-
‘మెప్మా’ బినామీల దందా!
• చేతులు మారుతున్న ప్రభుత్వ నిధులు • రెండేసి బ్యాంకుల నుంచి రుణాలు.. • ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు • ఆధార్ అనుసంధానంతో 250 మంది పేర్ల తొలగింపు నర్సంపేట : నర్సంపేట నగర పంచాయతీ పరిధిలోని మురికివాడల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ద్వారా నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల్లో బినామీల దందా కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ని«ధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత నెల నుంచి ఆధార్ అనుసంధానం చేస్తుండడంతో 250 మంది పేర్లను కూడా తొలగించారు. అయితే, ఇప్పటికే పలువురు బినామీ పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు రెండు స్వయం సహాయ సంఘాల్లో పేర్లు నమోదు చేయించుకోని రుణాలు తీసుకున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది రుణాలను బ్యాంకులకు తిరిగి డబ్బులు చెల్లించడం లేదని చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ బ్యాంకుకు చెల్లించాల్సిన డబ్బును కాజేయడంతో సంఘంలోని సభ్యుల నడుమ గొడవ జరిగింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు.. మహిళా స్వయం సహాయక సంఘాల్లో అక్రమాలను నిర్మూలించేందుకు రాష్ట్రప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా సంఘాల్లోని బినామీలను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆధార్తో అనుసంధానం చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నర్సంపేట మెప్మా సంస్థకు చెందిన 699 స్వయం సహాయక సంఘాల్లో 7,280 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 1800 మంది వివరాలను ఆధార్తో అనుసంధానం చేయగా 250 మంది పేర్లు రెండు సంఘాల్లో నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో వారిని పేర్లను తొలగించారు. తద్వారా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చే స్వయం ఉపాధి రుణాలు పక్కదారి పట్టకుండా అర్హులకే అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పక్కదారి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయడానికి గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇందిరాక్రాంతి పథకం(ఐకేపీ) పేరును ఇప్పుడు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)గా మార్చారు. దీనిద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వ రుణాలు ఇస్తోంది. మహిళలు బృందాలుగా ఏర్పడి వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం కల్పించింది. నర్సంపేట పట్టణంలోని 20 వార్డుల్లో దాదాపు 40వేల మంది జనాభా ఉన్నారు. ఇందులో 699 స్వయం సహాయ సంఘాల్లో 7,280 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ఒక్కో గ్రూపులో ఐదుగురి నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఒక్కో స్వయం సహాయక సంఘం సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పిస్తోంది. ఈ రుణంతో కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటుచేసుకుని స్వయం ఉపాధి పొందాల్సి ఉంటుంది. ఇలా నగర పంచాయతీకి సంబంధించి ఐదు బ్యాంకుల నుంచి 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.4.50 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం విధించగా... మెప్మా అధికారులు 575 సంఘాలకు రూ.4 కోట్ల రుణాలు ఇప్పించారు. అయితే, రుణాలు పొందిన కొందరు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్టు రెండు గ్రూపుల్లో పేరు నమోదు చేసుకోని రెండుసార్లు బ్యాంక్ రుణాలు తీసుకోని తిరిగి చెల్లించడంలేదు. ఇంతకుముందు స్వయం సహాయక సంఘాల సభ్యులు అక్రమంగా రెండుచోట్ల రుణాలు తీసుకున్నా, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోయినా అధికారులు అంతగా పట్టించుకునే వారు కాదు. బ్యాంకు అధికారులు రెండు, మూడేళ్లకోసారి మారుతుండడంతో రుణాలు పొందిన మహిళా సంఘాల నుంచి బకాయిలు రికవరీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెబుతున్నారు. ఇలా కొన్నేళ్లుగా రూ.లక్షల్లో నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, నర్సంపేట నగర పంచాయతీ పరిధిలో బ్యాంక్ రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధార్ నంబర్లు అనుసంధానం చేయడంతో రెండు చోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. తద్వారా ఒక సభ్యురాలు నివాసం ఉండే చోటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని పరకాల, నర్సంపేట నగర పంచాయతీ సంఘాల్లోనూ çపూర్తిస్థాయిలో ఆధార్ అనుసంధానం చేస్తే అక్రమంగా రుణాలను పొందడాన్ని అరికట్టొచ్చని చెబుతున్నారు. -
నేను రాను బిడ్డో..సర్కార్ దవాఖానకు
ఓ సినీ కవి చెప్పినట్లు నర్సాపూర్లోని కమ్యూనిటీ ప్రభుత్వ ఆస్పత్రి తీరు తయారైంది. ఇక్కడ ఖరీదైన మందులు ఉన్నాయి.. కానీ వాటిని ఇచ్చేందుకు సూదులు(ఇంజెక్షన్లు) ఉండవు.. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు అంబులెన్స్ ఉంటుంది.. కానీ డీజిల్ ఉండదు.. పొరపాటున మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకువెళితే అందుకు అవసరమైన సామగ్రి మనమే తెచ్చుకోవాల్సిందే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి ఉంటే మరొకటి లేకపోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యం కోసం జేబులకు చిల్లులు పడుతుండడంతో సర్కార్ దవాఖాన అంటేనే ప్రజలు జంకుతున్నారు. - ఇంజక్షన్ చేయించుకోవాలంటే సూది తెచ్చుకోవాల్సిదే - అంబులెన్స్ కావాలంటే డీజిల్ పోసుకోవాలి - సామగ్రి కొనిస్తేనే పోస్టుమార్టం - ఇదీ..నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి ! నర్సాపూర్లోని కమ్యూనిటీ ప్రభుత్వ ఆస్పత్రిక రోజుకు మూడు నుంచి నాలుగు వందల మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఇన్పేషట్లు సరేసరి. నిత్యం రద్దీగా ఉండే ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులతో పాటు ఆస్పత్రి నిర్వహణ కోసం ఏడాదికి రూ.2.5లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇచ్చేందుకు మందులు ఉన్నప్పటికీ సూదులు(నిడిల్స్) ఉండవు. దీంతో రోగులో బ యట నుంచి సూదులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకు 200 ఇం జక్షన్ల చొప్పున లెక్క వేసుకున్నా నెలకు రూ.400 మించదు. అయినా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అనుమతి లేనిదే నిడిల్స్ కొనుగోలు చేయలేమని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపద కాలంలోనూ.. అన్నీ వ్యయాలే.. ఆపద కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు సైతం ఆర్థిక పరమైన వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను, క్షతగాత్రులను పెద్దాసుపత్రులకు తరలించాల్సి వస్తే అంబులెన్స్లో రోగుల సంబదీకులే డీజీల్ పోయిం చాల్సి వ స్తోంది. ఇదిలా ఉండగా ఎవరైనా చని పోయి పోస్టుమార్టం కోసం వస్తే పోస్టుమార్టం సమయం లో వినియోగించె ప్లాస్టిక్ కవర్, వైద్యు లు, సిబ్బంది వాడేం దుకు సబ్బులు, బ్లేడ్లు, గ్లౌజులు ఇతర సామగ్రి కూడా బాధితులే కొనివ్వాల్సి వస్తోంది. ఇక ఇబ్బందికి ఇచ్చే మా మూళ్లు సరేసరి. ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణకు నెలనెల లక్షల రూపాయలు ఖ ర్చు చేస్తున్న అధికారులు చిన్నచిన్న సామగ్రి సైతం అం దుబాటులో ఉంచకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని పేర్కొంటున్నారు. -
‘ఆరోగ్యం’లో అవినీతి!
- ఎన్హెచ్ఎం నిధుల వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ - డీఎంహెచ్ఓకు రిమైండర్ నోటీసు ఖమ్మం వైరారోడ్ : జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు ఉద్యోగులు ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరైన విచారణ చేపట్టకపోవటంతో వారి ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా జాతీయ ఆరోగ్యమిషన్లో రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కలెక్టర్ దృష్టికి వెళ్లటంతో ఆయన డీఎంహెచ్ఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా వివిధ పీహెచ్సీలకు ప్రతీ యేడాది రూ.కోట్లలో నిధులు వస్తుంటాయి. అయితే ఇటీవల ఉన్నతాధికారులు ఆడిటింగ్ చేయగా.. కోటి నిధులకు సంబంధించి లెక్క తేలలేదు. ఎన్హెచ్ఎం విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కీలకమైన అధికారి ఆ ఉద్యోగి ద్వారా నిధుల స్వాహా వ్యవహారానికి పాల్పడినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కలెక్టర్ ఇలంబరితి డీఎంహెచ్ఓకు రిమైండర్ నోటీసు ఇచ్చారు. వెంటనే ఎన్హెచ్ఎం నిధుల లెక్కలు చూస్తున్న ఔట్ సోర్సిం గ్ ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించి.. పర్మనెంట్ ఉద్యోగికి పూర్తిసాయి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఎన్హెచ్ఎంకు నిధులు ఇప్పటివరకు ఎన్ని విడుదలయ్యాయి? ఎంత ఖర్చు చేశారు? మిగిలిన నిధులు ఎన్ని? అనే విషయూలపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినుట్ల తెలిసింది. దీనికి తోడు 104లో నిధుల దుర్వినియోగంపై కూడా కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. రెండేళ్లలో 104 వాహనాల రిపేర్లు, టైర్లు, ఇతర వస్తువుల కొనుగోలు, ఖర్చులకు రూ.కోట్లలో నిధులు మంజూరయ్యాయి. వీటిలో కూడా భారీగానే అవినీతి జరిగినట్లు తేల్చారు. 104లో కూడా రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో కూడా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరగా విచారణ చేసి.. నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. -
రూ.60కోట్ల నిధులు వెనక్కు
- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం - 33 మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి మదనపల్లె: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రతియేటా మున్సిపల్ శాఖ నుంచి రెండు పర్యాయాలు 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది మార్చి 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 110 మున్సిపాలిటీలకు, 13 కార్పొరేషన్లకు నిధులను మంజూరు చేసింది. 77 మున్సిపాల్టీలలో ఈ నిధులను ఏప్రిల్ 5వ తేదీలోగా తీసుకున్నారు. మిగిలిన 33 మున్సిపాల్టీల్లో రూ.60 కోట్లకు పైగా నిధులను తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా వెనక్కి వెళ్లిపోయాయి. ఇందులో రాయలసీమ రీజనల్ పరిధిలో 9 మున్సిపాలి టీలు ఉండగా మన జిల్లాలో మూడు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీలోపు ఆయా పట్టణాల్లోని ట్రెజరీ కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వు కాపీలను సమర్పించి ఆ నిధులను మున్సిపల్ అకౌంట్కు బదలాయించి తీసుకోవాల్సి ఉంది. 33 మున్సిపాల్టీలలో అధికారుల పర్యవేక్షణ కొరవడం, చైర్మన్, పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఈ నిధులను సకాలంలో తీసుకోలేకపోయారు. ఆయా మున్సిపాలిటీల అధికారులు నిధులను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
రద్దు చేస్తారా.. ఆదరిస్తారా?
తీవ్ర ఆవేదనలో 9 లక్షల మంది ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: అధికారికంగా ఇళ్లు మంజూరయ్యాయి.. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. ఒక్క ఇటుక కూడా పడలేదు.. ఇదంతా ఎన్నికలకు ముందటి ముచ్చట. కానీ అధికారుల లెక్కల ప్రకారం వారంతా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులే...! ఇంతలో కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో అక్రమాల వెలికితీత పేరుతో పాత పథకానికి నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ లబ్ధిదారులంతా.. ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభించనందున తమను కొత్త పథకంలోకైనా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ సర్కారు నుంచి స్పష్టత కరువైంది. దీంతో తాము రూ.75 వేల యూనిట్ కాస్ట్ ఉన్న పాత పథకానికే పరిమితమవుతామా లేక రూ.3.50 లక్షలున్న కొత్త పథకంలోకి మారతామా అన్నది వారికి అంతు చిక్కడంలేదు. దీంతో వారంతా తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 లక్షల కుటుంబాల వేదన ఇది. అయోమయం.. గందరగోళం.. పేదల గృహ నిర్మాణ పథకం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతుండడం తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణంలో గతంలో అక్రమాలు జరిగాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీఐడీ తో దర్యాప్తు చేయిస్తోంది. అది తేలిన తర్వాతే రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని వేగిరం చేయాలని భావి స్తోంది. కానీ ఆ దర్యాప్తు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించటం లేదు. దీంతో పేదల ఇళ్ల విషయంలో తీవ్ర అయోమయం నెల కొంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవికి కిరణ్కుమార్రెడ్డి రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు ఏకంగా 13.65 లక్షల మం దికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్రం విడిపోవటంతో నిధులు విడుదల కాక ఆ ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దానికంటే ముందు కేటాయించినవి కూడా వివిధ కారణాలతో మొదలుకాలేదు. వెరసి తెలంగాణవ్యాప్తంగా 9 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని అధికారులు తాజాగా లెక్కతేల్చారు. అనుమతి వద్దు.. తర్వాత చూద్దాం! ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దంటూ జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే పనులు మొదలైన ఇళ్లకు మాత్రమే బిల్లులు విడుదల చేస్తామని అందులో స్పష్టంచేశారు. ప్రస్తుతం 4.69 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం రూ.147 కోట్లను విడుదల చేసేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు మొదలుపెట్టని 9 లక్షల ఇళ్లకు సంబంధించిన జాబితాను తాత్కాలికంగా పక్కనపెట్టారు. అయితే వాటిని అలాగే రద్దు చేస్తారా లేక కొత్త పథకంలోకి మారుస్తారా.. ఇందిరమ్మ పథకం కిందనే కొనసాగి స్తారా అన్న విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఆ తొమ్మిది లక్షల మందిని లబ్ధిదారులు కేటాయింపులను రద్దు చేసి రెండు పడక గదుల ఇళ్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిం చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement