-
చదువు కొనాల్సిందే
వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి.. విద్యార్థులకు పుస్తకాల బరువు, తల్లిదండ్రులకు ఫీజుల భారం తప్పడం లేదు.. ఐఐటీ, నీట్, ఒలింపియాడ్, టెక్నో, ఈటెక్నో తదితర పేర్లతో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రుల ఆశను కార్పొరేట్ యాజమాన్యాలు చక్కగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు రూ.25 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలకు రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వీటితోపాటు అడ్మిషన్ ఫీజును కూడా వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన విద్యాశాఖాధికారులు కార్పోరేట్ విద్యాసంస్థలపై కన్నెత్తి చూడకపోడం అవినీతి ఆరోపణలకు దారితీస్తోంది. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. సాక్షి, నెల్లూరు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలో ఫీజుల పట్టికను ప్రదర్శించాల్సిఉంది. పట్టిక ఏ పాఠశాలలో కనిపించకపోయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తమ పాఠశాలలో అడ్మిషన్లు లేవంటూ తిరిగి పంపివేస్తున్న ఘటనలు ఉన్నాయి. పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ వేయాల్సి ఉన్నా ఆ ఊసే ఎక్కడా కనిపించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1054 కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 383 ప్రాథమిక, 274 ప్రాథమికోన్నత, 393 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,64,724 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితోపాటు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా 600కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో మరో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం. కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న వివిధ రకాల ఫీజులను పరిశీలిస్తే .. తరగతి ఫీజు అడ్మిషన్ ఫీజు పుస్తకాలు,సామాగ్రి 1నుంచి 5వ తరగతి వరకు రూ.25వేలు-రూ.లక్ష రూ.5వేలు రూ.3వేల నుంచి రూ.5వేలు 5 నుంచి 10వ తరగతి వరకు రూ.40 వేలు-రూ.1.75 లక్షలు రూ.10వేలు రూ.5 వేల నుంచి రూ.8 వేలు తమ బిడ్డలను ఉన్నతస్థాయిలో చూడాలన్న తల్లిదండ్రుల ఆశను కార్పొరేట్ విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. రకరకాల కోర్సుల పేరుతో భారీ మొత్తంలో ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఫీజులను ప్రతి ఏడాది 20 నుంచి 30 శాతం వరకు పెంచుతూ తల్లిదండ్రులపై మరింత భారం మోపుతున్నారు. ఉత్తర్వులు బేఖాతర్ 2008లో జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫీజులు నిర్ణయించేందుకు డీఈఓ, జిల్లా ఆడిట్ అధికారి, స్వచ్ఛంద సంస్థ లేదా తల్లిదండ్రులతో కూడిన కమిటీని కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించాల్సిఉంది. ఈ కమిటీ పాఠశాల మౌలిక సదుపాయాలు, పరిస్థితులను పరిశీలించిన తరువాత ఫీజు ఎంత వసూలు చేయాలన్నది నిర్ణయిస్తుంది. పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ తదితరవి విక్రయించరాదు. వీటిని యాజమాన్యాలు సూచించిన వారి వద్దే కొనాలన్న నిబంధన ఏమీ ఉండదు. వీటి అమ్మకాలను పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయకూడదు. పరీక్షల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, నీట్, ఒలింపియాడ్, కాన్సెప్ట్, టెక్నో, ఈటెక్నో, ఈ శాస్త్ర తదితర పేర్లను రాయకూడదు. కేవలం పాఠశాల అని మాత్రమే రాయాల్సిఉంది. అయితే ఈ నిబంధనలకు ఏ పాఠశాల యాజమాన్యం ఖాతరు చేయడం లేదు. లంచాలు అందుతుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. -
మూడేళ్లు దాటితేనే నర్సరీలో ప్రవేశం
* వయోపరిమితిపై జీఆర్ విడుదల * ఐదేళ్లు దాటిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం సాక్షి, ముంబై: నర్సరీ, ప్లే గ్రూప్ విభాగాల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వం నియమ నిబంధనలు ప్రకటించింది. వయో పరిమితి విషయంలో ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలు వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్లే గ్రూప్ లేదా నర్సరీలో అడ్మిషన్ ఇవ్వడానికి పాఠశాల యాజమాన్యాలు నిర్దిష్టమైన వయో పరిమితిని అనుసరించడం లేదు. ఈ విభాగంలో అడ్మిషన్లు ప్రైవేటు విద్యా సంస్థల ఇష్టారాజ్యంగా మారిపోయింది. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుని పాఠశాల యాజమాన్యాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. పాఠశాలల్లో ప్రవేశం పొందే పిల్లల వయో పరిమితిని నిశ్చయించేందుకు ప్రాథమిక విద్యా శాఖ డెరైక్టర్ అధ్యక్షతన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు కొత్త నియమాలతో ప్రభుత్వం జీఆర్ విడుదల చేసింది. ప్లే గ్రూప్, నర్సరీ పిల్లలు ప్రవేశం పొందాలంటే మూడేళ్లు పూర్తిగా నిండాలి. ఐదేళ్లు పూర్తయిన తరువాత ఒకటో తరగతి ప్రవేశం ఇవ్వాలని జీఆర్లో స్పష్టం చేశారు. ఇదివరకు నాలుగేళ్లు పూర్తయిన వారికి ఒకటో తరగితిలో ప్రవేశం లభించేది. కాని ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదేళ్లు నిండితేనే ప్రవేశం లభిస్తుంది. దీన్ని అన్ని విద్యా బోర్డులు అమలు చేయాలని జీఆర్లో ప్రభుత్వం ఆదేశించింది. నర్సరీలో ప్రవేశం తీసుకునే పిల్లలకు ఆ సంవత్సరం జూలై 31 నాటికి కనీసం మూడేళ్లు పూర్తిగా ఉండాలి. అదేవిధంగా ఒకటో తరగతిలో ప్రవేశం పొందేవారు ఆ సంవత్సరం జూలై 31 నాటికి ఐదేళ్లు పూర్తిగా ఉండాలి. ప్రస్తుతం కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచేశాయి. సాధ్యమైనంత వరకు కొత్త జీఆర్ ప్రకారం వారికి అడ్మిషన్లు ఇవ్వాలని విద్యా శాఖ కార్యదర్శి అశ్విని బిడే అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement