‘గోఖీ’ స్టార్టప్లో రతన్ టాటా పెట్టుబడులు
న్యూఢిల్లీ: రతన్ టాటా స్టార్టప్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలు స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా, వర్చువల్ ఫిట్నెస్ కోచింగ్ ప్లాట్ఫార్మ్, గోఖీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఏ స్థాయిలో ఇన్వెస్ట్ చేశారో ఆ వివరాలు వెల్లడికాలేదు. ప్రముఖ హిందీ సినిమా నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నెనె, నీరజ్ అరోరా(వాట్సాప్)లు గోఖీని నిర్వహిస్తున్నారు. భారత వేరబుల్స్ (ఫిట్నెస్ బాండ్, తదితర ధరించే వస్తువుల) మార్కెట్లో అగ్రశ్రేణి కంపెనీల్లో గోఖీ కూడా ఒకటి.
ఈ కంపెనీ గత ఏడాది నవంబర్లో 1.34 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. రతన్ టాటా తమ సంస్థలో పెట్టుబడులు పెట్టడం..తమ సంస్థ ప్రజల జీవితాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందనడానికి నిదర్శనమని గోఖీ సీఈవో విశాల్ గోండల్ పేర్కొన్నారు. స్నాప్డీల్, కార్య, అర్బన్ లాడర్, బ్లూ స్టోన్, కార్దేఖో, సబ్సే టెక్నాలజీస్, షియోమి, ఓలా, డాగ్స్పాట్డాట్ఇన్, ట్రాక్సిన్, క్యాష్కరో, ఫస్ట్క్రై, టీబాక్స్ తదితర సంస్థల్లో రతన్ టాటా ఇన్వెస్ట్ చేశారు.