breaking news
in gollagudem
-
బక్రీద్ నమాజ్
-
సోలార్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జెన్కో సీఈ
గొల్లగూడెం (ఉంగుటూరు) : ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై నిర్మిస్తున్న 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పనులను మంగళవారం ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ కె.రత్నబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నాటికి గ్రిడ్కు అనుసంధానం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితిలో ఆ తేదీ కల్లా పనులు పూర్తి చేయాలన్నారు. ఇది మోడల్ ప్రాజెక్టు కావటంతో దీని చుట్టుపక్కల దీని పనితీరును బట్టి మరిన్ని కొత్త పథకాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్టు పురోగతిపై ఈఈ వీవీఎస్ మూర్తి చీఫ్ ఇంజినీర్కు వివరించారు. ఏడీలు కె. కోటేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
సోలార్ విద్యుత్కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన
గొల్లగూడెం(ఉంగుటూరు) : ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో నిర్మితమవుతున్న ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని గురువారం ఎపీ జెన్కో డైరెక్టర్ సి.హెచ్.నాగేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ కె.రత్నబాబు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, రాజీ పడవద్దని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం మ్యాప్ను చూపించి పనుల గురించి ఈఈ కొలగాని మూర్తి అధికారులకు వివరించారు. వారు స్పందిస్తూ.. దీనిని మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దుతామని, నిర్మాణం పూర్తయితే రాష్ట్ర గ్రిడ్కు అనుసంధానం చేస్తామని, పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దుతామని, పోలవరం, తాడిపూడి కాలువల మధ్య నిర్మించటం విశేషమన్నారు. కేంద్రం ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈలు సత్యనారాయణరెడ్డి, హరిశ్చంద్ర ప్రసాద్, ఏఈఈలు కోటేశ్వరరావు, శ్రీరామ కుమార్, ఎం.రామకృష్ణ, గంగయ్య కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంట్రాక్టర్లతో అధికారులు సమావేశమయ్యారు. ప్రాజెక్టు ఆవశ్యకత గురించి వారికి వివరించారు.