breaking news
gandepally
-
అడవి దున్న హల్చల్
సాక్షి, గండేపల్లి: మండలంలోని సింగరంపాలెం పరిధి పొలాల్లో మగ అడవి దున్న హల్చల్ చేస్తోంది. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామాయిల్ తోటలో దున్న సంచారాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఫారెస్ట్ అధికారి నూకాసాహెబ్కు సమాచారం అందజేశారు. దున్న నోటికి గాయమై ఏమీ తినలేక నీరసించి ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. దున్నను బంధించి బోను సహాయంతో విశాఖ జూకు లేదా మారేడుమిల్లికి గానీ తరలిస్తామని ఆ అధికారి చెప్పారు. విశాఖ నుంచి మత్తుమందు ఇచ్చే వైద్యులు రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో కె.గోపాలపురం అడవికి సమీపంలో ఒక దున్న మృత్యువాతకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి దున్నను సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
గండేపల్లి బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యూజేపురంలో గండేపల్లి ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున, గాయపడిన వారికి రూ.5 వేల చొప్పున వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ వారికి చెక్కులు అందజేశారు. జ్యోతులనెహ్రూతో పాటు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గండేపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం