breaking news
Football Association
-
ఫిఫా వరల్డ్కప్.. అర్జెంటీనాకు భారీ షాక్!
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫైనల్కు దూసుకువెళ్లింది. అట్లాంటా వేదికగా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇక సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.చిరకాల ప్రత్యర్థులుఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది. కాగా క్రికెట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ల మాదిరే ఫుట్బాల్లో అర్జెంటీనా- ఇంగ్లండ్ మ్యాచ్లకూ అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఇందుకు ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ వివాదాలు.. తదనుగుణంగా చెలరేగే భావోద్వేగాలు కారణం అని చెప్పవచ్చు.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.24 ఏళ్ల తర్వాత తొలిసారిఅయితే, ఫాక్లాండ్ దీవుల విషయంలో ఇప్పటికీ ఇరుదేశాల మధ్య ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా- ఇంగ్లండ్ తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్లో తలపడే అవకాశం వచ్చింది.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీస్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గట్లు రాణించింది. అర్జెంటీనా తరఫున 85వ నిమిషంలో ఎన్జో ఫెర్నాండెజ్, అదనపు సమయం (90+2వ నిమిషం)లో మార్టినేజ్ చెరో గోల్ గొట్టారు.ఇక వీరిద్దరు గోల్స్ సాధించడంలో కెప్టెన్ మెస్సీ సహకారం అందించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ తరఫున ఆంటోనీ గార్డన్ 55వ నిమిషంలోనే గోల్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.షాక్ తప్పదా?ఈ నేపథ్యంలో ఓవైపు టైటిల్ సమరానికి మరోసారి అర్హత సాధించడం.. మరోవైపు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ను ఓడించిన సంబరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫాక్లాండ్ దీవులు తమవే అన్నట్లుగా బ్యానర్ ప్రదర్శించారు.Argentina Team with The Falkland Islands Banner 😂😂😂! pic.twitter.com/NlSUZXXlsS— The Final Whistle (@Rufus_45) July 16, 2026అయితే, అర్జెంటీనా ఆటగాళ్లపై అంతర్జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ.. ముందుగా బ్యానర్ ప్రదర్శించిన ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.నిబంధనలు ఏం చెబుతున్నాయి?IFAB నిబంధనల ప్రకారం.. మైదానంలో పరికరాల ద్వారానైనా సరే ఆటగాళ్లు రాజకీయ, మతపరమైన విషయాలకు సంబంధించి.. అదే విధంగా వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం, ఫొటోలు ప్రదర్శించడం నిషిద్ధం.ఆటగాళ్ల లోదుస్తులపై సైతం కేవలం తయారీ లోగో మాత్రమే ఉండాలి. అది కాకుండా తమ రాజకీయ, మతపరమైన, వ్యక్తిగతమైన అభిప్రాయాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఆటగాళ్లు ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే సదరు ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి టోర్నీ నిర్వాహకులు జరిమానా విధిస్తారు. జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ లేదంటే ఫిఫా ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ మద్దతుఅర్జెంటీనా ఉపాధ్యక్షురాలు విక్టోరియా విలారుయెల్ మాత్రం తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ‘‘ఫాక్లాండ్స్ ఎప్పటికీ అర్జెంటీనావే! వాళ్లు స్టేడియంలోకి బ్యానర్ తీసుకురాకుండా నిషేధం విధించారు. కానీ ఈ భావం మా నరనరాల్లో, హృదయాల్లో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ రికార్డు బద్దలు¡Las Malvinas son Argentinas! 🇦🇷 Prohibieron llevarlas a la cancha y se olvidaron que las llevamos en la sangre y el corazón. pic.twitter.com/qB455HeqVX— Victoria Villarruel (@VickyVillarruel) July 15, 2026 -
ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం: టాలీవుడ్ హీరో ఆగ్రహం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన నెట్టింట వైరల్గా మారింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్ మ్యాచ్లో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాలని సిద్దార్థ్ విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇండియన్ ఫుట్బాల్ కౌన్సిల్ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ తన ట్విట్లో రాస్తూ..'ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫుట్బాల్ మ్యాచ్ని ఇప్పుడే చూశా. మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా. క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ హీరోకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ-3 కూడా ఉంటుందని నిఖిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw — Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024 -
ఫుట్బాల్కూ ప్రాధాన్యత
యలమంచిలి(అనకాపల్లి రూరల్) : క్రికెట్తో పాటు రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఆదివారం యలమంచిలి–విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తించి, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్బాల్కు మన దేశంలో ఆదరణ తక్కువగా ఉందని, దీనిని పెంచడానికి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు. భవిష్యత్లో రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారుచేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో యలమంచిలి, విశాఖ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న శ్రీధర్ రెండు జట్ల మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ రాజే‹Ù, కోనసీమ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలాద్రి, ఎన్ఐఎస్ చీఫ్ కోచ్ ఎం.శేషుమోహన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ ఎస్జీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భారత పుట్బాల్ అండర్–16 జట్టుకు సౌమ్య
నిజామాబాద్ స్పోర్ట్స్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగ్లోత్ సౌమ్య భారతపుట్బాల్ అండర్–16 జట్టుకు ఎంపికయ్యింది. ఈ మేరకు పుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గునా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన భారత జట్టుకు ఇందూర్ జిల్లాకు చెందిన సౌమ్యనే ఎంపికైంది. గత సంవత్సరం కూడా అండర్–14 విభాగంలో సౌమ్య భారత జట్టుకు ఎంపికై నేపాల్లో జరిగిన టోర్నిలో తన ప్రతిభతో గోల్స్ సాధించింది. నేపాల్లో భూకంపం రావడం వల్ల పలు మ్యాచ్లు రద్దయ్యాయి. ఈ సంవత్సరం కూడా భారతజట్టుకు ఎంపిక కావడంపై జిల్లా పుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28నుంచి సెప్టెంబర్ 5వరకు చైనాలో జరిగే ఏఎఫ్సీ పుట్బాల్ కప్లో పాల్గొననుంది. ఇప్పటికే స్కూల్గేమ్స్ ఫెడరేషన్ విభాగంలో నాలుగు సార్లు జాతీయస్థాయిలో, పుట్బాల్ అసోసియేషన్ తరపున ఐదుసార్లు జాతీయస్థాయిలో పుట్బాల్టోర్నిలో పాల్గొని సత్తా చాటింది. జిల్లా కేంద్రంలోని రాఘవస్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. కోచ్ నాగరాజు పుట్బాల్ శిక్షణలో జిల్లా నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. -
అవినీతి కేసులో ఆరుగురు ఫిఫా అధికారుల అరెస్ట్
జురిచ్: ప్రపంచ ఫుట్బాల్ రంగంలో అత్యంత శక్తిమంతమైన, వేలాది కోట్ల రూపాయల ఆదాయంతో సుసంపన్నమైన ఫిఫాకు షాక్. అవినీతి ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య సంఘం (ఫిఫా) అత్యున్నత స్థాయి అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. స్విట్జర్లాండ్ అధికారులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకుని అమెరికాకు అప్పగించారు. ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జురిచ్లో ఉంది. జురిచ్లో జరిగిన ఫిఫా వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కార్యవర్గ సభ్యలు వచ్చారు. అమెరికా న్యాయశాఖ విన్నపం మేరకు స్విస్ అధికారులు అకస్మాత్తుగా ఫిఫా అధికారులు బస చేసిన హోటల్పై దాడి చేసి అరెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఫిఫాలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ ఫుట్కప్ల నిర్వహణకు బిడ్లు, మార్కెటింగ్, ప్రసార హక్కుల ఒప్పందాలకు సంబంధించి ఫిఫా అధికారులు అవినీతికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చాయి. అమెరికా విన్నపం మేరకు స్విస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ కేసుపై దృష్టిసారించారు. కాగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అభియోగాలు నమోదు చేయకున్నా అధికారులు ఆయనను విచారించనున్నారు.


