-
యూనియన్ బ్యాంక్ రికార్డు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లో రూ. 1,712 కోట్ల డివిడెండ్ను ప్రభుత్వానికి అందజేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఒక డివిడెండ్ చెక్కును కేంద్రానికి సమరి్పంచినట్లు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ స్థాయిలో డివిడెండ్ను యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ సమరి్పంచలేదని కూడా ప్రకటన వివరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ మణిమేఖలై డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. జాయింట్ సెక్రటరీ (బ్యాంకింగ్) సమీర్ శుక్లా తదితర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కేంద్రానికి ఆర్బీఐ 28 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి) కేంద్రం ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం) ఇబ్బంది నుంచి కొంతమేర బయటపడే కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఆర్బీఐ బోర్డ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. క్లుప్తంగా వివరాలివీ... ► ఆర్బీఐ జూలై – జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. దీనిప్రకారం 2018 జూలై నుంచి 2019 జూన్ నెలాఖరు వరకూ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది. 2018 ఆగస్టులో (తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిధిలోనికి వచ్చే) ఆర్బీఐ ఒక ప్రకటన చేస్తూ, 2017–18కి సంబంధించి కేంద్రానికి రూ.50,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 40 వేల కోట్లు మిగులు నిధులుకాగా, 10 వేల కోట్లు మధ్యంతర డివిడెండ్. ► ఇక తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018 జూలై–2019 జూన్) సంబంధించి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ను కేంద్రానికి ఇస్తున్నట్లు తాజాగా సోమవారం పేర్కొంది. ► దీనితో కేంద్రానికి సంబంధించినంతవరకూ ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్–2019 మార్చి) ఆర్బీఐ నుంచి మొత్తం రూ.78,000 కోట్లు అందినట్లవుతోంది. ► ఇలా మధ్యంతర డివిడెండ్ను కేంద్రానికి ఆర్బీఐ ఇవ్వడం ఇది వరుసగా రెండవ సంవత్సరం. 2017–18లో ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి అందిన మొత్తం డివిడెండ్ రూ.30,663 కోట్లు. ► ఆర్బీఐ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2018 జూలై–2019 జూన్) 2018 డిసెంబర్కి 6 నెలలు పూర్తయ్యింది. పరిమిత ఆడిట్ సమీక్ష, అందుబాటులో ఉన్న మిగులు నిధులు (ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్) వంటి అంశాల ప్రాతిపదికన కేంద్రానికి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ను ఇవ్వాలని ఆర్బీఐ బోర్డ్ నిర్ణయం తీసుకుంది... అని సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ఒకటి తెలిపింది. ► 1934 ఆర్బీఐ చట్టం సెక్షన్ 47 కింద కేంద్రానికి ఆర్బీఐ తన మిగులు నిధులను అందిస్తోంది. మొండిబకాయిలు, మొండిబకాయిలుగా మారేందుకు అవకాశమున్న బకాయిలకు కేటాయింపులు, సిబ్బంది, పదవీ విమరణ నిధికి వాటా, ఇతర కేటాయింపులుపోను మిగిలిన లాభాలను కేంద్రానికి ఆర్బీఐ బదలాయించాలని ఈ సెక్షన్ పేర్కొంటోంది. ద్రవ్యలోటు... వివాదాల నేపథ్యం... 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ లేదా మిగులుగా రూ.82,911.56 కోట్లను పొందాలని బడ్జెట్ నిర్దేశించింది. ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో కేంద్రానికి ఇదొక మార్గం. 2018–19 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని సంబంధిత వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువయిందన్న మాట. దీనితో మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే ద్రవ్యలోటు అంచనాలను 3.3 శాతంకాకుండా, 3.4 శాతానికి కేంద్రం పెంచింది. అయితే ద్రవ్యలోటును 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రం పేర్కొంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జలాన్ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్ కమిటీ మాత్రం దీనిని 18 శాతంగా పేర్కొంది. అయితే, ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం మిగులు నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. మెగా బ్యాంకులు కావాలి: జైట్లీ ఆర్బీఐ బోర్డ్ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ, ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాల్లో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు, తత్సబంధ ఫలితాలను ప్రస్తావించారు. భారత్లో బ్యాంకుల సంఖ్య తగ్గాలనీ, మెగా బ్యాంకులు ఏర్పాటవ్వాలని ఆర్థికమంత్రి సూచించారు. తద్వారా ఈ రంగం దేశాభివృద్ధిలో మరింత కీలకపాత్ర పోషించగలుగుతుందన్నారు. ఎస్బీఐలో భారతీయ మహిళాబ్యాంక్ సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీనాన్ని జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇదే సానుకూల అనుభవంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయాబ్యాంక్ విలీన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ బ్యాంకుల విలీనంతో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 18కి తగ్గుతోంది. రేటు కోతపై బ్యాంకర్లతో 21న దాస్ భేటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్దాస్ ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్ చీఫ్లతో సమావేశం కానున్నారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బ్యాంకర్లు బదలాయించడంపై ఈ సమావేశంలో దాస్ దృష్టి సారించనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆర్బీఐ బోర్డ్ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ఆర్బీఐ గవర్నర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘రేట్ల కోత ప్రయోజనం బదలాయింపు చాలా ముఖ్యమైన అంశం. ఇదే విషయాన్ని పాలసీ సమీక్ష ప్రకటన సందర్భంగా చెప్పాం. 21న కూడా ఇదే అంశంపై దృష్టి సారించనున్నాం’’ అని తెలిపారు. లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.25 కోట్ల వరకూ రుణంపై ప్రకటించిన పునర్వ్యవస్థీకరణ పథకాన్ని దాస్ ప్రస్తావిస్తూ, ఇక ఈ పథకం అమలు బ్యాంకుల పరిధిలో ఉందని అన్నారు. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్బ్యాంకులపై రెగ్యులేటరీ చర్యల గురించి అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానం ఇస్తూ, నియంత్రణా నిబంధనల పాటింపు విషయంలో తగిన చర్యలన్నింటినీ ఆర్బీఐ తీసుకుంటుందన్నారు. రుణ వృద్ధి ఆశాజనకంగా ఉందన్నారు. జవాన్లకు నివాళులు జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తూ, ఆర్బీఐ బోర్డ్ సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించింది. -
ఇక్కడంతా 'గణాంకాల' పాలనే !
– ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువైంది – సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత తీవ్రం – ఎన్హెచ్ఎం సభ్యుల ముందు సమస్యల ఏకరువు అనంతపురం మెడికల్ : 'ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మెడికల్ ఆఫీసర్లు లేరు. స్టాఫ్నర్సుల కొరత ఉంది. ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు. ఇన్పేషెంట్స్, ఔట్పేషెంట్స్ పెరుగుతున్నారు. ప్రసవాలు, పుట్టిన బిడ్డకు బేబీ కిట్స్ అందజేయడం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ డేటాబేస్డ్ పాలన సాగుతోంది. గణాంకాలన్నీ 24 గంటల్లోనే పంపాల్సి వస్తోంది' అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమస్యలను ఏకరువు పెట్టారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) సభ్యులు డాక్టర్ లేఖ, డాక్టర్ ప్రభుస్వామి జిల్లాకు చేరుకుని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అధికారులతో సమావేÔ¶మయ్యారు. ముందుగా జిల్లాలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై అందరినీ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే సమస్యలన్నింటినీ ఆయా విభాగాల అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల చిట్టా ఇదే.. – జిల్లాలో 8 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే భవనాలన్నీ సరిగా లేవు. లేబర్ రూంకు ఇబ్బంది అవుతోంది. సివిల్ వర్క్స్ జరగాల్సి ఉంది. 24 గంటలు పని చేసే 42 పీహెచ్సీల్లో వాచ్మన్లు లేరు. – సబ్సెంటర్లకు సొంత భవనాలు లేవు. అద్దె కూడా తక్కువగా ఉంది. కొందరు ఏఎన్ఎంలు చేతి నుంచి డబ్బులు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. – వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 47 మెడికల్ ఆఫీసర్ల ఖాళీలున్నాయి. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినా చాలా మంది రావడం లేదు. 29 స్టాఫ్నర్సు, 29 ఫార్మసిస్టు పోస్టులు భర్తీ కావాలి. 13 ల్యాబ్ టెక్నీషియన్స్, రెండో ఏఎన్ఎం పోస్టులు 116 ఖాళీగా ఉన్నాయి. – జిల్లాలో సీమాంక్ సెంటర్లలో వైద్య పరికరాలు లేవు. – క్షయ వ్యాధి నిర్ధారణ కోసం వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ల్యాబొరేటరీలు ఉన్నా టెక్నీషియన్ల కొరత ఉంది. 36 పోస్టులు భర్తీ కావాలి. – వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టుల కొరత ఉంది. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో పరిస్థితి చేయి దాటాక సర్వజనాస్పత్రికి తెస్తున్నారు. ఇక్కడ సరిపడా వసతులు లేవు. 60 పడకలు ఉంటే మూటింతల మందికి సేవలందిస్తున్నాం. ఈ క్రమంలో ఒక్కో బెడ్లో ముగ్గురికి చికిత్స ఇవ్వాల్సి వస్తోంది. – సర్వజనాస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో ఐదు స్టాఫ్నర్సు పోస్టులు భర్తీ కావాలి. ఒక వాచ్మన్ను అదనంగా నియమించాలి. హిందూపురం జిల్లా ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎన్ఆర్సీలో కూడా ముగ్గురు స్టాఫ్నర్సులు కావాలి. – అంధత్వ నివారణ సంస్థకు మొబైల్ యూనిట్ కావాలి. ఆప్తాల్మిక్ సర్జన్స్ పోస్టులు భర్తీ చేయాలి. – క్షయవ్యాధి నివారణ కోసం 30 పడకలతో ప్రత్యేక వార్డు మంజూరు చేయాలి. -
రైతు సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం
ఏపీ అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ రాధాకృష్ణ అంబాజీపేట : రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఏపీ అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ అన్నారు. వరి, కొబ్బరి, అరటి, ఆక్వా, ఉద్యాన రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ అగ్రికల్చర్ కమిషన్ బృందం బుధవారం అంబాజీపేట వచ్చింది. మార్కెట్ యార్డులో సర్పంచ్ సుంకర సత్యవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. తొలుత రైతులు తమ ఇబ్బందులను కమిషన్కు వివరించారు. కోనసీమలో ఇప్పటికే 5, 6 సార్లు కమిషన్ సభ్యులు పర్యటించినా రైతులకు లాభం చేకూరలేదని చెప్పారు. 2011 కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు మోహన్కందా కమిషన్ పర్యటించి రైతు సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులను ఆదుకునేందుకు కొబ్బరికాయను రూ.10కు రైతు వద్దే కొనుగోలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలన్నారు. ఆక్వా రంగం కోసం 50 శాతం రాయితీతో కోల్డ్స్టోరేజీలను నిర్మించాలని చెప్పారు. ఏటా మే 15న కాలువలను మూసివేసి జూన్ 15న నీరందించాలని కోరారు. జీవన ఎరువుల తయారీ ల్యాబ్లను జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు. 2013 నుంచి నీలం, హెలెన్, హుదూద్ తుపానులకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.1300 కోట్లు నేటికీ విడుదల కాలేదన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో కమిషన్ టాస్క్ఫోర్స్ ప్రొఫెసర్ ఎస్.గలాబ్, ఏపీ అగ్రికల్చర్ సభ్యులు ప్రొఫెసర్లు డి.ఎన్.రెడ్డి, పి.పి.రెడ్డి, కె.ఎస్.రెడ్డి, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ మిశ్రా, ప్రొఫెసర్ వెంకటరెడ్డి, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె.వి.ఎస్.ప్రసాద్, ఏడీఏ జె.ఎలియాజర్, ఏఓ ఎం.విజయలక్ష్మి, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, రైతులు జున్నూరి బాబి, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, అడ్డాల గోపాలకృష్ణ, ముత్యాల జమ్మీలు తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement