breaking news
GVK Power
-
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాపై దివాలా చర్యలు
ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆదేశం మొత్తం బకాయిలు రూ.15,576 కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ చెల్లింపుల్లో విఫలమైనందున జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్)పై దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ ఆదేశాలు ఇచి్చంది. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్పై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని జీవీకేపీఐఎల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్లో తెలిపింది. ఫైలింగ్ ప్రకారం సతీష్ కుమార్ గుప్తాను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్గా (ఐఆర్పీ) ఎన్సీఎల్టీ నియమించింది. గ్యారెంటర్గా ఉన్నందుకే.. వాస్తవానికి ఈ రుణాన్ని దశాబ్దం క్రితం జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్ పొందింది,. దీనికి జీవీకేపీఐఎల్ గ్యారెంటర్గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 2022లో పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై దివాలా చర్యలకు ఆదేశిస్తూ జూలై 12న ఎన్సీఎల్టీ బెంచ్ ఆదేశాలు జారీచేస్తే, ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచి్చంది. 1.84 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ‘‘కార్పొరేట్ రుణగ్రహీత తన రుణ బాధ్యతలను అంగీకరించారు. 2018–19, 2019–20, 2020 –21 ఆర్థిక సంవత్సరాల వార్షిక నివేదికలలో ఈ విషయాన్ని అంగీకరించారు. జూన్ 13, 2022 నాటికి రుణగ్రహీత 1.84 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. చెల్లించాల్సిన మొత్తంలో 1.13 బిలియన్ డాలర్లు అసలు, 731.57 మిలియన్ డాలర్లు వడ్డీ, 1,44,000 డాలర్ల ఏజెన్సీ ఫీజు ఉన్నాయి’’(ఉత్తర్వు ప్రకారం రూ. 9,463 కోట్లు అసలు, రూ. 6,113 కోట్లు వడ్డీ, రూ. 1.23 కోట్ల ఏజెన్సీ ఫీజులు) అని ఎన్సీఎల్టీ ఉత్తర్వు పేర్కొన్నట్లు జీవీకేపీఐఎల్ తెలిపింది. మొదటి డిఫాల్ట్ 2017 ఫిబ్రవరి.. ఐసీఐసీఐ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది కే. వివేక్ రెడ్డి వాదనల ప్రకారం, మొదటి డిఫాల్ట్ ఫిబ్రవరి 2017లో సంభవించింది. అప్పటి నుంచి రుణ చెల్లింపులు జరగలేదు. జీవీకే కోల్ తీసుకున్న రుణానికి జీవీకేపీఎల్ బాధ్యత వహిస్తుంది. తొలుత ఈ కేసులో విచారణ జరిపిన లండన్ కోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. జీవీకే చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి చర్య అవుతుంది. ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకు రుణం ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకుగాను జీవీకే కోల్కు సెప్టెంబరు 2011లో ఐసీఐసీఐ బ్యాంక్ (దుబాయ్, బహ్రెయిన్, సింగపూర్ శాఖ లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రస్ అల్ ఖైమా), బ్యాంక్ ఆఫ్ ఇండియా (లండన్, సింగపూర్), కెనరా బ్యాంక్ (లండన్) రూ.8,356 కోట్ల టర్మ్ లోన్, అలాగే రూ.292 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ను మంజూరు చేశాయి. ఇతర బ్యాంకులు 367 కోట్ల రూపాయల అదనపు టర్మ్ లోన్లను మార్చి 2014లో మంజూరు చేశాయి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 2,089 కోట్ల రూపాయలకు పెంచాయి.విచారణాంశాలు.. రుణ మంజూరు సమయంలో చేసుకున్న అవగాహనలను ఉల్లంఘిస్తూ, రుణదాత అనుమతి లేకుండానే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో జీవీకే గ్రూప్ తన వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు మార్చి 2016లో ఐసీఐసీఐ బ్యాంక్ గుర్తించింది. దీనితో బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే తన వాటాను విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 2016లో లండన్ కోర్టులో బ్యాంకులు ఇంజక్షన్ దావా వేశాయి. రుణం చెల్లించని కారణంగా, ఫెసిలిటీ అగ్రిమెంట్–1 కింద రూ. 5,915 కోట్లు, ఫెసిలిటీ అగ్రిమెంట్–2 కింద రూ. 1,236 కోట్ల కోసం బ్యాంకులు లండన్ కోర్టులో క్లెయిమ్ పిటిషన్లు వేశాయి. అసలు, వడ్డీకి సంబంధించి రూ. 5,000 కోట్లను డిమాండ్ చేస్తూ 2020 నవంబర్లో ఐసీఐసీఐ బ్యాంక్ తన కార్పొరేట్ గ్యారెంటీ అమలుకు చర్యలు తీసుకుంది. రుణ చెల్లింపుల్లో తన వైఫల్యాన్ని అంగీకరించిన జీవీకేపీఐఎల్, రుణ చెల్లింపులకు కట్టుబడి ఉన్నానని అప్పటి వరకూ చర్యను నిలుపుచేయాలని బ్యాంకర్లను కోరింది. ముంబై జీవీకే ఎయిర్పోర్ట్ కొనుగోలు విషయంలో అదానీ గ్రూప్తో ఒక పరిష్కారానికి వచి్చన తరువాత రుణ చెల్లింపులు జరుపుతామని హామీ ఇచి్చంది. అయితే రుణ చెల్లింపులకు చర్యలు కనిపించకపోవడంతో బకాయిల కోసం 2022లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్సీఎల్టీ, హైదరాబాద్ బెంచ్ని ఆశ్రయించింది. -
బెంగళూరు ఎయిర్పోర్టుకు జీవీకే గుడ్బై
♦ మిగిలిన 10 శాతం వాటా విక్రయం ♦ ఫెయిర్ఫ్యాక్స్ వాటా 48 శాతానికి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (బీఐఏఎల్) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. బీఐఏఎల్లో జీవీకే వద్ద మిగిలిన 10 శాతం వాటాను ఫెయిర్ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్కు రూ.1,290 కోట్లకు విక్రయించనున్నట్టు తెలిపింది. 2017 జూలై ప్రారంభంలో ఈ లావాదేవీ పూర్తి అయ్యే అవకాశం ఉందని జీవీకే వెల్లడించింది. డీల్ పూర్తి కాగానే కంపెనీ బోర్డు నుంచి కో–చైర్మన్ జీవీకే రెడ్డి, ఎండీ సంజయ్ రెడ్డి తప్పుకోనున్నట్టు సమాచారం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని జీవీకే గ్రూప్ రుణ భారం తగ్గించుకోవడానికి ఉపయోగించనుంది. బీఐఏఎల్లో 33% వాటాను ఫెయిర్ఫ్యాక్స్ ఇండియాకు రూ.2,202 కోట్లకు విక్రయించేందుకు 2016 మార్చిలో జీవీకే ఒప్పందం కుదుర్చుకుంది. 2017 మార్చిలో ఈ డీల్ పూర్తి అయింది. అలాగే బీఐఏఎల్లో ఫ్లూగఫెన్ జూరిచ్ ఏజీ నుంచి 5 శాతం వాటాను ఫెయిర్ఫ్యాక్స్ కైవసం చేసుకుంది కూడా. దీంతో కంపెనీలో ఫెయిర్ఫ్యాక్స్ వాటా 38 శాతానికి చేరింది. శుక్రవారం నాటి డీల్తో ఈ వాటా కాస్తా 48 శాతానికి ఎగసింది. ఎయిర్పోర్ట్స్ రంగంపైనే..: బెంగళూరు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ, ఎయిర్పోర్ట్స్ రంగం తమ సంస్థకు కీలకమని జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తదుపరి దృష్టి ముంబై, నవీ ముంబై ఎయిర్పోర్టులపై ఉంటుందని చెప్పారు. ఈ రంగంలో ప్రైవేటీకరణ అవకాశాలపై ఫోకస్ చేస్తామన్నారు. కాగా, 2009 నవంబర్లో బీఐఏఎల్లో 12 శాతం వాటాను జూరిచ్ ఎయిర్పోర్టు నుంచి జీవీకే దక్కించుకుంది. అలాగే లార్సెన్ అండ్ టూబ్రో నుంచి 17 శాతం కొనుగోలు చేసింది. సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్ నుంచి కైవసం చేసుకున్న వాటాతో బీఐఏఎల్లో జీవీకే వాటా 43 శాతానికి చేరింది. ప్రస్తుతం బీఐఏఎల్లో అతి పెద్ద వాటాదారుగా ఫెయిర్ఫ్యాక్స్ నిలిచింది. బీఎస్ఈలో శుక్రవారం జీవీకే ఇన్ఫ్రా షేరు ధర 14.45% పెరిగి రూ.5.94 వద్ద క్లోజయ్యింది. -
జీవీకే పవర్ కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2015-16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర నష్టాలు అధికమయ్యాయి. ఈ కాలంలో నికర నష్టం రూ.407 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.108 కోట్లు నమోదైంది. టర్నోవర్ రూ.846 కోట్ల నుంచి రూ.1,081 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరానికి నికర నష్టం రూ.834 కోట్ల నుంచి రూ.934 కోట్లకు పెరిగింది. టర్నోవరు రూ.3,049 కోట్ల నుంచి రూ.4,164 కోట్లుగా ఉంది. గ్యాస్ సరఫరా సరిగా లేక ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడవకపోవడం నష్టాలకు దారి తీసిందని కంపెనీ తెలిపింది.