breaking news
Government laboratories
-
దేశీయ దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం, త్వరలోనే అమల్లోకి
న్యూఢిల్లీ: దేశీయ కాఫ్ సిరప్లపై ఇటీవలి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు ఎగుమతులపై కీలక నిబంధనలు జారీ చేసింది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు మందుల (సిరప్)లపై అనుమతిని తప్పనిసరి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆందోళనలు తలెత్తిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..! ప్రభుత్వ ల్యాబ్ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్షల అనంతరం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ యా ల్యాబ్స్ టెస్టింగ్ సంబంధించి దగ్గు సిరప్లపై తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఎగుమతుల సమయంలో ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. దేశం నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో తమ నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఆర్డీటీఎల్-చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్-కోల్కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్-చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్డీటీఎల్- గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ల్యాబ్ల్లో పరిక్షలకు అనుమతి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ ఐ డ్రాప్స్ను రీకాల్ చేసింది. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్లలో వరుసగా 66, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్లు కారణమని ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
ఈ నెల నుంచే మళ్లీ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ నెలలోనే మ్యాగీ బ్రాండ్ నూడుల్స్ విక్రయాలు మళ్లీ ప్రారంభించనున్నట్లు నెస్లే ఇండియా తెలిపింది. తాజాగా ఉత్పత్తి చేసిన నూడుల్స్... వినియోగానికి సురక్షితమైనవేనంటూ ప్రభుత్వ ల్యాబొరేటరీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించింది. బోంబే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటక, పంజాబ్, గోవాలోని తమ ప్లాంట్లలో తయారైన నూడుల్స్ను ప్రభుత్వ అక్రెడిటేషన్ గల మూడు ల్యాబొరేటరీలు క్లియర్ చేశాయని నెస్లే ఇండియా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉన్న మరో రెండు ప్లాంట్లలోనూ నూడుల్స్ తయారీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించింది. ఇందుకోసం కావాల్సిన అనుమతులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. మ్యాగీ నూడుల్స్లో హానికారక సీసం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలపై విక్రయాలను ఆహారపదార్థాల నాణ్యతా ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, దీన్ని సవాలు చేస్తూ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.