-
ఈ యాచకులు.. కోటీశ్వరులు!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరూ మహిళలు.. ఉన్నత చదువులు చదివారు.. విదేశాల్లో జీవించారు.. కోట్లలో ఆస్తులు.. ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఇప్పుడా కళ్లలో దైన్యం.. మాటల్లో నిస్సహాయత.. ఆవేదన.. ఒక్క రూపాయి కోసం చేతులెత్తి యాచిస్తున్న తీరు.. హైదరాబాద్లోని లంగర్హౌజ్ దర్గా వద్ద భిక్షమెత్తుకుంటున్న ఫర్జానా, రబియా బసిరి అనే ఇద్దరు మహిళల వ్యథ ఇది. హైదరాబాద్ నగరంలో ఉన్న యాచకులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు.. వీరిని చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. అక్కడ వీరి మాటతీరు, ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడుతుండటాన్ని గుర్తించిన అధికారులు వారి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి కథ విన్నకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. భర్త పోయిన వేదనతో.. హైదరాబాద్లోని ఆనంద్బాగ్కు చెందిన ఫర్జానా హైదరాబాద్లోనే డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం లండన్లో ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత అక్కడే కొన్నేళ్లపాటు అకౌంట్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్కు వచ్చాక ఇస్మాయిల్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి అలీ అనే కుమారుడు ఉన్నాడు. తర్వాత కూడా ఆమె పై చదువులపై దృష్టి సారించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, బాధల సుడిగుండాలను ఎదుర్కొంది. ఇటీవల భర్త మరణించడంతో మానసికంగా బాగా కుంగిపోయింది. ప్రశాంతంగా ఉంటుందంటూ లంగర్హౌజ్ దర్గాకు వచ్చి ఉండిపోయింది. దర్గాకు వచ్చే భక్తుల వద్ద యాచిస్తూ బతుకుతోంది. ప్రస్తుతం ఆమె వయసు సుమారు 60 ఏళ్లు. బాబా ఆశీర్వాదంతో ఆమె బాగుపడుతుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇటీవలి స్పెషల్ డ్రైవ్లో ఫర్జానాను గుర్తించిన పోలీసులు చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. ఇది తెలిసిన అలీ.. పోలీసులను సంప్రదించి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. దగ్గరి వాళ్లే మోసం చేస్తే.. రబియా బసిరిది కన్నీటి గాథ. హైదరాబాద్లోని డిఫెన్స్ కాలనీకి చెందిన బసిరికి 15 ఏళ్ల కింద అమెరికాలో హోటల్ వ్యాపారం చేస్తున్న మహ్మద్ అబ్దుల్ నయీంతో వివాహమైంది. ఆయనకు ఆమె మూడో భార్య. అక్కడ వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్నేళ్ల కింద ఆమె తండ్రి చనిపోవడంతో హైదరాబాద్కు వచ్చింది. కానీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా బాగా కుంగిపోయింది. ఆమెకు అమెరికా గ్రీన్కార్డు ఉన్నా.. తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. వారికి హైదరాబాద్లో ఉన్న ఆస్తులను చూసుకుందామనుకుంది. కానీ బంధువులు, దగ్గరివారు ఆమెను మోసం చేసి ఆ ఆస్తులను కొల్లగొట్టారు. దీంతో రోడ్డున పడ్డ బసిరి.. చివరికి లంగర్హౌజ్ దర్గాకు చేరుకుంది. ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడే బసిరి కథ విని జైలు అధికారులు కూడా చలించిపోయారు. అయితే ఆమె సోదరుడు వచ్చి హామీ ఇవ్వడంతో బసిరిని ఇంటికి పంపించారు. -
ఎంబీఏ ఎంసీఏ బీటెక్ బీఈడీ పట్టా ఏదైనా అడ్డాకూలీయే!
పల్లెల్లో పెరిగిపోతున్న నిరుద్యోగులు జాబుల్లేక ‘జాబ్ కార్డు’తో ఉపాధి పనులకు పయనం పెద్దపల్లి, సాక్షి:...ఒక్కరిద్దరు కాదు.. అనేక పల్లెల్లో ఇలాంటివారెందరో కనిపిస్తున్నారు! ఉన్నత చదువులు చదివి కొలువుల్లోనే కూలీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రం పెద్దపల్లిలో కూలీల అడ్డాపై బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ చదివిన పట్టభద్రులు కనిపిస్తున్నారు. ఉపాధి కోసం తట్ట పట్టుకొని లేబర్గా మారుతున్నారు. హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా దొరకలేదని, కుటుంబానికి భారంగా మారడం ఇష్టం లేక కూలీబాట పట్టినట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తే రూ.ఐదారు వేలకు మించి ఇవ్వడం లేదని, కూలీ పనికి వెళ్తే నెలకు రూ.7 వేల నుంచి రూ.8 వేలు వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు ప్లాట్లలో చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించడం, చిన్న చిన్న కందకాలు తవ్వడంలాంటి పనులు చేస్తున్నామని చెప్పారు. ఆ ఊరి నిండా నిరుద్యోగులే.. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని హన్మంతునిపేట గ్రామం లో ఎంటెక్ ఆరుగురు, బీటెక్ 18, ఎంబీఏ 26, ఎంసీఏ 21, డిగ్రీ 55, ఇంటర్ 100 మందికిపైగా, టెన్త్ 200 మందికి పైగా చదివారు. వారిలో కేవలం తొమ్మిది మందికే ఉద్యోగాలు వచ్చాయి. బీటెక్ చదివినవారిలో నలుగురికి, ఎంటెక్ చేసిన ఒకరికి, బీఈడీ పూర్తి చేసిన నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఒక్క ఊరిలోనే కాదు.. చాలా గ్రామాల్లో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. మరికొందరు చదువులకు సంబంధం లేని కొలువుల్లో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారు. బీటెక్ పట్టభద్రులు అక్కడక్కడ సాఫ్ట్వేర్, కాల్సెంటర్లలో పని చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ చదివినవారిలో చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. ‘చదువులు జీవితాన్ని నిలబెట్టలేక పోతున్నాయి. అందుకే తీరిక వేళలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నా’ అని బీటెక్ చదివిన నవీన్ చెప్పాడు. ఒక చేతిలో తట్ట..మరో చేతిలో గడ్డపార పట్టుకున్న ఈయన రవికిశోర్. పెద్దపల్లి. ఇంజనీరింగ్ చదివాడు. కొలువు కోసం ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరిగాడు. ఎంత ప్రయత్నించినా జాబ్ దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశల్లేక చివరికి కూలీ అవతారమెత్తాడు. ఈయన పేరు గుర్రాల రాజు. హన్మంతునిపేట. ఎంసీఏ చదివాడు. పెళ్లయింది. ఓ కూతురు. ఉద్యోగం కోసం ఎంతో యత్నించాడు. ఎక్కడా జాబ్ రాకపోవడంతో తనకున్న ఎకరం పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ, ఉపాధి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయన పేరు తీగల సతీశ్. పెద్దపల్లి సమీపంలోని హన్మంతునిపేట. 2010లో ఎంబీఏ పూర్తిచేశాడు. హైదరాబాద్లో నాలుగేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. కాల్సెంటర్లో కొలువు దొరికినా నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. ఆ జీతంతో జాబ్ చేయలేక తిరిగొచ్చాడు. ఉపాధి హామీ పథకం కింద ‘జాబ్’ కార్డు సంపాదించి ఊరిలోనే పనికి వెళ్తున్నాడు. మా పొలగానికి పిల్లనిస్తలేరు మా కొడుకు ఎంబీఏ చదివాడు. కానీ ఉద్యోగం దొరకలేదు. పిల్లనివ్వమని అడిగితే పొలగాడు (కొడుకు) ఏం చేస్తుండని అడుగుతున్నరు. చివరికి ఉపాధి హామీ పనికి నా వెంటే వస్తుండు. దాంతోపాటు ఇంట్లో కులవృత్తి ఇస్త్రీ కూడా చేస్తూ నాలుగు పైసలు సంపాదించి ఆసరైతాండు. – కంది లక్ష్మీరాజమ్మ, హన్మంతునిపేట ఐదు సదివితేనే నౌకరచ్చింది మా కాలంలో ఐదు సదివితేనే నౌకరచ్చింది. పది సదివినోళ్లను సూడనేలేదు. గిప్పుడైతే ఇంటికి ముగ్గురు 20 ఏండ్లు బడికివోయి సదువుతాండ్రు. కానీ ఎవరికి నౌకరచ్చినట్టు కనిపిస్తలేదు. ఇద్దరు మనవలు, ఇద్దరు మనవరాండ్లు 18 ఏండ్లు పుస్తకాలతోనే తిరిగిండ్రు. ఇంట్ల నలుగురుంటే ఒక్కలకు నౌకరు లేదు. ఏం సదువులో ఏమో? – కందుల పోశాలు, హన్మంతునిపేట పట్టా దాచి పనికి పోతున్న నేను బీఈడీ చదివా. ప్రైవేటు స్కూల్కు వెళ్తే నెలకు రూ.4 వేలు ఇస్తామన్నారు. అవి ఎటూ చాలవు. కుటుంబ పోషణ భారమై బీఈడీ పట్టా బీరువాలో దాచి బజారులో కూలీ పని చేస్తున్నా. – భాస్కర్, శాంతినగర్ చదువుకున్నోళ్లకు పనిలేదు చదువుకున్నోళ్లమని చెబితే పని దొరకదేమోనన్న బాధ కూడా తమను వేధిస్తోందని విద్యావంతులు చెబుతున్నారు. చదువుకున్న వారు పని చేయలేరనే భావనతో పని ఇచ్చేందుకు వెనకాడుతున్నారన్నారు. కొందరు పాత దుస్తులు ధరించి, కూలీల మాదిరిగా అడ్డాపైకి వస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement