breaking news
grass burn
-
sagubadi: గడ్డికి నిప్పు పెడితే ఏమవుతుందో తెలుసా?
పంట కోసిన తర్వాత గడ్డి లేదా కట్టెకు అక్కడే నిప్పు పెట్టేస్తుంటాం కదా.. పొగ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, అంతకుమించి ఏమి నష్టం జరుగుతుందో మనకు తెలియదు. ‘సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్’ జర్నల్లో ఇటీవల అచ్చయిన ఒక అధ్యయన పత్రం ఈ విషయాలను లోతుగా చర్చించింది. గడ్డిని కాల్చేస్తే ఆ భూమిలోని సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం నశించి, పొలం పర్యావరణ వ్యవస్థల సహజ క్రియలకు విఘాతం కలుగుతుందని ఈ అధ్యయనం వివరించింది. భారత్ సహా అనేక దేశాల్లోని పొలాల్లో గడ్డిని కాల్చటం వల్ల భూమికి, రైతుకు ఎలా నష్టం జరుగుతున్నదో తెలుసుకోవటానికి 250 అధ్యయన ఫలితాలను క్రోడీకరించి విశ్లేషించటం విశేషం.గడ్డిని తగులబెట్టినప్పుడు 33.8–42.2 డిగ్రీల సెల్సియస్ వరకు మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడికి మట్టిలోని నత్రజని నశిస్తుంది. సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. అంగుళం లోతు వరకూ ఉండే మట్టిలోని అపారమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాదు, చీడపీడల బెడద పెరుగుతుంది. ఎరువు మరింత ఎక్కువ వేయాల్సి వస్తుంది. పొలంలో కనిపించే పురుగులను ఏరుకు తినేసే సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, కప్పల సంఖ్య గడ్డీ గాదాన్ని తగులబెట్టిన పొలాల్లో పెద్దగా కనిపించవు. మంటపెట్టినప్పుడు వెలువడే అధిక ఉష్ణోగ్రత మట్టి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మట్టిలో ఉండే పోషకాలను మొక్కల వేర్లు తీసుకోగలిగే రూపంలోకి మార్చి అందించే అద్భుతమైన సహజ పోషణ వ్యవస్థ దెబ్బతింటుంది. గడ్డీగాదాన్ని కాలబెట్టకుండా నేలపై కప్పి ఆచ్ఛాదన చేయటం ఎన్ని విధాలా మేలో ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. -
షార్ట్సర్క్యూట్తో గ్రాసం దగ్ధం
లేపాక్షి : వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి షార్ట్సర్క్యూట్ జరగడంతో ట్రాక్టర్లో తీసుకెళుతున్న మొక్కజొన్న సొప్ప దగ్ధమైంది. ట్రాలీ కూడా పాక్షికంగా దెబ్బతింది. వివరాల్లోకెళితే... లేపాక్షి గ్రామపంచాయతీలోని గలిబిపల్లికి చెందిన రైతు అంజనరెడ్డి పాడి పశువుల కోసం మొక్కజొన్న సొప్పను ఇతరుల వద్ద రూ.5వేలకు కొనుగోలు చేశాడు. ఈ సొప్పను శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాసులుకు చెందిన ట్రాక్టర్లో వేసుకుని ఇంటికి బయల్దేరాడు. తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను సొప్ప లోడుతో వెళుతున్న ట్రాక్టర్ తాకింది. దీంతో తీగలు ఒకటికొకటి తగులుకుని షార్ట్సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు సొప్పపై పడ్డాయి. అంతే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ఇంజిన్ నుంచి ట్రాలీని వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాలీతోపాటు మొక్కజొన్న సొప్ప కాలిపోయాయి. దాదాపు రూ.60వేల నష్టం వాటిల్లిందని ట్రాక్టర్ యజమాని శ్రీనివాసులు వాపోయాడు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతుండడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు తెలిపారు.