breaking news
GSM users
-
జీఎస్ఎం యూజర్లు @ 73.94 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య అక్టోబర్లో 73.94 కోట్లకు చేరింది. సెప్టెంబర్తో పోల్చితే ఈ సంఖ్య 73.31 కోట్లు. ఒక్క అక్టోబర్లో జీఎస్ఎం వినియోగదారులు 63 లక్షలు పెరిగారు. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. సంస్థల వారీగా చూస్తే... భారతీ ఎయిర్టెల్: 27.67 లక్షల మంది కొత్త చందాదారులతో ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 23.79 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 32.18 శాతం. ఒడాఫోన్: 13.06 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. మొత్తం సంఖ్య 18.94 కోట్లు. మార్కెట్ షేర్ 26.62 శాతం. ఐడియా సెల్యులర్: 7.24 లక్షల మంది కొత్త వినియోగదారులతో మొత్తం సంఖ్య 16.72 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 22.62 శాతం. ఎయిర్సెల్: 6.12 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. మొత్తం సంఖ్య 8.46 కోట్లకు చేరింది. టెలినార్: 9.32 లక్షల మందికి కలుపుకుని మొత్తం సంఖ్య 4.87 కోట్లకు ఎగసింది. ఎంటీఎన్ఎల్: 6,342 మంది కొత్త వినియోగదారులతో సంఖ్య 35.18 లక్షలకు ఎగసింది. వీడియోకాన్ టెలికం: 51,004 మంది వినియోగదారులను కోల్పోయింది. చందాదారుల సంఖ్య 78.49 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్ గణాంకాలను సీఓఏఐ తెలియజేయలేదు. -
జీఎస్ఎం వినియోగదారులు@ 73.31 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ నెలలో 70 లక్షల మేర పెరిగింది. దీంతో మొత్తం జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య 73.31 కోట్లకు చేరినట్లు పరిశ్రమ సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) పేర్కొంది. జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య ఆగస్ట్ నెల చివరి నాటికి 72.61 కోట్లుగా ఉందని తెలిపింది. సెప్టెంబర్ నెలలో ఐడియా సెల్యులార్ వినియోగదారుల సంఖ్య ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే గరిష్టంగా 26 లక్షలు పెరిగింది. దీంతో ఐడియా మొత్తం వినియోగదారులు 17 కోట్లకు చేరారు.