breaking news
highschool
-
125 వంసతాల సంబరం : పూర్వ విద్యార్థుల ఘనత
ఆ బడి రాజుల పాలన చూసింది. స్వాతంత్య్ర సంగ్రామ నినాదాలు విన్నది. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన సందర్భానికి సాక్షిగా నిలిచింది. ప్రజాస్వామ్య యుగంలో తొలిసారి ఓటరుగా మారిన మందస వాసులకు వేదికనిచ్చింది. ఇన్నేళ్ల ప్రస్థానంలో వేలాది మంది మేధావులకు పురుడు పోసింది. 125 ఏళ్లుగా విజ్ఞాన కాంతులు వెదజల్లుతూనే ఉంది. మందసలోని శ్రీరాజా శ్రీనివాస మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాల వైభవమిది. మందస రాజుల సుందర స్వప్నంగా ప్రారంభమైన పాఠశాల పూర్వ విద్యార్థుల సంకల్ప బలంతో పూర్వ వైభవం సాధించింది. మందస: మందసలోని ఎస్ఆర్ఎస్ఎం జెడ్పీ ఉన్న త పాఠశాల 125 ఏళ్ల వేడుకకు ముస్తాబవుతోంది. జమీందారుల పాలనలో పురుడు పోసుకున్న ఈ బడి ఈనాటికీ పచ్చగా విరాజిల్లుతోంది. 1901 మే 16న ఆనాటి గంజాం కలెక్టర్ హెచ్డీ టేలర్, మందస జమీందారు వాసుదేవ రాజమణిదేవ్ ఈ పాఠశాలకు పునాది వేశారు. నాటి శిలాఫలకం నేటికీ ఈ బడిలో భద్రంగా ఉంది. వాసుదేవ రాజమణిదేవ్ తర్వాత శ్రీనివాస రాజమణి దేవ్ పాలన సాగించా రు. ఆయన 30 ఏళ్ల పాటు ఈ బడిని బ్రిటిష్ పరం కాకుండా కాపాడారు. 1930లో ఆయన చనిపోయాక.. 1932 సెపె్టంబర్ 21న స్కూల్ను ప్రభుత్వ పాఠశాలగా గుర్తించి శ్రీ రాజా స్కూలును శ్రీ రాజా శ్రీనివాస రాజమణిదేవ్ మెమోరియల్ బోర్డు హైసూ్కల్గా మార్చారు. నాటి గంజాం జిల్లాలో ఇది రెండో హైస్కూల్ కావడం విశేషం. ఎన్నెన్నో అనుభవాలు.. వందేళ్లకుపైబడిన ప్రస్థానంలో మందస హౌస్కూల్ ఎన్నో అనుభవాలు మిగిల్చింది. ప్రధానంగా ఈ పాఠశాల ముందరి భవనం ఓ జ్ఞాపికగా మారింది. వందలాది తుఫాన్లను తట్టుకుని ఈ భవనం నిలబడింది. రాజులు కట్టించిన భవంతుల్లో ఇది మాత్ర మే మిగిలింది. ఇక్కడ చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మండల వ్యాప్తంగా దశాబ్దాల పాటు ఈ పాఠశాల పెద్ద దిక్కుగా ఉండేది. బడి వదిలితే సాయంత్రం పూట మందస పట్టణమంతా కళకళలాడేది. పూర్వ విద్యార్థుల ఔదార్యం కాలక్రమేణా పెంకులు ఊడిపోయిన దశలో ఐకానిక్ భవనం అందవిహీనంగా మారడం పూర్వ విద్యార్థులను కలిచివేసింది. ఎంతో వైభవం కలిగిన ఈ భవనాన్ని ఆ దశలో చూసి విద్యార్థుల గుండెలు చివుక్కుమన్నాయి. అంతే.. అంతా కలిశారు. ప్రభుత్వ సాయం కోరకుండా, అధికారుల కోసం ఎదురు చూడకుండా ఎవరికి తోచినంత డబ్బు వారు విరాళాల రూపంలో పోగు చేసుకున్నారు. బ్యాచ్ల వారీ గా పోటీ పడి మరీ స్కూలు కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి వారో వా ట్సాప్ వేదికగా ఒక్కటయ్యారు. దాదాపు రూ.27 లక్షలు సేకరించి ఐకానిక్ భవనానికి మళ్లీ కొత్త ఊపిరి పోశారు. అ‘పూర్వ’ సమ్మేళనానికి సై.. భవన పునరి్నర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 19, 20 తేదీల్లో భవనాన్ని పునఃప్రారంభిస్తూ 125 ఏళ్ల వేడుక సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపిణీ చేయడం మొదలుపెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఉన్నత పాఠశా ల భవనాన్ని 19వ తేదీ ఉదయం 10 గంటలకు పునఃప్రారంభిస్తామని, మరుసటి రోజు ఆదివారం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. -
అమెరికా హైస్కూల్లో కాల్పుల మోత
బెన్టన్: అగ్రరాజ్యం అమెరికా కొత్త ఏడాదిలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కెంటకీ రాష్ట్రంలోని మార్షల్ కౌంటీలో ఉన్న హైస్కూల్లో ఓ విద్యార్థి(15) హ్యాండ్గన్తో జరిపిన కాల్పుల్లో ఇద్దరు తోటివిద్యార్థులు చనిపోగా, 17 మంది గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 8.57 గంటలకు హైస్కూల్కు చేరుకున్న నిందితుడు పాఠశాల ప్రాంగణంలో ఉన్న వారందరిపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు పూర్తిగా అయిపోయేంతవరకూ అతను కాల్పులు జరుపుతూనే ఉన్నాడన్నారు. అయితే సదరు విద్యార్థి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై పోలీసులు అధికారులు ఎలాంటి వివరాలు చెప్పలేదు. -
మెక్సికోలో కాల్పులు: ముగ్గురు మృతి!
మెక్సికో సిటీ: మెక్సికోలోని ఓ పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. న్యూ మెక్సికోలోని అల్బుకుర్కేకు సుమారు 180 మైళ్ల దూరంలో ఉన్న అజ్టెక్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే షూటర్ ఎలా చనిపోయాడన్నదానిపై స్పష్టత రాలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియరాలేదు. విద్యార్థులందరినీ పాఠశాల నుంచి బయటికి పంపించి ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు తరలించారు. -
19 నుంచి బాలల సైన్స్ కాంగ్రెస్పై వర్కుషాపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై వర్కుషాపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు వర్కు షాపునకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రంగమ్మ లేదా జిల్లా విద్యా సమన్వయకర్త కె.వి.సుబ్బారెడ్డిని 8790111331, 9948605546 సెల్ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. డివిజన్ల వారీగా వర్కు షాపుల వివరాలు డివిజన్ తేదీ వర్కుషాపు నిర్వహించే స్థలం ఆదోని 19.10.16 ప్రభుత్వ బాలికల పాఠశాల కర్నూలు 20.10.16 బి.క్యాంపు ప్రభుత్వ బాలుర పాఠశాల డోన్ 21.10.16 శేషారెడ్డి హైస్కూల్, బేతంచెర్ల నంద్యాల 22.10.16 ఎస్పీజీ హైస్కూల్