breaking news
Himachal tragedy
-
మరో రెండు మృతదేహాలు లభ్యం
-
ఎక్కడైనా డ్యాం గేట్లు ఎలా తీస్తారు?
-
VNR కాలేజ్ ఎదుట బాధిత తల్లిదండ్రుల అందోళన
-
బియాస్ నదిలో ఫలించని అన్వేషణ
సిమ్లా: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలు శనివారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రోజంతా గాలించినా ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. నదిలో 450 మంది జవాన్లతో ప్రతి అంగుళం గాలించామని మండి కలెక్టర్ దేవేష్ కుమార్ చెప్పారు. లార్జీ డ్యామ్ దిగువన నదిలో మూడు కిలో మీటర్ల వరకు ఆపరేషన్ జరిగినట్టు చెప్పారు. ఆదివారం కూడా ఆపరేషన్ కొనసాగించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. పాండో డ్యామ్కు ఎగువన తొమ్మిది కిలో మీటర్ల పరిధిలో మరోసారి గాలిస్తామని చెప్పారు. అత్యాధునిక స్కైట్ స్కానర్ రప్పిస్తున్నామని, శవాలు బురదలో ఉన్నా గుర్తించేందుకు వీలవుతుందని తెలిపారు. మూడో ప్రత్యామ్నాయంగా సోమవారం పాండో డ్యామ్లో ఉన్న నీటిని ఖాళీ చేయించి గాలింపు చర్యలు చేపడుతామని కలెక్టర్ చెప్పారు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీయగా, మిగిలిన వారీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. -
బియాస్ లో మరో మృతదేహం వెలికితీత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరో మృతదేహం వెలికితీశారు. బియాస్ నదిలో అలోజీమాతా మందిర్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఎవరిదన్నది కాసేపట్లో గుర్తించనున్నారు. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది ఆదివారం సాయంత్రం బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తొమ్మది మృతదేహాలను గుర్తించారు. ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను హైదరాబాద్ తరలించారు. మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
హిమాచల్ ఘటన గాలింపులో కీలకనిర్ణయం
-
హిమాచల్ దుర్ఘటన: శవాల వెలికితీతలో జాప్యమెందుకు?
"ఇది హైటెక్ యుగం. ఇక్కడ ఎన్నో టెక్నాలజీలున్నాయి. ఇన్ని రోజులైనా మనం శవాలను ఎందుకు వెలికి తీయలేకపోతున్నాం? ఆధునిక టెక్నాలజీ సాయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు?' ఇది బివి సుబ్బారావు వేస్తున్న ప్రశ్న. సుబ్బారావు ఆవేదనకు అర్ధం ఉంది. ఆయన కొడుకు హిమాచల్ దుర్ఘటనలో జలసమాధి అయిపోయాడు. కానీ ఇప్పటివరకూ భౌతికకాయం మాత్రం దక్కలేదు. సుబ్బారావు హిమాచల్ కొండల్లో, కులు లోయల్లో ఏమీ తెలియని ప్రదేశంలో తనకు బాగా తెలిసిన వాడి శవం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన మామూలు వ్యక్తి కారు. ఆయన డ్యామ్ ఇంజనీర్ కూడా. 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పొట్టనబెట్టుకున్న బియాస్ నది నుంచి శవాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. అక్కడ పాత పద్ధతులనే ఉపయోగించడం జరుగుతోంది. కొక్కాలతో, వెదురు బొంగులతో వెతుకులాట కొనసాగుతోంది. చిన్న చిన్న పడవల్లో ఒకరిద్దరు మాత్రమే వెళ్లి వెతుకుతున్నారు. నీటి అడుగున చిత్రీకరించగలిగే కెమెరాలు అక్కడికి తీసుకొచ్చినా ఇప్పటి వరకూ వాటికి పని కల్పించలేదు. నేవీని పిలిపించాలని భావించినా ఇప్పటి వరకూ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అసొం వంటి ప్రదేశాల్లో కొండనదులు ఉంటాయి. అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడి నుంచి గజీతగాళ్లను రప్పిస్తే అన్వేషణ సులువవుతుంది. కానీ ఇప్పటి వరకూ దాని విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోనీ లార్జి డ్యామ్ నుంచి నీటి విడుదలను ఆపుచేద్దామంటే అదీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆలా చేస్తే ప్రాజెక్టు ఎగువనున్న గ్రామాలు మునిగిపోతాయి. కొండరాళ్లతో నిండిన ఈ నదిలో పెద్ద పడవలు పనికిరావు. ఇవన్నీచాలవన్నట్టు ప్రాజెక్టు దిగువన భారీ పూడిక ఉంది. కొన్ని ప్రాంతాల్లో చాలా బురద ఉంది. ఇవన్నీ చాలవన్నట్టు కొన్ని చోట్ల సుడిగుండాలున్నాయి. వీటన్నిటి వల్లా శవాల వెలికితీత చాలా ఆలస్యం అవుతుంది. అయితే తమ కన్న బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు మాత్రం ఈ ఎదురుచూపులు నరకాన్ని చూపిస్తున్నాయి. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. -
కొడుకు కోసం ఓ తల్లి వేదన