breaking news
Four prisoners
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్..
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్
-
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్
కడప: కడప కేంద్ర కారాగారం నుంచి ఖైదీల పరారీ ఘటనపై ఏపీ హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో వైపు పరారైన ఖైదీల కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది. కాగా నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు సోమవారం సాయంత్రం అధికారుల కళ్లుగప్పి తప్పించుకు పోయారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పైకి ఎక్కారు. గోడపై ఉన్న విద్యుత్ తీగలపై గోనె సంచి పట్టలు వేసుకుని అవతలి వైపు దూకి పరారయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రవి, దేవ, అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్ర, కర్నూలు జిల్లాకు హనుమంతు అనే జీవిత ఖైదీలు పరారైనట్టు గుర్తించారు. -
సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు సోమవారం సాయంత్రం పరారయ్యారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. రవి, రామచంద్ర, దేవ, హనుమంతు అనే జీవిత ఖైదీలు పారిపోయినట్లు తెలిసింది. -
సంగారెడ్డిలో ఖైదీల పరారీ!