breaking news
godavari khaani
-
సంపులో పడి బాలుడి మృతి
ప్రమాద వశాత్తు సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పట్టణంలోని గంగానగర్ లో ఆదివారం జరిగింది. సునీల్(5) అనే బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడ్డాడు. సంపులో బాలుడు పడి సంగతి ఎవరూ గమనించక పోవడంతో.. ఊపిరాడక బాలుడు మరణించాడు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
కరీంనగర్ : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరిచాడంటూ ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. వివరాలివీ... రామగుండం ఐదో డివిజన్లో ఉండే బూర్ల సతీష్(27), గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన మాధవి(27) ఒకే కంప్యూటర్ ఇని స్టిట్యూట్కు వెళ్లేవారు. ఆ సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని సతీష్ మాటిచ్చాడు. కానీ ఇటీవల అతడు మాధవిని పట్టించుకోవటం మానేశాడు. దీంతో ఆమె మంగళవారం ఉదయం సతీష్ ఇంటి వద్ద ధర్నాకు దిగింది. దీంతో సతీష్ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. (రామగుండం)