breaking news
Hema Latha
-
ప్రజావ్యతిరేక విధానాలపై ధర్నా
సంగారెడ్డి జోన్: దేశంలో మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 5న జరిగే ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హేమలత అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని బాలాజీ మంజీరా గార్డెన్స్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘ప్రత్యామ్నాయ ఆర్థిక రాజకీయ విధానాలు– కార్మికవర్గం పాత్ర’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు, కూలీలు, రైతులందరితో లక్షలాది మంది కలిసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేస్తామని, మోదీ పాలన లో అచ్చేదిన్లన్ని , కార్పొరేట్, పెట్టుబడిదార్లకే వచ్చాయన్నారు. కార్మికుల ఐక్యతను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కేంద్రం కొత్త సవరణను ముందుకు తెచ్చి కార్మికులకు , ఉద్యోగులకు భద్రత లేకుండా చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసిందని, ఇన్సూరెన్స్ , బ్యాంకింగ్, రైల్వే, రక్షణ, ఫార్మా రంగాలను పూర్తిగా బలహీనం చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనం, పనిహక్కు సామాజిక భద్రత కోసం అమలవుతున్న బెనిíపిట్స్ స్థానంలో బీమా ఆధారిత విధానాన్ని తెచ్చిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సవరించి అమలు చేస్తూ ఆ విధానాలనే దేశ వ్యాప్తంగా చేయడం కోసం ప్రయత్నిస్తుందన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు కె.రాజయ్య , బి. మల్లేశంలు మాట్లాడుతూ మన బతుకులు బాగు చేసే విధంగా ఈ ప్రభుత్వాల మీద పోరాడాలని, అందుకు పాలకులు సహకరించకపోతే నేటి పాలకులనే మార్చుకోవాలన్నారు. మన కోసం పని చేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం– సమగ్రాభివృద్ధి అనే ఏజెండాను నిజమైన అర్థంలో అమలు చేసేందుకు తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాజకీయ వేదిక ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, నాయకులు ఎస్.మహిపాల్, పి.మంగ, జయరాజు, యాదగిరి, స్వాతి, నాగేశ్వర్రావు, మొగులయ్య, బాలరాజు, పెంటయ్య, మౌలాలీ, వెంకటరాజం, యాదయ్య, శ్రీధర్, నాగభూషణం అరుణ, వీరమణి తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులు తాళలేక ఆత్మహత్య
నిజాంసాగర్ : భర్తతో పాటు అత్త వేధింపులను తాళలేక జిన్న హేమలత (22) అనే వివాహిత శుక్ర వారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఐదు నెలల కూతురు మానసను ఒంటరి చేసి తల్లిగారింట్లోనే తనవు చాలించింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన దుంపల అనుశవ్వ, లక్ష్మణ్ దంపతుల కూతురు హేమలతను ఇంటర్ వరకు చదివించారు. పిట్లం మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్న సత్యనారాయణకు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. ఆ సమయంలో రెండు తులాల బంగారు గొలుసు, ఇతర అభరణాలతో పాటు బాన్సువాడలోని రూ. 3.50 లక్షల విలువైన ఇల్లు కట్నంగా ఇచ్చారు. ఏడాదిన్నర పాటు దంపతులు అన్యోన్యంగానే ఉన్నారు. ఐదు నెలల కిందట వీరికి కూతురు పుట్టింది. అప్పటి నుంచి సత్యనారాయణతో పాటు అత్త రామవ్వ హేమలతను వేధిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. పెళ్లప్పుడు పెట్టిన బంగారం ఇటీవల అమ్ముకున్నారని, తమ కూతురును తరుచూ డబ్బు కోసం వేధిస్తున్నారని చెప్పారు. నాల్గు రోజుల క్రితం కూతురు ఇంటికి వెళ్లగా ఆమె భర్త, అత్త తమతో గొడవ పడ్డారని పేర్కొన్నారు. దీంతో హేమలతను తమ ఇంటికి తీసుకొచ్చామని, వారి వేధింపులు భరించలేక ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడిందని రోదిస్తూ చెప్పారు. ఎస్సై అంతిరెడ్డి, తహశీల్దార్ సయ్యద్ అహ్మద్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.