breaking news
flight AI 144
-
విమాన ప్రయాణం హామీని నెరవేర్చిన హ్యాట్రిక్ సర్పంచ్
జోగులాంబ గద్వాల జిల్లా: ముచ్చట గా మూడోసారి సర్పంచ్గా గెలిచిన వ్యక్తి గ్రామంలోని 200 మందిని విమానంలో తిరుపతి తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నా యి.. వికారాబాద్ జిల్లా రాకంచర్ల గ్రామ సర్పంచ్ కమ్లీబాయి, పెంటయ్య దంపతులు తాము ఎన్నికల్లో గెలిస్తే విమానంలో తిరుపతి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సోమవారం సర్పంచ్ భర్త పెంటయ్య పుట్టినరోజు కావడంతో నాలుగు బస్సుల్లో హైదరాబాద్ బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతి చేరుకోనున్నార -
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
నెవార్క్(అమెరికా): ఎయిర్ ఇండియా విమానానికి అమెరికాలో ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో విమానం ఎడమ ఇంజిన్ పాడైంది. దీంతో విమానాన్ని వెనక్కు తీసుకొచ్చి సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 313 మంది ప్రయాణికులతో న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతం(స్థానిక సమయం) బయలుదేరిన ముంబై విమానం ఏఐ-114ను పక్షి ఢీకొట్టడంతో ఎడమ ఇంజిన్ పాడైందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. దీంతో అరగంట తర్వాత విమానాన్ని వెనక్కు తీసుకొచ్చినట్టు చెప్పారు. విమానంలోని వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇంజిన్ లో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారని వెల్లడించారు. ప్రయాణికులను పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.


