-
రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు..
సాక్షి, కొత్తగూడెంటౌన్ (ఖమ్మం): ప్రేమించిన అమ్మాయి దూరమైందని, అమ్మాయి తరఫువారు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెం పెనగడప గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం అంబేడ్కర్నగర్ గ్రామానికి చెందిన ఏసుపాక గణేశ్ (22) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వారి కుటుంబ సభ్యులను అడుగగా వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన గణేశ్ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ తల్లి స్వరూప ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట గణేశ్.. సదరు అమ్మాయి ప్రేమించుకున్నారని, పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు మాట ఇచ్చి తప్పారని చెప్పింది. తన కుమారుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెళ్లి చేయమని చెప్పారని, ఊరిని వదిలిపోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ బుధవారం రాత్రి పాయిజన్ తాగి పడిపోగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని, గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ గణేశ్ మృతిచెందాడని స్వరూప వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: Madhya Pradesh: డెయిరీ ముసుగులో వ్యభిచార దందా.. -
మైనర్ బాలిక కుటుంబంపై నాటు తుపాకీతో కాల్పులు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కడప నత్తంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మైనర్ బాలిక కోసం ఓ యువకుడి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లో వెళ్తే.. కడప నత్తం గ్రామంలో చాంద్ భాషా అనే యువకుడు తనతో ఫోన్ మాట్లాడాలంటూ.. ఓ మైనర్ బాలికను తరచూ వేధిస్తున్నాడు. అతనితో ఫోన్ మాట్లాడటానికి ఆ బాలిక నిరాకరించి, వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కోపం పెంచుకున్న ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో బాలిక నివాసం వద్దకు వచ్చి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. బాలిక తల్లిదండ్రులు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో.. -
రక్షణ కోరిన ప్రేమజంట
నెల్లూరు(నవాబుపేట), న్యూస్లైన్: వారిద్దరూ ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మతాలు వేరుకావడంతో ఇరు కుటుం బాలు పెళ్లికి అంగీకరించలేదు. అమ్మాయికి ఆమె కుటుంబం బలవంతంగా మరో యువకుడితో పెళ్లి చేసింది. ఆ పెళ్లి ఇష్టం లేని యువతి రెండు రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుడినే పెళ్లాడింది. పెద్దల నుంచి బెదిరింపులు రావడంతో వారిద్దరూ ఆదివారం నెల్లూరు ఐదో నగర పోలీసులను ఆశ్రయించారు. కొండాయపాళెం గేటు వనంతోపు సెంటర్కు చెందిన చెందిన షేక్ షరీఫ్ కొయ్యపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెం దిన భారతితో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మతాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. మనస్తాపానికి గురైన భారతి ఆత్మహత్యాయత్నం చేసింది. అత్రిలో చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమెకు తల్లిదండ్రులు బలవంతంగా మరో యువకుడితో గత నెల 25వ తేదీ పెళ్లి చేశారు. ఆ పెళ్లి ఇష్టం లేని భారతి 27వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదే రోజు జొన్నవాడలోని కామాక్షితాయి సన్నిధిలో షరీఫ్ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ ఆది వారం ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం అందుకున్న భారతి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని దాడికి యత్నించారు. వారి నుంచి తప్పించుకుని రక్షణ కల్పించాలని కోరుతూ ఐదో నగర పోలీసులను ఆశ్రయించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మంగళగిరిలో ఓటేసేందుకు వెళ్లిన పవన్ ఓవరాక్షన్
పాముల పుష్ప శ్రీవాణి ఓటు వేశారు
బీహార్ లోక్సభ ఎలక్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు
ఓటు హక్కు వినియోగించుకున్న పేర్ని నాని కుటుంబ సభ్యులు
పల్నాడులో బరితెగించిన టీడీపీ నేతలు..
పోలింగ్ టైం : : ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖలు
ఓటు వేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భారీ సంఖ్యలో తరలివస్తున్న ఓటర్లు
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
తప్పక చదవండి
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement