-
ఒకరికి ఒకరు ఊతమిచ్చుకున్నారు
వాళ్లిద్దరూ వికలాంగులు. పుట్టుకతోనే పోలియోబారిన పడి నడవలేని పరిస్థితి వారిది. పదేళ్ల క్రితం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కాళ్లు లేకున్నా ఆత్మవిశ్వాసంతో తమకు తాముగా నిలదొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతున్న ఆ జంటను చూసి అంతా అభినందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న బాలాజీనగర్ తండాకు చెందిన కాట్రోత్ శంకర్ పుట్టుకతోనే వికలాంగుడు. నడవలేకున్నా చేతులనే ఆధారం చేసుకొని ఇంటర్ వరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత సైకిల్ పంక్చర్ దుకాణం పెట్టుకుని జీవనం సాగించడం మొదలుపెట్టాడు. టీవీఎస్ మోపెడ్ను తనకు వీలుగా మరో రెండు చక్రాలు బిగింపజేసుకుని దానిపై ఊరూరు తిరుగుతూ సీజనల్ వ్యాపారాలు చేస్తుంటాడు. ఇష్టపడిన జీవితం మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన శారద చిన్నప్పుడే పోలియోబారిన పడింది. శారదను కలిసిన శంకర్ ఆమెనే తన జీవితభాగస్వామిగా రావాలనుకున్నాడు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వికలాంగులు కావడంతో ఎలా బతుకుతారోనని ఆ తండాలోని అంతా అనుకున్నారు. కాని వారి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. ఊరూరా ఇడ్లీలు ఇద్దరూ తెల్లవారకముందే నిద్రలేచి ఇడ్లీలు తయారు చేసుకుని ద్విచక్ర వాహనంపై పెట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్ముతుంటారు. ఇడ్లీల అమ్మకంతో వచ్చిన డబ్బును పొదుపు చేసుకున్నారు. ఇడ్లీలతోపాటు వేసవి వస్తే ఐస్క్రీమ్లు అమ్మేవారు. చలికాలం దుప్పట్ల వ్యాపారం చేసేవారు. ఇలా సీజన్కు తగ్గట్టు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న శంకర్, శారద దంపతులు తండావాసులకు ఆదర్శం అయ్యారు. కిరాణా కొట్టుతో పోషణ పొదుపు చేసుకున్న డబ్బుతో ఇప్పుడు కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఓ చిన్న షాప్ వేసుకుని కిరాణాకొట్టు నిర్వహిస్తున్నారు. ఇద్దరు కలిసి కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాలకు వెళ్లి సామాన్లు కొనుగోలు చేసుకుని వస్తారు. ప్రతీ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ దుకాణం తెరిచే ఉంటుంది. తండావాసులే కాకుండా, రోడ్డున వెళ్లేవారు సైతం అక్కడ ఆగి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇద్దరినీ చూసి మెచ్చుకొని వెళుతుంటారు. కొత్త కష్టం కుటుంబ పోషణకు ఎవరిపైనా ఆధారపడకుండా వెళ్లదీసుకుంటున్న ఈ జంటకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. ఇన్నాళ్లూ పోగేసుకొని నిర్మించుకున్న షాప్ రోడ్డు వెడల్పులో పోతుందని ఆందోళన చెందుతోంది. అక్కడే ప్రభుత్వ స్థలం ఉందని, ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందిస్తే ఆ స్థలంలో షెడ్డు నిర్మించుకొని తమ బతుకులు తాము బతుకుతామని అంటున్నారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి ఫొటోలు: అరుణ్ మాకు కాళ్లు లేవని బాధగా ఉండేది. కానీ, ఇప్పుడు ఒకరికి ఒకరం ఉన్నాం. కాళ్లు లేవనే బాధ లేదు. నలుగురిలో భేషుగ్గా బతకాలని ఇద్దరం కష్టపడుతున్నాం. దేనికీ లోటులేకుండా బతుకుతున్నాం. మమ్మల్ని చూసి మా తండాలోనే కాదు చుట్టుపక్కల ఊళ్లవాళ్లూ మెచ్చుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. – కాట్రోత్ శంకర్, శారద దంపతులు -
బిక్కుబిక్కుమంటూ
వారంతా మానసిక వికలాంగులు. చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించలేని నిస్సహాయులు. ఆరు రోజులు నీళ్లల్లోనే కాలం గడిపేశారు. చివరికి సహాయక బృందాలు కాపాడాయి. త్రిసూర్ జిల్లా మురింగూర్లోని మానసిక సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టడంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. జనావాసాలకు దూరంగా ఉండే ఆ మానసిక కేంద్రం గురించి పట్టించుకునేవారే లేకపోయారు. మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో స్థానిక బ్లాక్ పంచాయతీ సభ్యుడు థామస్ మాత్రం వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు. ప్రతీరోజూ చిన్న మరబోటులో ఆ కేంద్రానికి ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. ఆరు రోజులు గడిచాక సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కానీ వరదనీరు చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేక ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారు. థామస్ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడిన థామస్ని రియల్ హీరో అని స్థానికులు కొనియాడుతున్నారు. -
అందరితో సమానంగా చూడాలి
సుభాష్నగర్(నిజామాబాద్ అర్బన్) : సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగమేనని, వారిని అందరితో సమానంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సర్వశిక్షా అభియాన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు సహాయ ఉపకరణాల నిర్ధారణ, పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు అవపరమైన అన్ని సదుపాయాలు కల్పించడం సమాజం బాధ్యత అని అన్నారు. 40శాతం ప్రభుత్వ నిధులు, 60శాతం ఎంపీ నిధుల్లో నుంచి ఈ పరికరాలను అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని 374 మంది దివ్యాంగులకు భవిత కేంద్రాల్లో చదువు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తున్న రీసోర్స్ పర్సన్ అలీంతో పాటు ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గతేడాది క్యాంప్ ద్వారా గుర్తించిన 164మంది పిల్లలకు కిట్స్, ట్రై సైకిళ్లు, ఎంఆర్ కిట్లు, బ్రెయిలీ కిట్లు అందజేశారు. శంకర్భవన్ స్కూల్ తనిఖీ అంతకుముందు శంకర్భవన్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్లో వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎనిమిదో తరగ తి గదిలోకి వెళ్లి పిల్లలను సిలబస్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. -
దివ్యాంగ పురస్కారాల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులకు, సంస్థలకు జాతీయ దివ్యాంగ పురస్కారాలు దక్కాయి. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రదానం చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. వ్యక్తిగత వృత్తిలో రాణింపునకు గుర్తింపుగా కరీంనగర్ జిల్లా చిర్తకుంటకు చెందిన సి.సాయికృష్ణ, చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి చెందిన కెవి.శిరీషలకు అవార్డులు దక్కాయి. దివ్యాంగులకు ఉద్యోగ కల్పన ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతున్న హైదరాబాద్కు చెందిన యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్కు, అలాగే సికింద్రాబాద్కు చెందిన దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థలకు అవార్డులు దక్కాయి. దేవ్నార్ సంస్థ చైర్మన్ సాయిబాబాగౌడ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రోల్ మోడల్ అవార్డుల విభాగంలో సికింద్రాబాద్కు చెందిన కె.శేషగిరిరావు, ఆదిలాబాద్కు చెందిన ఆకుల రోహిత్లకు అవార్డులు దక్కాయి. అలాగే దివ్యాంగులకు అవసరమైన ఉత్పత్తులను తక్కువ ధరలో అందుబాటులోకి తేవడంపై జరిపిన పరిశోధనలకుగానూ హైదరాబాద్కు చెందిన బిశ్వజిత్రాయ్, ఆశాదాస్, విజయ్కుమార్ అలిషాలకు అవార్డులు దక్కాయి. ఇక దివ్యాంగులకు అనువుగా పరిసరాల ఏర్పాటు విభాగంలో శ్రీకాకుళం సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసుకు అవార్డు దక్కింది. దివ్యాంగుల సంక్షేమ అవార్డును ఈ ఏడాదికిగానూ మెడ్ ఇండియా వ్యవస్థాపకుడు పద్మశ్రీ డా.టీఎస్ చంద్రశేఖర్ అందుకున్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి రూ.33 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, కర్రలు, క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు, వాహనాలను అందించనున్నట్లు తెలిపారు. బధిరులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ప్రారంభించాలన్నారు. స్వయం ఉపాధి పథకం కింద దివ్యాంగులకు రుణ సదుపాయంలో సబ్సిడీ గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నామని తెలిపారు. వివాహం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రూ.50 వేల చొప్పున 2,120 మంది దివ్యాంగులకు బహుమతి అందించాలని నిర్ణయించారు. దివ్యాంగుల ఆటల పోటీలకు ప్రతి జిల్లాకు రూ.లక్ష కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మూడో శనివారం ‘స్వరక్ష’ అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత పెరగాలని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. మహిళలకు రక్షణ మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, మహిళల అక్రమరవాణాను శాశ్వతంగా నిరోధించాలనే లక్ష్యంతో ప్రతి మూడో శనివారం రాష్ట్రమంతా ‘స్వరక్ష’డే పేరిట అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పా రు. డిజిటల్ ఇండియాలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ట్యాబ్లు ఇస్తామని చెప్పారు. కేంద్రాల్లో పిల్లల నమోదు, వయసు, భోజన పథకాలు ట్యాబ్ల ద్వారానే పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement