-
చిన్నారికి పెద్ద కష్టం
సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేటీఆర్ సారూ.. మా కొడుకును కాపాడండంటూ కోరుతున్నారు ఓ చిన్నారి తల్లిదండ్రులు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ చేనేత వృత్తి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఉయ్యాల మధు అనే నేత కార్మికుడు. అతడికి భార్య, కూతురు శ్రీకృతి(4), కొడుకు ధర్మతేజ(2) ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి అనుకోని ఆపద వచ్చి పడింది. ఒక్కగానొక్క కొడుకు ధర్మతేజ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్షలు చేయించగా.. గుండెకు చిల్లు పడిందని, ఆపరేషన్ చేస్తేనే ప్రాణం దక్కుతుందని తెలిపారు. ఆపరేషన్కు రూ.2లక్షలు ఖర్చవుతుందని, వెంటనే డబ్బులు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. నిరుపేద కుటుంబమైన తమకు అంత ఖర్చు చేసి ఆపరేషన్ చేయించే స్తోమత లేదని, తమ కొడుకును ఆదుకోవాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు లేఖ రాశారు. తమ కొడుకు బతుకైనా, చావైనా కేటీఆర్ చేతిలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయతో మా కొడుకుకు ప్రాణభిక్ష ప్రసాదించాలని కోరుతున్నారు. సాయం చేసే దాతలు సెల్ నం.95051 07660ను సంప్రదించాలన్నారు. ఆర్థిక సాయం అందించేవారు బాబు తల్లి ఉయ్యాల సుజాత బ్యాంకు అకౌంట్ నంబర్ 79028825505 దక్కన్ గ్రామీణ బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0ఆర్ఆర్డీసీజీబీ నంబరుకు నేరుగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. -
చిన్నారి చికిత్సకు వైఎస్సార్ సీపీ చేయూత
దేవరాపల్లి : గుండెకు రంధ్రం పడి చావుబతుకుల్లో ఉన్న బాలికకు వైఎస్సార్సీపీ నాయకులు అండగా నిలిచారు. మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన కంటిపాము నాగేశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె లోహిత (9)కు చిన్నతనం నుంచే గుండెకు రంధ్రం పడడంతో ప్రస్తుతం మృత్యు ఒడిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రూరల్ ప్రచార కమిటీ కన్వీనర్ పోతల ప్రసాద్ స్పందించి బాలిక శస్త్రచికిత్సకు అవసరమైన ‘ఎ’ పాజిటివ్ రక్తం 9 యూనిట్లను ఎ.ఎస్.రాజా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన రక్తాన్ని తండ్రి నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఆ బాలికను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ యువరాజ్తో, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడుతో మాట్లాడామని, బాలిక వైద్యసేవలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా ఈనెల 28వ తేదీన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో బాలికకు శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు అంగీకరించారని తెలిపారు. -
గుండె చిల్లు...సూపర్ జిగురు!
పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు పడితే ..ఇక ఆ పిల్లలు మరణానికి చేరువైనట్లే. వీలైనంత వేగంగా చికిత్స చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ గుండెకుపడ్డ చిల్లును పూడ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులుంటాయి. కుట్లు వేస్తే లేదా మరో ఇతర పద్ధతిలో చికిత్స చేస్తే ఆ చిన్ని గుండెలోని కణజాలం దెబ్బతినే అవకాశముంటుంది. ఈ చిక్కులన్నింటినీ సూపర్ జిగురుతో పరిష్కారించవచ్చునని అంటోంది బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ‘హైడ్రోఫోబిక్ లైట్-యాక్టివేటెడ్ అథెసివ్ (హెచ్ఎల్ఏఏ)’ అనే ఈ జిగురును ఓ పట్టీ(ప్యాచ్)పై వేసి గుండె రంధ్రం వద్ద అతికిస్తే చాలు.. సెకెన్లలో రంధ్రాన్ని పూడిపోయేందుకు సాయపడుతుంది. పట్టీని అతికించిన వెంటనే అతినీలలోహిత కాంతిని ప్రసరింపచేస్తే.. ఐదు సెకన్లలోనే జిగురు యాక్టివేట్ అయి రక్తం లీకేజీని అరికడుతుందట. రక్తం ప్రవహిస్తున్నా.. తేమగా ఉన్నా.. గుండె కొట్టుకుంటున్నా ఈ జిగురు పట్టీ కణజాలాన్ని గట్టిగా పట్టి ఉంచుతుందట. రంధ్రం పూడి, గాయం మానిన తర్వాత ప్యాచ్తో సహా ఇది సహజంగా విచ్ఛిన్నం అవుతుంది. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావమూ ఉండదట. నత్తల వంటి అనేక జీవులు నీటిలో తడిచిపోకుండా.. త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు జిగుర్లను స్రవిస్తుంటాయి. అలాంటి జీవులను స్ఫూర్తిగా తీసుకునే శాస్త్రవేత్తలు ఈ సూపర్ జిగురును తయారు చేయడం అసలు విశేషం. వెయ్యిలో ఎనిమిది మందికి చిల్లు... పుట్టుకతో వచ్చే గుండె సంబంధ లోపాలను ‘కాన్జెనిటల్ హార్ట్ డి ఫెక్ట్స్’గా పేర్కొంటారు. గుండెకు రంధ్రాలతో పుట్టడం వీటిలో ఒకటి. సాధారణంగా ప్రతి 1000 మందిలో 8 మందికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఏర్పడే అవ కాశం ఉంది. ఇలాంటి గుండె సమస్యలకు మేనరిక వివాహాలు, జన్యుపరమైన వారసత్వం, గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర జ్వరం రావడం, మందులు వికటించడం, ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వంటి వి కారణాలు. గుండెలో రంధ్రాలు ఏర్పడేవారిలో 70 శాతం మందికి మందులు వాడితే ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. 20 శాతం మందికి ఆపరేషన్ల ద్వారా నయం చేయొచ్చు. కానీ మిగతా 10 శాతం మందిలో మాత్రం కొన్నిసార్లు ఆపరేషన్లు చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. - డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ హద్రోగ నిపుణులు, హైదరాబాద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement