breaking news
high level commity
-
మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్, సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి తక్షణ నష్టపరిహారంగా రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎంజీ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని మైనింగ్ అధికారులు పరిశీలించారని, లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్లోడింగ్లో నిబంధనలు పాటించలేదన్నారు. చిన్న తరహా ఖనిజ నియమావళి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు చదవండి: ముగ్గురాళ్ల క్వారీలో కూలీల జీవితాలు బుగ్గి పూలింగ్.. భారీ కుట్ర -
ఇక సరికొత్తగా నిరోధ్
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనసంఖ్యకు అడ్డుకట్టవేసేందుకు భారత ప్రభుత్వం 50 ఏళ్ల కిందటే రూపొందించిన కుటుంబ నియంత్రణ మంత్రం.. నిరోధ్. హిందుస్థాన్ లాటెక్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన తొలి తరం కండోమ్ అప్పట్లో విశేష ఆదరణను చురగొంది. ఇటు జనాభా నియంత్రణకేకాక సుఖవ్యాధుల వ్యాప్తిని కూడా అడ్డుకుంది. అయితే కండోమ్ల తయారీలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించడంతో నిరోధ్ నెమ్మదిగా తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. రకరకాల ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకున్న ప్రైవేట్ సంస్థలకు ధీటుగా నిరోధ్ను మార్కెట్లో మళ్లీ నంబర్ వన్గా కేంద్ర ప్రభుత్వం నిలబెట్టాలనుకుంటోంది . ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటయింది. సరికొత్త నిరోధ్ను ఏ ఫ్లేవర్లలో, ఎలాంటి రూపంలో తయారుచేయాలో ఈ కమిటీ నివేదించనున్నది. 'నామామాత్రపు ధరకు అందించేదే కదా ఎలా ఉంటే ఏముందిలే!' అనుకోకుండా నిరోధ్ కు మరింత ప్రాధాన్యత కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్యులు స్వాగతిస్తున్నారు.