breaking news
healthy food rules
-
తినే ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకోవాలి..! లేదంటే?
జీవనశైలి అలవాట్లలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పులతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మారిన, మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహార లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం కూడా పెరగడంతో ఊబకాయం వంటి సమస్యలకు అనేక మంది గురవుతున్నారు.ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్–హైదరాబాద్, ఎన్ఐఎన్ నిపుణుల కమిటీ ‘డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు చేసింది. అన్ని వయసుల వారిలో ఆరోగ్య పరిరక్షణకు 17 డైటరీ గైడ్లైన్స్ సూచించింది. సమతుల ఆహారంలో వెరైటీలు (భిన్నరకాల ఆహార పదార్థాలు) ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెప్పింది.ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ గైడ్లైన్స్లో ముఖ్యమైనవి..మనం తీసుకునే ఆహారంలో తాజా కూరలు, పండ్లు, 50 శాతం ధాన్యం (సిరియల్స్) పోషకాలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, గింజలు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.ఆరునెలల వయసు పైబడిన పిల్లలకు ఇళ్లలోనే తయారు చేసిన సెమీ–సాలిడ్ సప్లిమెంటరీ ఫుడ్ను ఇవ్వాలి.చిన్నపిల్లలు, పెరిగే వయసున్న పిల్లలకు తగిన ఆహారం అందించి వారు అనారోగ్యం బారిన పడకుండా చూడాలి.నూనె/కొవ్వుపదార్థాలు పరిమితంగా వాడాలి, తగినంతగా పోషకాలు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ను వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభించేలా చూడాలి.కండలు పెంచేందుకు ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోరాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుని ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చక్కె ర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని నియంత్రించాలి.శారీరకంగా చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.ప్రస్తుతం ఆహార పదార్థాలు ఎక్కువగా ప్యాకేజ్డ్ రూపంలో వస్తున్నందున ఆ ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా చదివాకే కొనుగోలు చేయాలి.గంటల తరబడి టీవీలు చూస్తున్నపుడు మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగాలి.బిజీ షెడ్యూళ్లలో పనిచేస్తున్నా గంటకు ఒకసారైనా 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.ఇవి చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది! -
కరోనా సెకండ్ వేవ్: ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఈ కరోనా టైమ్ లో ఆహారం విషయంలో కానీ, ఇతరత్రా ఆడవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పండి మేడం.... – నూర్జహాన్, గుల్బర్గా మన భారతదేశంలో సగటున యాభై శాతం మంది ఆడవారు భర్త, పిల్లల ఆలనపాలన చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. పనులలో నిమగ్నమై సమయానికి సరైన ఆహారం తీసుకోకుండా, మిగిలిన వారు తినగా ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా చాలామంది ఆడవారిలో 35 సంవత్సరాలు దాటేకొద్ది పీరియడ్స్, కాన్పులు, పిల్లలకు పాలు ఇవ్వడం వంటి వాటి వల్ల రక్తహీనత, విటమిన్స్, క్యాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే హార్మోన్ల ప్రభావం వల్ల కూడా కొంచెం కొంచెంగా ఎముకలలో క్యాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఒళ్లు నొప్పులు, నడుం నొప్పులు, నీరసం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. రక్తహీనత ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకితే, వాటిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించాలన్నా, తిప్పికొట్టాలన్నా రోగనిరోధక శక్తి చాలా కీలకం. ఈ సెకండ్వేవ్లో కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చినా, అది కుటుంబంలోని అందరికీ వ్యాప్తి చెందుతుంది. అందులో 90 శాతం మంది సరైన జాగ్రత్తలు పాటిస్తూ, డాక్టర్ల సూచనతో మందులు వాడుతూ ఇంట్లోనే ఉంటే తగ్గిపోతుంది. ఈ సమయంలో కుటుంబంలోని అందరూ ఒకరికి ఒకరు తోడుగా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా కలసి అన్ని పనులూ చేసుకుంటూ, ఆందోళన చెందకుండా ఉంటే కరోనాను జయించవచ్చు. పది శాతం మందికి మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అయినా సరే, మన దేశంలో చాలామంది ఆడవాళ్లు వాళ్లకు కూడా సమస్య ఉన్నా, మిగతావారికి విశ్రాంతినిచ్చి, వారే అన్ని పనులూ చేస్తూ, వారికి సపర్యలు చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వారి ఆరోగ్యం ముందు నుంచే సరిగా ఉండి, రోగనిరోధక శక్తి బాగా ఉంటే వారికి సమస్య తీవ్రతరం కాకుండా చిన్నచిన్న లక్షణాలతో బయటపడి కరోనాను జయించవచ్చు. అలాగే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. కాబట్టి ఆడవారు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. పొద్దున నిద్రలేవగానే గ్లాసుడు గోరువెచ్చని మంచినీళ్లు– కావాలంటే అందులో నిమ్మకాయ పిండుకుని, తేనె కలుపుకొని తాగవచ్చు. ఉదయం తొమ్మిదిగంటల సమయానికి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ/ దోశ/ ఉప్మా/పాలు/ఓట్స్/గుడ్డు వంటివి తీసుకోవచ్చు. పదకొండు గంటలకు స్నాక్స్లో ఏదైనా పండు/మొలకెత్తిన గింజలు/డ్రైఫ్రూట్స్, మధ్యాహ్న భోజనంలో కొద్దిగా అన్నం/రోటీ/పప్పు/ఆకుకూర/కూరగాయలు/పెరుగు, మాంసాహారులు చికెన్/మటన్ వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం 4–5 గంటలకు స్నాక్స్ రూపంలో కొద్దిగా మసాలా టీ/సూప్/ ఉడికించిన గింజలు వంటివి, రాత్రి భోజనంలో చపాతీ, ఆకుకూరలు/కూరగాయలు/ పెరుగు/రాగిజావ వంటివి, పడుకునే ముందు వేడి పాలు తాగడం మంచిది. రోజూ పది పన్నెండు గ్లాసుల మంచినీరు (రెండు లీటర్లు) తాగవలసి ఉంటుంది. ఇలా అందరూ తమకు అందుబాటులో ఉన్న పోషక పదార్థాలతో రోజును ఆరుసార్లుగా విభజించుకుని ఆహారం తీసుకోవడం మంచిది. అన్ని రకాల పండ్లు (డయాబెటిక్ పేషెంట్లు అరటిపళ్లు, మామిడి, సపోట తక్కువగా తీసుకోవాలి) మజ్జిగ, కొబ్బరినీళ్లలాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మా ఆడపడుచుకి 52 ఏళ్లు. ఈ మధ్యనే కుడి రొమ్ములో లంప్ ఏర్పడి, అది తర్వాత క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉందని కుడి రొమ్ము తొలగించారు. ఇప్పుడు ఆమెకు సెర్విక్స్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. తొలి దశలోనే ఉంది ప్రమాదమేం లేదన్నారు. అయినా మాకు భయంగానే ఉంది. రొమ్ములో గడ్డ గర్భసంచి వరకు వ్యాపించి ఉండొచ్చంటారా? యేడాదిలోపే ఇక్కడిదాకా వచ్చింది. – మంజుల రాణి, ఆత్మకూరు కొందరిలో కొన్ని జన్యువులలో మార్పుల వల్ల వారి శరీర తత్వాన్ని బట్టి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటిలో రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, అండాశయాలలో క్యాన్సర్, పేగులలో క్యాన్సర్ వంటివి ఉంటాయి. వీటిలో సెర్వైకల్ క్యాన్సర్ అరుదుగా ఉంటుంది. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే రొమ్ములో గడ్డకు, సెర్వైకల్ క్యాన్సర్కు సంబంధం ఉన్నట్లు అనిపించడం లేదు. సందేహం ఉంటే రొమ్ములోని గడ్డకు సంబంధించిన బయాప్సీ రిపోర్టును, సెర్విక్స్ నుంచి తీసిన బయాప్సీ రిపోర్టును పరీక్ష చేసి చూడవచ్చు. సాధారణంగా రొమ్ము క్యాన్సర్ నుంచి క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, లివర్, ఎముకలు, అండాశయాలకు, మెదడుకు వ్యాప్తి చెందవచ్చు. సెర్విక్స్కు పాకే అవకాశాలు చాలా తక్కువ. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: -
ఉదర సంబంధ వ్యాధులకు బత్తాయితో చెక్
ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బత్తాయి ముఖ్యమైనది. పండిన బత్తాయి లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా అనేక లాభాలు. బత్తాయిలో ముఖ్యంగా విటమిన్ –సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధులను నివారిస్తుంది. ఇది దంత చిగుళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇంకా దగ్గు, జలుబు, పెదాల పగుళ్ళను నివారిస్తుంది. బత్తాయి రసంలో ఉండే విటమిన్ సి ఇన్ని రకాలుగా సహాయపడుతుంది. పీచుపదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, క్యాల్షియం వంటివి దాగివున్నాయి. క్యాలరీలు, ఫ్యాట్ కూడా తక్కువ. ఉదర సంబంధిత రోగాలకు బత్తాయి పండ్లు చెక్ పెడతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ పండ్ల రసాన్ని రోజూ ఓ గ్లాసుడు తీసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. శరీరానికి కావలసిన ధాతువులు, పీచు పదార్థాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. గర్భిణులు తరచూ బత్తాయి రసాన్ని తీసుకుంటే, అందులో ఉండే క్యాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది.ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమే కాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది. బత్తాయిరసంలో ఉండే యాసిడ్ గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. బత్తాయి రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల నోటి అల్సర్లు రాకుండా ఉంటాయి. బత్తాయి రసం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంటాయి. ఈ జ్యూస్ లోని ఫ్లేవనాయిడ్స్ పిత్తం, జీర్ణ రసాలను, యాసిడ్స్ను విడగొడుతుంది. కాబట్టి, బత్తాయి రసం త్రాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట సమస్యలు, అజీర్ణం, వికారం, కళ్ళు తిరగడం వంటి సమస్యలను నివారిస్తుంది. బత్తాయి జ్యూస్ను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది.+ -
రక్షణ మీరే!
మన కుటుంబం ఎప్పుడూ దాడులకు గురవుతూనే ఉంటుంది. బ్యాక్టీరియాలూ, వైరస్లు, మాన్సూన్ మార్పులూ, వ్యాధులతో ఎటాక్ మీద ఎటాక్ మీద ఎటాక్ జరుగుతూనే ఉంటుంది. రాబోయే 2019లో కుటుంబానికి రక్షణ మీరే. కుటుంబాన్ని ఆరోగ్యంగా కొత్త ఏడాదిలోకి తీసుకెళ్లడానికి మీ కోసం ఈ సూచనలు. చాలా రకాల జబ్బుల్ని చిన్న చిన్న నివారణ మార్గాలతోనే రాకుండా చేసుకోవచ్చు. జబ్బు కంటే నివారణ ఎప్పుడూ మంచిదే కదా! ఇక్కడ కొన్ని సాధారణ జబ్బులకు నివారణ మార్గాలు... ఆర్థరైటిస్ నివారణకు... ఆర్థరైటిస్ సమస్యను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అవి... బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజులు 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే వ్యాయాయం చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్ను తగ్గించచాలి. (దానికి బదులు వేగంగా నడవడం, ఈదడం మంచిది). కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు డాక్టర్ను తప్పక సంప్రదించాలి. కిడ్నీల్లోని రాళ్ల నివారణ... ∙సమ్మర్లో మనం తాగే నీళ్లు పెరిగినా ఒంట్లో నీళ్లు తగ్గుతాయి. ఈ పరిస్థితి వల్ల ఏర్పడే అనర్థాల్లో ప్రధానమైనది మూత్రపిండాల్లో రాళ్లు. ఈ పరిస్థితిని నివారించడానికి నీటిని ఎక్కువగా తాగాలి. మనం సగటున రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ∙ఆహారంలో ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి. ∙రాళ్లు వచ్చేందుకు కారణమయ్యే ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ∙క్యాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ∙ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్కు దారి తీస్తుంది. దాంతో క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ. అందుకే ఆల్కహాల్ చాలా పరిమితంగా తీసుకోవాలి. మానేస్తే ఇంకా మంచిది. ∙కూల్డ్రింకులను అస్సలు తాగకూడదు. గౌట్ బొటనవేలు బిగుసుకుపోయినట్లు కావడం, కీళ్ల మధ్య రాయిలా మారడంతో కనిపించే వ్యాధి గౌట్. గతంలో మాంసాహారం తీసుకునే సంపన్న వర్గాల్లో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు మారిన ఆహార అలవాట్ల వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మాంసాహారం, మద్యంలో పూరిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పోషకాల్లాగానే ఇవి కూడా శారీరక కార్యకలాపాల్లో పాలుపంచుకుని కణంలోకి పూర్తిగా శిథిలమైపోవాలి. