-
బెంగళూరులో పేలుడు.. ముగ్గురు దుర్మరణం
బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్రం బెంగళూరులోని పేలుడు చోటుచేసుకుంది. చామరాజపేటలోని ట్రాన్స్పోర్ట్ కంపెనీ గోడౌన్లో జరిగిన భారీ పేలుడులో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మంటలను ఆర్పడానికి ఆగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం తెలియరాలేదని డీసీపీ (దక్షిణ) హరీష్ పాండే పేర్కొన్నారు. కంపెనీ పేలుడు పదార్థాన్ని రవాణా చేసినట్లు తెలుస్తోందని అన్నారు. -
విత్తన గిడ్డంగి సిద్ధం
దీని నిల్వ సామర్థ్యం 28వేల క్వింటాళ్లు నిర్మాణ వ్యయం రూ.3.08 కోట్లు నిర్మాణం తుది దశలో విత్తన శుద్ధి కర్మాగారం ఈ రెండింటిని 17న ప్రారంభించనున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ఖమ్మం వ్యవసాయం: అధునాతన సాంకేతిక పరిఙ్ఞానంతో ఖమ్మం నగరానికి సమీపంలోగల రఘునాథపాలెం వద్ద 2.24 ఎకరాల స్థలంలో రూ.3.05 కోట్ల వ్యయంతో విత్తన గిడ్డంగిని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్మించింది. దీని నిల్వ సామర్థ్యం 28వేల క్వింటాళ్లు. ఈ స్థలంలోనే కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన విత్తన శుద్ధి కర్మాగార నిర్మాణం కూడా తుది దశకు చేరింది. పత్తి, మిర్చి, కూరగాయలు మినహా జిల్లాలో పండించే అన్ని రకాల పంట ఉత్పత్తులను విత్తనాల కోసం కొనుగోలు చేసి (విత్తన) ఇక్కడే శుద్ధి చేసి, నిల్వ ఉంచుతారు. జిల్లాకు అవసరమైన విత్తనాలను ఇప్పటివరకూ పొరుగు జిల్లాలైన వరంగల్, కరీంనగర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపై విత్తనాలను ఇక్కడి నుంచే పొందవచ్చు. విత్తన శుద్ధి కేంద్రంలో ‘పోలార్ వెస్ట్రబ్’ అనే అధునాతనమైన విత్తన శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం ఆరు టన్నులు. రైతులకు ఫౌండేషన్ సీడ్ను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ అందిస్తుంది. ఆ రైతులు పండించిన పంటను కార్పొరేషన్ పరిశీలించి, ప్రమాణాల ప్రకారం ఉన్నవాటిని కొనుగోలు చేసి విత్తనాలుగా మారుస్తుంది. వీటిని ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ధరకు తిరిగి రైతులకు అందిస్తుంది. గిడ్డంగిని, కర్మాగారాన్ని ఈ నెల 17న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ కె.కోటిలింగం ‘సాక్షి’తో చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement