breaking news
hiper tension
-
ఫైబర్ రైస్తో షుగర్ వ్యాధికి చెక్!
న్యూఢిల్లీ: పాలిష్ చేసిన బియ్యం (వైట్ రైస్)కి స్వస్తిచెప్పి.. పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే మధుమేహం, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడవచ్చని మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. వైట్ రైస్ వాడకం వలన టైప్–2 మధుమేహం వస్తుంది. ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫైబర్ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో ఉంటాయి. అందుకే వైట్ రైస్ స్థానంలో హై ఫైబర్ రైస్ను తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధిక బరువు సమస్యకూ ఇది చక్కని పరిష్కారమని వివరించారు. నిద్రలేమి, పని ఒత్తిడితో హై బీపీ! మ్యూనిచ్: నిద్రలేమి, పని ఒత్తిడి అనేవి హైపర్ టెన్షన్కు కారణమవుతున్నాయని జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని వారు వెల్లడించారు. అలాంటి వారికి గుండె జబ్బులు సంభవించే అవకాశం ఎక్కువని తెలిపారు. అధ్యయనంలో భాగంగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న 2 వేల మంది బీపీ రోగులను పరిశీలించారు. -
విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు
యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ హైపర్ టెన్షన్, మధుమేహం, రక్తపోటు, అధిక కొవ్వు తదితర కారణాల వల్ల పక్షవాతం, గుండె జబ్బులు వస్తున్నాయనేది వైద్యుల అభిప్రాయం. కానీ, తాజాగా యశోద ఆస్పత్రికి చెందిన వైద్యుల పరిశోధనలో విటమిన్ డి (హైడ్రాక్సి విటమిన్ డి) లోపం కారణంగా పక్షవాతం, గుండెపోటు వస్తున్నాయని తేలింది. యశోద ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.జైదీప్ రే చౌదరి.. తన బృందంతో సుమారు ఏడాదిపాటు దీనిపై పరిశోధన చేశారు. పక్షవాతం, గుండె జబ్బులు వచ్చిన సుమారు 250 మందిపై ఈ పరిశోధనలు సాగించారు. ఇందులో ప్రధానంగా విటమిన్ డి లోపం కారణంగా పక్షవాతం, గుండె పోటు వస్తున్నట్టు తేలింది. ప్రతి రోగి నుంచి 5 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి పలు కోణాల్లో పరిశోధన చేశారు. ఈ పరిశీలనలో విటమిన్ డి లోపంతో 122 మందికి పక్షవాతం(పెరాలసిస్), గుండె జబ్బులు వచ్చినట్టు తేలింది. 24 ఏళ్లనుంచి 78 ఏళ్లలోపు వయసున్న రోగులపై పరీక్షలు నిర్వహించగా ఎక్కువగా 50 ఏళ్లలోపు వారే ఉన్నారు. పక్షవాతానికి ప్రధాన కారణమైన హైపర్ టెన్షన్ తర్వాతి స్థానం విటమిన్ డి లోపమేనని తేలింది. కారణాలు ఇవే..: విటమిన్ డి లోపం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉందని డాక్టర్ జైదీప్ రే తెలిపారు. చాలామంది సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి ని పొందలేకపోతున్నారని, కొన్ని ఆహార పదార్థాల్లో లభించే అవకాశమున్నా వాటిని కూడా తినడం లేదని, జీవనశైలి కారణంగా ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధనలో వైద్యులు రుక్మిణి మృదుల, అల్లూరి అనామిక, దేముడు బాబు బొడ్డు, ప్రదీప్ కుమార్ మిశ్రా, ఎ.లింగయ్య, బండా బాలరాజు, బండారు శ్రీనివాసరావులు సహకరించినట్లు మీడియాకు తెలిపారు.