-
వేసవి సన్నాహాలు
సాక్షి సిటీబ్యూరో: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో వేసవి నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మామిడి సీజన్ ప్రారంభం కానున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్నాహాలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యను అదిగమించేందుకు చర్యలు తీసుకున్నారు. మార్కెట్ యార్డుకు వేసవిలో మామిడితో పాటు వివిధ రకాల పండ్ల లారీలు ప్రతిరోజూ వందల సంఖ్యలో తరలివస్తాయి. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.ఇప్పటికే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 15 మంది సెక్యూరిటీ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిన నియమించారు. మార్కెట్కు వచ్చే రైతుల దాహార్తిని తీర్చేందుకు మార్కెట్ ప్రాంగణంలో నాలుగు చలివేంద్రాల ఏర్పాటు చేశారు. మార్కెట్ ముందు మెట్రో స్టేషన్ ఏర్పాటుతో ఇరుకుగా మారినా సర్వీస్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు రోడ్డుతో పాటు మార్కెట్ ప్రహరీ మధ్య ఉన్న రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులకు ప్రతిపాదనలు పంపించారు.. క్రాసింగ్ లైన్లు... గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ యార్డులో ప్రస్తుతం వాహనాల పార్కింగ్తో పాటు వాహనాల పార్కింగ్కు ఒక పద్దతి లేదు. దీంతో కమిషన్ ఏజెంట్లు తమ షేడ్లలో ఇతరులు తమకు కేటాయించిన స్థలాల వద్ద, వ్యాపారులు రోడ్డు పైనే వాహనాలను నిలిపివేస్తుండటంతో మార్కెట్ యార్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. దీనిని నియంత్రించేందుకు , వాహనాల రాకపోకలు సులువుగా సాగేందుకు రోడ్డుకు ఇరు వైపుల పసుపు రంగుతో మార్కింగ్ లైన్లు వేయించారు. వ్యాపారులు, వినియోగదారులు వాహనాలను గీత లోపలే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. స్తంభాల తొలగింపు... మెట్రో స్టేషన్ నిర్మాణంతో మార్కెట్ యార్డుకు అనుకొని ఉన్న సర్వీస్ రోడ్డు Ðð వెడల్పు తగ్గిపోవడంతో భారీ వాహనాలు మార్కెట్లో రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పాటు రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలతో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ఎస్జీఎస్, విద్యుత్ శాఖ ఉన్నతా అధికారులు సర్వీస్ రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో పాటు మార్కెట్ ప్రధాన ద్వారాన్ని ఇరు వైపులు విస్తరించాలని నిర్ణయించారు. సీజన్లోగా ఏర్పాట్లు పూర్తి మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మార్కెట్కు వచ్చే రైతులతో పాటు వ్యాపారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మామిడి సీజన్లోగా ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే మార్కెట్ యార్డులో ట్రాఫిక్ సమస్య నియంతణ్రకు చర్యలు తీసుకున్నాం. దీంతో వాహనాలు క్రమబద్దీకరణతో పార్కింగ్ చేసేందుకు ఏర్పాటు జరుతున్నాయి. వ్యాపారులు, వినియోగదారులు రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్ ఎదుట సర్వీస్ రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించినందున భారీ వాహనా రాకపోకలు సాఫీగా జరుగుతున్నాయి. – గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేశం -
కనుసైగతోనే ఖరీదు!
♦ పండ్ల మార్కెట్లో పక్కా దోపిడీ ♦ వేలంపాటలో రైతన్నకు దగా ♦ కమీషన్ ఏజెంట్లతో అధికారుల కుమ్మక్కు సాక్షి, సిటీబ్యూరో : ‘అక్కడ కను సైగతోనే క్షణాల్లో ధర ఖరారవుతోంది. అదే సిసలైన ధరగా భావించాలి. కాదు కూడదంటే... కన్నెర్ర చేస్తారు. అభ్యంతరపెడితే అంతే సంగతులు. ఇక ఆ సరుకును కొనకుండా వదిలేస్తారు. వీరి కట్టుబాటు ముందు... గిట్టుబాటు ధర గాల్లో కలుస్తోంది. రైతుల ఆరుగాలం కష్టాన్ని కళ్లెదుటే దోచేస్తున్నా కట్టడి చేసేవారేలేరు. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తేలుతుండటంతో కర్షకుల కన్నీళ్లే మిగులుతున్నాయి.’ ఇదీ ... గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో రాజ్యమేలుతోన్న అక్రమాల తీరు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రబిందువుగా ఉన్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో బత్తాయిల వేలం తీరును ‘సాక్షి’ ప్రత్యక్షంగా పరిశీలించింది. ఈ సందర్భంగా వ్యాపారులు, కమీషన్దారులు రైతును దగా చేస్తున్న వైనం బట్టబయలైంది. బత్తాయి సీజన్ ఊపందుకోవడంతో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు ఇబ్బడి ముబ్బడిగా సరుకు వస్తోంది. ప్రధానంగా అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన రైతులు ఈ మార్కెట్కు పెద్దమొత్తంలో బత్తాయిలను తీసుకొస్తున్నారు. లారీ లోడ్ను తూకం వేశాక బత్తాయిలను ఇక్కడి ఫ్లాట్ ఫారంలపై లాట్లుగా పోసి కమీషన్దారులు వేలం నిర్వహిస్తున్నారు. అయితే... ఈ వేలం ప్రక్రియ మార్కెటింగ్ శాఖ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో పారదర్శకంగా జరగాలి. కానీ ఆ దరిదాపుల్లో సిబ్బంది ఎవరూ కన్పించరు. కమీషన్దారులే అన్నీ తామై కార్యాన్ని నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఒకరిద్దరు ఫ్లాట్ఫారాలపై తచ్చాడుతున్నా.... కమీషనర్ వ్యాపారులు నిర్ణయించిన ధరనే గిట్టుబాటు ధరగా నమోదు చేస్తున్నారు. ధర విషయంలో రైతు నోట్లో నుంచి మాట రాకుండానే క్షణాల్లో వేలం ప్రక్రియ ముగిసిపోతోంది. పర్చేజింగ్ లెసైన్స్ లేని వ్యాపారులు వందల మంది ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కళ్లెదుటే దోపిడీ: గడ్డిఅన్నారం మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్గా మారి ధర పెంచకుండా కమీషన్దారులతో ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకొంటారు. వేలం తరుణంలో కమీషన్ వ్యాపారులు, కొనుగోలుదారులంతా రెండు గ్రూపులుగా విడిపోయి వేలం పాటలో పోటీపడుతున్నట్లు భ్రమింపజేస్తారు. వీరంతా బత్తాయి కుప్పల వద్దకు గుంపుగా వచ్చి వేలం పాట ప్రారంభిస్తారు. హిందీలో మాట్లాడుతూ టన్ను వెయ్యి రూపాయలు, 2వేలు, 5వేలు, 10వేలు ఇలా రేటు పెంచుతుంటారు. ఈ తరుణంలో ఖరీదుదారు కనుసైగ చేయగానే కమీషన్దారు ఏక్ బార్..., దో బార్... తీన్ బార్.. అంటూ పాటను నిలిపేస్తారు. ఇక అదే అసలైన ధరగా నిర్ణయమైపోతోంది. వేలం తరుణంలో కమీషన్దారులు కోడ్ భాషతో ఎదుటివారికి అర్థంకాని విధంగా వేలం పాట నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ‘చలో... టీకే... అంటూ ఓ వ్యక్తి పాట మొదలు పెడతాడు. అంటే... ‘సరుకు నాణ్యమైంది... దీనికి ధర పెంచండి’ అని అర్థం. అలాగే చలో.... ‘గాడీ పే... దో, తీన్’ అంటూ మరోవ్యక్తి గట్టిగా కేకవేస్తూ పాట మొదలెడతాడు. అంటే... లాట్ మొత్తంలో 2, 3 క్వింటాళ్లు తరుగు కింద పోతుందని అర్థం. అంటే.. క్వింటాల్కు రూ.4వేలు ధర ఉంటే 3 క్వింటాళ్లకు రూ.12వేలు ఆదా అవుతుందని కోడ్ భాషలో సంకేతమిస్తాడు. మరో లాట్ వద్దకు రాగానే కోడ్ను మారుస్తూ ‘మాల్ అచ్చా హై..., పచ్కడ్ కుచ్ నహీ..’అంటూ కమీషన్దారు గట్టిగా అరుస్తాడు. అంటే ఆ వాఖ్యలకు వ్యతిరేక అర్థంలో ఈ సరుకు బాగోలేదు... ధర తగ్గించమని సంకేతమిస్తాడు. ఇలా ఒక్కో లాట్ వద్ద ఈ ఒక్కో విధంగా కోడ్ భాషను వాడుతున్నారు. ఇందులో మరో విధానంలో కూడా దగాకు పాల్పడుతున్నారు. కొనుగోలుదారు బత్తాయి లాట్ నుంచి 4 కాయలను తీసి చేతిలో పట్టుకొంటే రూ.4వేలు తగ్గించమని, అదే 3 బత్తాయిలు చేతిలో పట్టుకొంటే రూ.3వేలు తగ్గించమని కమీషన్దారుకు సంకేతమిస్తున్నారు. ఇలా ఎవరూ గుర్తుపట్టని విధంగా వేలం పాటలో రకరకాల విన్యాసాలతో రైతును నిలువునా దోచేస్తున్నారు. వేలం సమయంలో హిందీలో మాట్లాడుతూ ధర నిర్ణయిస్తుండటంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఆ భాష అర్థంగాక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఆ తర్వాత అసలు ధర తెలుసుకొని తమకు గిట్టుబాటు కాలేదని, సరుకు అమ్మనని రైతు అభ్యంతరం పెడితే... ఇక ఆ సరుకును ఎవరూ కొనకుండా వదిలేస్తున్నారు. అక్రమాల తీరిది..: వేలం పాట ముగియగానే...సరుకు అమ్మిన రైతు, కొన్న వ్యాపారి పేర్లు, వసూలు చేసిన కమిషన్, మార్కెట్ ఫీజు తదితరాలతో ‘తక్పట్టీ’(అమ్మకపు రసీదు)ని కమీషన్దారు అప్పటికప్పుడే తయారుచేసివ్వాలి. అయితే.. రసీదు స్థానే రైతులకు తెల్లటి చీటీ ఇస్తున్నారు. ♦ సరుకు అమ్మించినందుకు రైతుల నుంచి వసూలు చేయాల్సింది 4 శాతం కమీషన్. కానీ ఇక్కడ కమీషన్దారులు 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ♦ సరుకు ఎంత నాణ్యంగా ఉన్నా... చూట్ (తరుగు) కింద ఒక టన్నుకు క్వింటాల్ చొప్పున తీసేస్తున్నారు. అలాగే సరుకు పచ్చిగా ఉందనే నెపంతో ‘పచ్కడ్’ కింద మరో 5 శాతం కోత విధిస్తున్నారు. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సిన 1 శాతం మార్కెట్ ఫీజు కూడా రైతుల నుంచే పిండుకొంటున్నారు. ♦ మార్కెట్కు వచ్చిన సరుకును తక్కువగా చూపడంతో పాటు దాని విలువను థర్డ్ గ్రేడ్గా చూపి మార్కెట్ ఫీజును కుదిస్తున్నారు. ఫలితంగా మార్కెటింగ్ శాఖకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. ప్రస్తుతం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు ఏటా రూ.8 కోట్ల ఆదాయం వస్తున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే ఏటా రూ.16 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నది పచ్చినిజం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement