గుర్రం పరార్
జైపూర్ (రాజస్థాన్): బంధుమిత్రులతో కలిసి వివాహ మండపానికి వరుడు ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా వరుడు అశ్వంపై కూర్చొని బయల్దేరాడు. బంధువులు డ్యాన్స్లు చేస్తూ సంబరంగా వెళ్తూ మధ్యలో బాణసంచా కాల్చారు. పటాకుల చప్పుడుకు గుర్రం అదిరింది. వరుడితో పాటు గుర్రం పరుగులు పెట్టింది. అలా నాలుగు కిలోమీటర్ల దాక లాకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా రాంపుర గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం నిశ్చయమైంది. పెళ్లి నసీరాబాద్లో ఉండడంతో గ్రామం నుంచి ఊరేగింపుగా బంధుమిత్రులతో వరుడు అశ్వంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రంగురంగుల కాగితాలు వచ్చేలా ఉండే బాంబు పేల్చారు. భారీ శబ్ధంతో అవి పేలడంతో గుర్రం అదిరింది. భయాందోళనతో గుర్రం పరుగులు పెట్టేసింది. గుర్రంతో పాటు పైన కూర్చున్న వరుడిని కూడా తీసుకెళ్లింది. దీంతో బంధువులంతా కంగారు పడ్డారు. గుర్రాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేయగా అది అతివేగంతో ఉరుకులు ఉరికింది. ఆ విధంగా గుర్రం ఏకంగా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వెళ్లింది. ఇంత జరిగినా కూడా ఆ వరుడికి గాయాలేమీ కాలేదు. దీంతో బంధువులు, వధువు తరఫు వారు ఊపిరి పీల్చుకున్నారు. చివరకు వరుడు మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఇటీవల జరిగింది. -
ప్రాణం తీసిన గుర్రపు స్వారీ
అలీబాగ్(మహారాష్ట్ర): సరదాకి చేసిన గుర్రపు స్వారీ ఏడేళ్ల బ్రిటన్ బాలిక ప్రాణాలు తీసింది. గుర్రంపై నుంచి పడి కళ్లముందే తమ కూతురు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు విలవిలలాడారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్కు చెందిన బాలిక ఇండియా మెవ్యూతన కుటుంబ సభ్యులతో కలసి అలీబాగ్లోని మధరాన్ హిల్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం గుర్రంపై షికారును ఎంజాయ్ చేస్తోంది. ఒక్కసారిగా గుర్రం పిచ్చిపట్టినదానిలా ఎగురుతూ బాలికతో సహా అడవిలోకి పరుగుతీసింది. ఈ క్రమంలో బాలిక గుర్రంపై నుంచి బ్యాలెన్స్ తప్పి కిందపడింది. అదే సమయంలో గుర్రానికి ఉన్న కల్లెంలో తన కాలు ఇరుక్కుపోవడంతో ఆ బాలికను గుర్రం దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ బాలిక తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయింది. ఆ బాలిక తండ్రి గోవిన్ మార్క్ మెవ్యూ దుబాయ్లోని ఓ కపంఎనీలో పనిచేస్తున్నాడు. ముంబై వచ్చిన అతడు సరదాగా గడిపేందుకు కుటుంబంతో హిల్ స్టేషన్కు రాగా ఈ విషాధం చోటుచేసుకుంది.