Gas Fields
-
‘సౌత్ పార్స్’ : ప్రపంచం మొత్తానికి పదేళ్లపాటు, షాకింగ్ నిజాలు
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఇరాన్లోని సౌత్ పార్స్ (South Pars) గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. ప్రపంచ ఇంధన సరఫరా , ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత రాజేస్తోంది. అసలు సౌత్ పార్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత కీలకం? తెలుసుకుందాం.ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. "నియంత్రించలేని పరిణామాలు" ఉంటాయని హెచ్చరించిన ఇరాన్ అన్నంత పనీ చేస్తోంది.ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపంఅరేబియా గల్ఫ్ సముద్ర తీరంలో ఉన్న ఈ గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిక్షేపాల్లో ఒకటి. దీనిని ఇరాన్, ఖతార్ దేశాలు పంచు కుంటున్నాయి. అయితే ఇరాన్లో ఉన్న భాగాన్ని 'సౌత్ పార్స్' అని పిలుస్తారు. అలాగే ఖతార్ భాగాన్ని 'నార్త్ ఫీల్డ్' అని పిలుస్తారు.ఈ రెండింటి సామర్థ్యం సుమారు 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్. ఇది ప్రపంచం మొత్తానికి పదేళ్ల పాటు సరిపోయేంత భారీ నిక్షేపం. సౌత్ పార్స్ కేవలం ఇంధన వనరు మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముక వంటిది. అందుకే ఇరాన్కు అంత ముఖ్యం. అంతేకాదు ఇరాన్ ఉపయోగిస్తున్న మొత్తం సహజ వాయువులో సుమారు 80శాతం ఈ ఒక్క ఫీల్డ్ నుంచే వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, గృహాలు, పరిశ్రమల నిర్వహణకు ఇదే ప్రధాన ఆధారం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదైనప్పటికీ, ప్రపంచంలో అత్యధికంగా గ్యాస్ వినియోగించే దేశాల్లో ఇరాన్ ఒకటి.ఇదీ చదవండి: నో జీన్స్, నో టీషర్ట్స్, నో పార్టీవేర్ : ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ప్రభావం ఎంత?ఈ గ్యాస్ ఫీల్డ్కు ఏదైనా అంతరాయం కలిగితే, ఇరాన్ అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడటమే కాదు, దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా ఇరాన్ ఇప్పటికే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ దాడి అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కూడా దారితీస్తోంది. ఇంతపెద్ద గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, సరఫరా గొలుసుకు అంతరాయం తప్పదనే ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం, గ్యాస్ కంటే చమురు ధరలు వేగంగా పెరుగుతుండటం గమనార్హం. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కూడా కుదిపేస్తున్నాయి.ఇదీ చదవండి: 8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు -
సఖాలిన్–1 క్షేత్రాల్లో ఓవీఎల్కు 20 శాతం వాటాలు
న్యూఢిల్లీ: రష్యాలోని సఖాలిన్–1 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో తిరిగి 20 శాతం వాటాలను తీసుకున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఆపరేటర్ అయిన అమెరికన్ సంస్థ ఎక్సాన్మొబిల్ అనుబంధ కంపెనీ ఎక్సాన్ నెఫ్ట్గాజ్ను పక్కకు తప్పించి, దానికి సంబంధించిన అసెట్స్ అన్నింటిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతేడాది కొత్త ఆపరేటర్కు బదలాయించారు. గతంలో తమకున్న వాటాలను తిరిగి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ అప్పట్లో షేర్హోల్డర్లయిన జపాన్ సంస్థ సోడెకో కన్సార్షియం, ఓవీఎల్కు రష్యా ప్రభుత్వం సూచించింది. దానికి అనుగుణంగానే ఓవీఎల్ దరఖాస్తు చేసుకోగా, తదనుగుణంగా గతంలో దానికి ఉన్నంత వాటాలను కేటాయించింది. సోడెకో కూడా తన వాటాను అట్టే పెట్టుకుంది. అయితే, ఎక్సాన్మొబిల్ విషయంలో స్పష్టత రాలేదు. గతంలో సఖాలిన్1లో ఎక్సాన్ నెఫ్ట్గ్యాస్, సోడెకో సంస్థలకు చెరి 30 శాతం, రాస్నెఫ్ట్కు 20 శాతం వాటాలు ఉండేవి. 2001లో ఓవీఎల్ ఇందులో 20 శాతం వాటాలు తీసుకుంది. గతేడాది అక్టోబర్లో ఈ ప్రాజెక్టును సఖాలిన్–1 లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి రష్యా బదలాయించింది. ఈ కొత్త కంపెనీలో ఓవీఎల్, రాస్నెఫ్ట్కు చెరి 20 శాతం, సోడెకోకు 30 శాతం వాటాలు ఉండగా.. ఎక్సాన్మొబిల్ వాటా విషయంలో ఇంకా ఏమీ తేలలేదు. ఉక్రెయిన్ మీద దాడికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్లో సఖాలిన్–1 నుంచి ఉత్పత్తిని ఎక్సాన్ నెఫ్ట్గాజ్ నిలిపివేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు సఖాలిన్–1లో రోజుకు 2,20,000 బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తయ్యేది. నవంబర్ నుంచి మళ్లీ 1,40,000–1,50,000 బీపీడీ మేర ఉత్పత్తి మొదలుపెట్టారు. -
విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలు భారీగా కొనాలి: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు సగానికి తగ్గిపోయిన నేపథ్యంలో.. విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలను భారత్ భారీగా కొనుగోలు చేయాలని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అలాగే, దేశీయంగానూ ఇంధన అన్వేషణ కార్యకలాపాలు పెంచాలని, వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చినట్లు ప్రధాన్ తెలిపారు. చమురు రేట్లు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, కర్ణాటకలోని మంగళూరు, పాడూరులలోని వ్యూహాత్మక కేంద్రాల్లో నిల్వలు పెంచుకోవాలని వ్యాపారవేత్తలు సూచించినట్లు ఆయన చెప్పారు.


