-
ఎస్వీఐటీలో నేడు మైక్రోసాప్ట్ కంపెనీ జాబ్మేళా
రాప్తాడు(కనగానపల్లి): మండలంలోని హంపాపురం సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ (ఎస్వీఐటీ) కళాశాలలో మైక్రోసాప్ట్ కంపెనీ తరఫున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి. సూర్యశేఖరరెడ్డి తెలిపారు. స్థానిక కళాశాలలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు మైక్రోసాప్ట్ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆ కంపెనీ ఉప సంస్థ క్లెంట్ బైనరీ టైటాన్స్ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతోందన్నారు. బీటెక్ ఫైనల్ చదువుతున్న అన్ని బ్రాంచ్ల విద్యార్థులు ఈ నియామకాల్లో పాల్గొనవచ్చన్నారు. కంపెనీ ప్రతినిధులు గురువారం ఎస్వీఐటీ కళాశాల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకొని అర్హులైన వారికి రాత, మౌఖిక పరీక్షలతో పాటు గ్రూపు చర్చలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల వైఎస్ చెర్మెన్ చక్రధర్రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీఐటీలో నేడు ఆన్ క్యాంపస్ డ్రైవ్
హంపాపురం (రాప్తాడు) : మండలంలోని హంపాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాలలో నేడు(శనివారం) ఆన్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ సి. సోమశేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వైస్ చైర్మన్ సి. చక్రధర్రెడ్డి, ప్రిన్సిపల్ టి. సోమశేఖర్రెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన ‘ట్రైజెంటో సాఫ్ట్వేర్ సొల్యుషన్స్’ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఇంజినీరింగ్ నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈడ్రైవ్కు అర్హులని తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు ఇంటర్య్యూలు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన విద్యార్థులు బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని, వార్షిక ఆదాయం రూ. 2.40 లక్షలు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎన్.కిరణ్కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, పీడీ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యానికే కొలువు
- ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిత - జేఎన్టీయూ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి - ఎస్వీఐటీలో జాతీయస్థాయి మెగా జాబ్మేళా - ఇంటర్వ్యూలకు 3 వేలమంది విద్యార్థుల హాజరు - వెయ్యి మందికి నేడు ఉద్యోగ నియామకపత్రాల జారీ రాప్తాడు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ ఉన్న వారికే ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాలలో చైర్మన్ సి.సోమశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరకు చెందిన జైన్ యూనివర్సిటీ సహకారంతో దేశంలోని 25 ప్రముఖ కంపెనీలతో జాతీయస్థాయి మెగా జాబ్మేళా నిర్వహించారు. ‘అనంత’తోపాటు ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు జాబ్మేళాకు హాజరయ్యారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థలు తరగతి గదికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యం మెరుగు పర్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. చైర్మన్ సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రతనాల్లాంటి విద్యార్థులు ఉన్నారన్నారు. ఆ రతనాలకు మెరిపించేందుకే జాబ్మేళా నిర్వహించామన్నారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకూ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జాబ్మేళాలో ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుం విధించలేదన్నారు. వైస్ చైర్మన్ సి.చక్రధర్రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో 25 కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలు జరపడం ఇదే మొదటిసారని, అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కోచింగ్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చదివినా ఉద్యోగాలు వచ్చేది నమ్మకం లేదన్నారు. విద్యార్థులు కష్టపడకుండా ఉద్యోగాలు సాధించేందుకు తమ కళాశాలలో ఉద్యోగా మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగాలకు వెయ్యి మంది ఎంపిక.. జాతీయస్థాయి జాబ్మేళా విజయవంతం అయ్యింది. డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమో, ఫార్మసీ, 2015, 16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 3 వేల మంది హాజరయ్యారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు వివిధ గదులు కేటాయించారు. కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన జాబ్మేళాలో దాదాపు 1000 మంది విద్యార్థులను ఎంపిక చేశామని, వారికి ఆదివారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ఎస్వీఐటీ యాజమన్యం తెలిపింది. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్సిటీ మార్కెటింగ్ మేనెజర్ అశ్విన్, ఫ్లేస్మెంట్ అసిస్టెంట్ మేనేజర్లు చందీల్, గణేష్, ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్రెడ్డి, కళాశాల ట్రెజరర్ రామసుబ్బమ్మ, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్కుమార్, పీడీ శ్రీనివాసులునాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement