breaking news
Gartner Research Director Sid Nag
-
గార్ట్నర్ నివేదికలో తాన్లా ప్లాట్ఫామ్స్
హైదరాబాద్: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్ఫాం యాజ్ ఎ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్ఫామ్స్ తాజాగా ప్రతిష్టాత్మక గార్ట్నర్ నివేదికలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయంగా సీపాస్ మార్కెట్ తీరుతెన్నులపై రూపొందించిన ’కాంపిటీటివ్ ల్యాండ్స్కేప్ ఫర్ కమ్యూనికేషన్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ 2021’ నివేదికలో తాన్లా గురించి, కంపెనీకి చెందిన వైజ్లీ సొల్యూషన్ ప్రత్యేకతల గురించి గార్ట్నర్ ప్రముఖంగా ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఎనిమిది దిగ్గజ సీపాస్ కంపెనీలు, వాటి పరిమాణం, అవి ఆఫర్ చేసే సర్వీసులు, మార్కెట్ వైవిధ్యం, ట్రెండ్లు మొదలైన వాటి అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్ట్ను రూపొందించింది. తమ సొల్యూషన్స్ విశ్వసనీయత, భద్రతకు గార్ట్నర్ నివేదిక తాజా నిదర్శనం అని తాన్లా ప్లాట్ఫామ్స్ చైర్మన్ ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను మరింతగా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. -
730 మిలియన్ డాలర్లకు భారత క్లౌడ్ సర్వీసులు
న్యూఢిల్లీ: దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల రంగ ఆదాయాలు ఈ ఏడాది ఆఖరు నాటికి 730 మిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 31 శాతం వృద్ధి సాధించగలదని పేర్కొంది. భారత్లో క్లౌడ్ సేవలపై భారీగా వ్యయాలు పెరుగుతాయని, 2019 నాటికి ఇవి 19 బిలియన్ డాలర్లకు చేరొచ్చని గార్ట్నర్ వివరించింది. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్), క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్ఏఏఎస్) మొదలైన విభాగాలు గణనీయమైన వృద్ధి కనపర్చగలవని గార్ట్నర్ తెలిపింది. 2015లో ఐఏఏఎస్పై వ్యయాలు 100 మిలియన్ డాలర్లకు (25% వృద్ధి), క్లౌడ్ మేనేజ్మెంట్/సెక్యూరిటీపై 82 మిలియన్ డాలర్లకు (36.6%), ఎస్ఏఏఎస్పై 302 మిలియన్ డాలర్ల స్థాయికి (33.4% వృద్ధి) పెరగగలవని పేర్కొంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు, స్థానిక మార్కెట్లలో డిమాండ్, సరఫరా పరిస్థితులు మొదలైన వాటిపై క్లౌడ్ సర్వీసుల అంచనాలు ఆధారపడి ఉంటాయని గార్ట్నర్ రీసెర్చ్ డెరైక్టర్ సిడ్ నాగ్ తెలిపారు. భారత కంపెనీలు సొంతంగా ఇన్ఫ్రాను ఏర్పాటు చేసుకోవడం కంటే ఐఏఏఎస్, ఎస్ఏఏఎస్ వంటి వాటివైపు మొగ్గు చూపుతున్నాయనడానికి తాజా పరిణామాలు నిదర్శనమని వివరించారు.