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే రక్తంలోకి కొన్ని వ్యర్థాలు విడుదల అవుతాయి. అందులో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. కొందరిలో యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యన చేరి రాయి (క్రిస్టల్)లా గట్టిగా మారిపోయి కీలును దెబ్బతీస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి వస్తుంది. అలా కీళ్లలో తీవ్రమైన బాధ కలిగిస్తుంది ఈ గౌట్. గౌట్ నివారణ కోసం ఆహార నియమాలు... ∙మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్ మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. ∙ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ∙స్వీట్స్, సాఫ్ట్డ్రింక్స్, ఆలూ (పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ∙పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని విరివిగా తీసుకోవాలి. తలనొప్పి నివారణ కోసం... తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. కంప్యూటర్ వర్క్ చేసే వారు కంటికి ఒత్తిడి కలగకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించాలి. ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ అవాలి. కంప్యూటర్పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు. ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు... అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్లు చేస్తూ కంటిని ఒత్తిడికి గురి చేసేవారు మన పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం. ∙పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ∙నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. ∙పడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి. ∙ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి. ∙కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం మానేయాలి. కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలు అవాయిడ్ చేయడం అవసరం. ∙ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి చేయడం సరికాదు. ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు. ∙రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని తలనొప్పులను నివారించవచ్చు. జలుబు సాధారణ జలుబును కలగజేసే వైరస్ జన్యుస్వరూపం వెంటవెంటనే మారిపోతుంటుంది కాబట్టి దీని నివారణకు మందు రూపొందించడం సాధ్యం కాదు. అయితే దీనివల్ల ఎలాంటి ముప్పూ లేకపోయినా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీని నివారణ అవసరం. మిగతా వైరల్ రోగాలలాగే జలుబుకి ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను అనుసరించి మందులు వాడాలి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలవకూడదు. పారాసిటమాల్ వంటి జ్వరం తగ్గించే మందులు వాడాలి. ∙ఈ వ్యాధి సంక్రమించినవారు సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టుకు దూరంగా ఉండాలి. ∙జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. గమనిక: మిజిల్స్, మంప్స్, రూబెల్లా, పోలియో లాంటివి కూడా వైరస్ల వల్ల వచ్చే జబ్బులే. అయితే వీటికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టీకాతోనే వాటి పూర్తిస్థాయి నివారణ సాధ్యం. క్యాన్సర్ నివారణ... సింపుల్ మార్గాలు! క్యాన్సర్ అంటేనే చాలా మంది వణికిపోతుంటారు. కానీ అంతగా భయపెట్టే వ్యాధికి కూడా కొన్ని నివారణలు ఉంటాయి. ముదురు రంగు (డార్క్) చాక్లెట్లు: కోకో ఎక్కువగా ఉండే ముదురు రంగు చాక్లెట్లు క్యాన్సర్ను నిరోధిస్తాయి. వీటిలోని పెంటామెర్ అనే ఫ్లేవనాయిడ్స్కు క్యాన్సర్ను హరించే గుణం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ను తీసుకోకపోవడం: పిజ్జాలు, బర్గర్లు, పఫ్ల వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్తో పాటు చక్కెర ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్ను తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు వీలుగా వాడే నూనెల వంటి పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువ. అదే సంప్రదాయ వంటకాలతోక్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ∙కార్సినోజెన్స్కు దూరంగా ఉండటం: కార్సినోజెన్ అంటే క్యాన్సర్ను కలిగించేది అని అర్థం. సిగరెట్ పొగలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు (కార్సినోజెన్స్) చాలా ఎక్కువ. అలాగే మద్యం ఎక్కువ మోతాదుల్లో తీసుకోవడం కూడా దీర్ఘకాలంలో క్యాన్సర్కు కారణం కావచ్చు. ఇక పొగాకు, గుట్కా వంటివి కూడా క్యాన్సర్ కారణాలని స్పష్టంగా తెలుసు. వాటికి దూరంగా ఉండటం తప్పనిసరి. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అది కార్సినోజెన్ అవుతుందని గుర్తించాలి. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ వాడకూడదు. ∙వ్యాయామం చేయడం: శరీరానికి కదలికలు లేకుండా ఉండే జీవనశైలి క్యాన్సర్కు కారణాల్లో చాలా ప్రధానమైనది. వ్యాయామం మనలోని వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. అందుకే వ్యాయామాన్ని తప్పనిసరిగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల మనలో కొన్ని ఆరోగ్యకరమైన ఎంజైములు, రసాయనాలు ఊరి అవి మనలో వ్యాధినిరోధకశక్తిని మరింత శక్తిమంతం చేస్తాయి. ∙కంటి నిండా నిద్ర: అలసిన అన్ని కండరాలూ పూర్తి శక్తిని పుంజుకోవాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. క్రమం తప్పకుండా ఒకేవేళకు పడుకుని ఒకేవేళకు లేచే మంచి అలవాటు, కంటికి నిండైన నిద్ర... మనలోని అంతర్గత ఎంజైములు స్రవించే ‘ఎండోక్రైన్ వ్యవస్థ’ను మరింత ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మన ఆరోగ్యకరమైన ఎండోక్రైన్ వ్యవస్థ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాంతో అన్ని రకాల క్యాన్సర్లు దూరంగా ఉంటాయి. ∙వెల్లుల్లి: ఘాటైన వాసన వచ్చే వెల్లుల్లిలో క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. వెల్లుల్లి మన రోగనిరోధక వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. అందుకే వెల్లుల్లితో తీసుకోదగిన ప్రతి వంటపదార్థంలోనూ వాటిని బాగా వాడేలా చూసుకోండి. ప్రధానంగా అది జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక (ముఖ్యంగా పొట్ట, పెద్దపేగు) క్యాన్సర్లను నివారిస్తుంది. ∙బ్రకోలీ: ఇప్పుడు మన సూపర్మార్కెట్లలో దొరికే బ్రకోలీ అనే ఆకుకూర కూడా క్యాన్సర్ల నివారణకు బాగా తోడ్పడుతుంది. అందుకే దాన్ని సూపర్ఫుడ్ అని అభివర్ణిస్తుంటారు. అయితే దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో వండితే అందులోని క్యాన్సర్తో పోరాడే ఫ్లేవనాయిడ్స్ నశిస్తాయి. అందుకే దీన్ని ఉడికించి తినడం లేదా వీలైతే కొత్తిమీరలా పచ్చిగా తినడం కూడా చాలా మేలు చేస్తుంది. ∙తాజాపండ్లు: దానిమ్మ, నేరేడు వంటి పండ్లను తినడం క్యాన్సర్లను నిరోధిస్తుంది. ఏ సీజన్లో లభ్యమయ్యే పండ్లను ఆయా సీజన్లలో తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరిగి క్యాన్సర్లను నివారిస్తుంది. ∙మధ్యధరా తీరవాసుల జీవనశైలి: యూరప్లోని మధ్యధరా తీరవాసుల జీవనశైలి ప్రపంచంలోనే చాలా చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిగా పేరొందింది. మధ్యధరా తీరంలో ఉండే దేశాలన్నింటినీ కలిపి ‘ప్రపంచపు పండ్లబుట్ట’గా చెబుతారు. మధ్యధరా సముద్రపు చుట్టుపక్కల ఉండే అన్ని దేశవాసులు తమ ఆహారంలో పండ్లను చాలా ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఆ ప్రాంతానికా పేరు. పళ్లతో పాటు వాళ్లు ఆకుకూరలు, చేపలు, ఆలివ్ ఆయిల్, పొట్టుతో ఉండే ధాన్యాలు, బీన్స్ వంటి లెగ్యూమ్స్, నట్స్ వంటివి వాళ్ల ఆహారంలో ఎక్కువ. ఈ తరహా ఆహారపు అలవాట్లు ఉండి, పొగాకు వాడకానికి దూరంగా ఉంటే చాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 60 శాతం పడిపోతాయని చెబుతున్నారు ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్కు చెందిన పరిశోధకుడు డాక్టర్ లొరెంజో కోహెన్. ∙బరువు తగ్గించుకోవడం: ప్రపంచవ్యాప్తంగా సంభవించే క్యాన్సర్ మరణాల్లో అత్యధికం బరువు ఎక్కువగా ఉండేవారిలోనే అన్నది నిజం. మహిళలు బరువు పెరుగుతున్నకొద్దీ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ పెరుగుదలకు దారితీస్తుంది. ఈస్ట్రోజెన్ పెరగడం రొమ్ముక్యాన్సర్, యుటిరైన్ క్యాన్సర్కు దోహదం చేస్తుంది. అందుకే తమ బరువును అదుపులో ఉంచేలా ప్రతిఒక్కరూ వ్యాయామాలు చేయడం అవసరం. ∙నోరు పరీక్షించుకుంటూ ఉండటం: ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్ చేత నోటిని పరీక్షింపజేసుకుంటూ ఉండటం అవసరం. ∙మహిళలు సొంతంగా రొమ్ము పరీక్షించుకుంటూ ఉండటం: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. కాబట్టి ప్రతిసారీ రుతుస్రావం ముందర తామే సొంతంగా రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. వాటిల్లో తేడాలేమైనా ఉంటే గమనించే ఈ పరీక్షను సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్బీఈ) అంటారు. రొమ్ముల్లో గడ్డలుగానీ, నొప్పి లేదా సలపరంగానీ, నిపుల్ లోపలకు ముడుచుకుపోయినట్లుండటం గానీ లేదా నిపుల్ నుంచి ఏమైనా స్రావాలు వస్తుంటే మాత్రం వెంటనే వైద్యనిపుణులను కలవాలి. ∙హెపటైటిస్–బి వ్యాధి ఆ తర్వాతి కాలంలో కాలేయ క్యాన్సర్గా మారే అవకాశాలు ఎక్కువ. అయితే అదృష్టవశాత్తు దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జీవితాంతం ఆ వ్యాధి నుంచి రక్షణ దొరుకుతుంది. ∙మహిళల్లో హెచ్పీవీ వైరస్ వల్ల గర్భాశయముఖద్వార క్యాన్సర్ (సర్విక్స్ క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువ. క్యాన్సర్లలో దీనికి టీకా అందుబాటులో ఉంది. వైవాహిక సంబంధాల్లోకి వెళ్లని ప్రతి మహిళా ఈ వ్యాక్సిన్ను తీసుకుంటే అది సర్విక్స్ క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ ∙వుంచి సవుతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి విటమిన్–డి అందేలా జాగ్రత్తపడాలి. ∙కొవ#్వ పదార్థాలు (యానివుల్ఫ్యాట్, నెయ్యి) వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ∙బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి పోషకాలు శరీరానికి అందేలా క్యారెట్, టమోటా వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ∙పొగతాగడానికి, వుద్యపానానికి దూరంగా ఉండాలి. మలబద్దకం నివారణ ∙పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముడిబియ్యం (దంపుడు బియ్యం), ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకునే వారిలో మలబద్దకం సమస్య చాలా తక్కువ. బియ్యం తవుడు, గోధుమ తవుడులలో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి మిగతా ఆహార పదార్థాలతో కలిపి రోజూ మూడు టీ స్పూన్ల తవుడు తీసుకుంటుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు. ∙ప్రతిరోజూ రాత్రి రెండు చెంచాల మెంతులను నమలకుండా మింగాలి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మృదు విరేచనకారిగా పని చేస్తుంది. ∙బొప్పాయి, బత్తాయి, నారింజ, పనస... మొదలైన పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ∙వ్యాయామం కూడ మలబద్దకం నివారణకు తోడ్పడుతుంది. అన్ని కండరాల్లాగే పేగుకండరాలకూ చురుకుదనం సమకూరి మలబద్దకం నివారణ జరుగుతుంది. -
బరువు తగ్గించుకోవడంపై...
అపోహ-వాస్తవం నేటి ఆధునిక జీవితంలో సౌకర్యాలు పెరిగినంత వేగంగా బరువూ పెరుగుతోంది. ఆ స్థూలకాయాన్ని తగ్గించుకోవడం పెద్ద వ్యాపకంగా మారుతోంది కూడా. ఈ నేపథ్యంలో కొన్ని అపోహలు కూడా రాజ్యమేలుతుంటాయి. అపోహ: వేగంగా బరువు తగ్గితే, ఆ తగ్గిన బరువు అంతే వేగంగా పెరుగుతుంది కూడా. వాస్తవం: నిదానంగా బరువు తగ్గడం ఆరోగ్యకరం అనడంలో సందేహం లేదు. అలాగే బరువు వేగంగా తగ్గడం వల్ల జీవరక్షణ వ్యవస్థలో అపసవ్యతలు తలెత్తే ప్రమాదం ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే బరువును వేగంగా తగ్గించుకున్న వారు అంతే వేగంగా తిరిగి పూర్వపు బరువుకు చేరతారనడంలో వాస్తవం లేదు. ఆరోగ్యకరమైన ఆహారనియమాలను కొనసాగిస్తే దేహం అదే బరువుతో కొనసాగుతుంది. కోల్పోయిన కేలరీలను భర్తీ చేసుకోవడానికి మెదడు... మనిషిని హై కేలరీ ఫుడ్ పట్ల ఆకర్షితమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలో మెదడు చేసే మాయాజాలంలో పడిపోతే ఇక అధిక బరువు, ఆరోగ్యం గురించి మర్చిపోవాల్సిందే.