breaking news
Flesh
-
గాంధీ వర్ధంతి: మాంసం కోసం కొట్టుకున్న యువకులు
సాక్షి, రాయచూరు (కర్ణాటక): మాంసం కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. దీంతో ఇద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. చదవండిః సిద్ధు భస్మాసురుడు వంటి వాడు -
తక్కువ తింటే ఎక్కువ లాభం..
కొత్త పరిశోధన ‘తిండి కలిగితె కండ గలదోయ్’ అన్న కవి వాక్కు నిజమే. కండపుష్టి కోసం కావలసినంత తింటే చాలు.. కాస్త తక్కువగా తింటే మరింత మేలు అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం లేదా ఒంటిపూట భోజనం చేయడం వంటి పద్ధతులేవైనా కావచ్చు, నెలకు కనీసం ఐదురోజులు శరీరానికి రోజువారీ అవసరమైన కేలరీల్లో సగానికి సగం తగ్గించి తీసుకున్నట్లయితే, చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఈ పద్ధతి వల్ల కేన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గడమే కాకుండా, ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉంటాయని సౌత్ కరోలినా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. నెలకు కనీసం ఐదు రోజులు ఆహారంలోని కేలరీల్లో 34-54 శాతం మేరకు కోత విధించుకోగలిగితే చాలని అంటున్నారు. ఇదే పద్ధతిలో తాము ఎలుకలపై జరిపిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రయోగానికి వారు ఎంచుకున్న ఎలుకల ఆహారంలో నాలుగు రోజుల చొప్పున నెలకు రెండుసార్లు కోత విధించగా, అవి మిగిలిన ఎలుకల కంటే ఎక్కువ కాలం బతికాయి.