breaking news
head tonsure
-
లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్బాబు
-
శిరోముండనం కేసు; కొత్త కోణం
సాక్షి, సీతానగరం (రాజానగరం): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగిన శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన బాధితుడు విజయ్బాబు ఇసుక లారీయే తనను ఢీకొట్టలేదని చెప్పాడు. ప్రసాద్, ఇంకొందరితో కలసి మద్యం తాగిన తాను తరువాత ఇంటికి వెళ్తూ బైక్ పై నుండి అదుపు తప్పి పడిపోయాయని స్పష్టం చేశాడు. అసలు తనకు ప్రమాదం జరిగిన సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి లేడని, వారి వ్యక్తిగత గొడవలు కప్పిపుచ్చుకునేందుకు తన ప్రమాదాన్ని వాడుకున్నారని ఆరోపించాడు. దళిత నాయకుడినని చెప్పుకునే హర్షకుమార్ కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నాడు. విజయ్బాబు ఏమన్నాడంటే... ‘ఈ నెల 18న రాత్రి ఏడున్నర వరకు ప్రసాద్తో కలిసి మద్యం తాగిన మాట వాస్తవమే. తర్వాత నేను ఒక్కడినే అక్కడి నుంచి బైక్పై ఇంటికి బయలుదేరాను. నన్ను లారీ ఢీకొట్టలేదు. బైక్పై నుంచి పడిపోవడం వల్లే గాయపడ్డాను. ప్రసాద్.. ఇసుక లారీలను ఆపి మద్యానికి డబ్బులు అడగటం లాంటివి చేస్తుంటాడు. అతడిపై చాలా కేసులు ఉన్నాయి. నన్ను లారీ ఢీకొట్టిందని నాటకమాడి డబ్బులు గుంజడానికి ప్రయత్నించాడు. హర్షకుమార్ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. గాయపడిన నన్ను పరామర్శించడానికి ఏ నాయకుడు కూడా రాలేదు. నా బాధలు నేను పడుతున్నా. నన్ను ఏ లారీ ఢీ కొట్టలేదు, గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జరిగిన ప్రమాదంతో ప్రసాద్కు సంబంధం లేదు’ అని విజయ్బాబు అన్నాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు రావడంతో పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. (శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు) హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి: అమ్మాజీ దళితుల తల్లులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్పై మండిపడ్డారు మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ. హర్షకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సార్లు వైఎస్సార్ దయతో ఎంపీగా పనిచేసిన హర్షకుమార్ ఇంత దారుణంగా మాట్లాడడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేవాడు దళిత నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) -
పూజలు ఫలించలేదు.. బెయిల్ రాలేదు
అమ్మకు బెయిల్ రావాలి.. ఆమె బయటకు వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి అంటూ తమిళనాట వేలాది మంది మొక్కుకున్నారు. అమ్మకు బెయిల్ రావాలంటూ వందలాది మంది సామూహికంగా ముందుగానే గుళ్లు గీయించుకున్నారు. ఉపవాసాలు ఉన్నారు. ఆ మొక్కులు ఫలించలేదు.. జయలలితకు బెయిల్ రాలేదు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడి సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత జైల్లోకి వెళ్లినప్పటి నుంచి తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో తమిళులు.. ముఖ్యంగా అన్నాడీఎంకే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిరాహార దీక్షలు, మౌన దీక్షలు, ప్రదర్శనలు.. ఇలా అన్ని రకాలుగా ఆమెకు సంఘీభావం తెలియజేస్తూ వచ్చారు. తమిళ సినీ పరిశ్రమ మొత్తం కొన్ని రోజులు స్తంభించింది. పాఠశాలలు, కళాశాలలు.. ఇలా అన్నిరకాల విద్యాసంస్థలు పనిచేయడం మానేశాయి. చివరకు అభిమానుల నుంచి కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. జయలలితకు బెయిల్ రాకపోయిందో.. తమిళనాడులో ఉన్న కన్నడిగులందరినీ బందీలుగా చేస్తామంటూ పోస్టర్లు కూడా వేశారు. ఎంత చేసినా కర్ణాటక హైకోర్టు జడ్జి మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదనే తేల్చి చెప్పేశారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఆమెకు ఇవ్వడానికి తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరఫున వాదించిన న్యాయవాదులు చెప్పినా కూడా న్యాయమూర్తి మాత్రం ఆ వాదనలతో ఏకీభవించలేదు.