breaking news
Five candidates
-
ఐదుగురిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి,నిజామాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎ ట్టకేలకు విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 65 స్థానా లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్పార్టీ జిల్లాలో 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిం ది. మరో నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టింది. బోధన్ స్థానానికి అందరూ ఊహించిన ట్లుగానే మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి, కా మారెడ్డి స్థానం నుంచి షబ్బీర్ అలీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఆర్మూర్ స్థానాన్ని ఆకుల లలితకు కేటాయించారు. జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారాం పోటీ చేయనున్నారు. బా న్సువాడ స్థానం అభ్యర్థిత్వం కాసుల బాల్రాజుకు దక్కింది. జిల్లాలో మొత్తం 9 స్థానాలకు గాను 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం నాలుగు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. మహా కూటమిలో భాగంగా తెలుగు దేశం పార్టీ ఆశిస్తున్న నిజామా బాద్ రూరల్, బా ల్కొండ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ప్రకటిం చలేదు. అలాగే నిజామాబాద్ అర్బన్ స్థానానికి కూడా అభ్యర్థులెవరో తేల్చలేదు. ఎల్లారెడ్డి స్థానా న్ని తెలంగాణ జనస మితి ఆశిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ స్థానం కూడా మొదటి విడ తలో అభ్యర్థిని ఖరారు చేయలేదు.బాన్సువాడ నుంచి కాసుల బాల్ రాజుతో పాటు మల్యాద్రి రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించారు. జుక్కల్ టికెట్ను సౌదాగర్ గంగారాంతో పాటు అరుణతా ర కూడా ఆశించారు. మల్యాద్రి రెడ్డి, అరుణతార లకు నిరాశే ఎదురైంది. బాన్సువాడలో ఇప్పటికే అసమ్మతి రాగాన్ని ఆలపించిన మల్యాద్రి రెడ్డి రెం డు రోజుల క్రితమే తన ముఖ్య అనుచరులతో స మావేశమైన విష యం విధితమే. నిజామాబాద్ రూరల్, బాల్కొండ స్థానాలపై మహా కూటమి పొ త్తులో భాగంగా టీడీపీ కన్నేసింది. ఈ రెడింటిలో ఏదో ఒకటి ఆ పార్టీకి కేటాయించే అవకాశాలున్న ట్లు ప్రచారం జరుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవ ర్గానికి సంబంధించి నల్లమడుగు సురేందర్తో పాటు సుభాష్ రెడ్డి ఆశిస్తున్నారు. -
‘పెద్ద’లెవరో?
మరికొన్ని గంటల్లో ‘పెద్ద’లెవరో తేలిపోనుంది. శాసనమండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం నేడు బయటపడనుంది. బుధవారం రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలోని కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 769 మంది ఓట్లు వేశారు. వీటిని ప్రాధాన్యక్రమంలో లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. నేడు తేలనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం * రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో కౌంటింగ్ * ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు * బరిలో నిలిచింది ఐదుగురు.. గెలిచేది ఇద్దరే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో విజేతలుగా నిలిచే ఇద్దరు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ తరుఫున పట్నం నరేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, టీడీపీ తరుఫున బుక్కా వేణుగోపాల్, స్వతంత్ర అభ్యర్థిగా కొత్త అశోక్గౌడ్ పోటీపడ్డారు. రెండు సీట్లనూ కైవసం చేసుకోవాలని అధికారపార్టీ, ఒక సీటయినా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని జతకట్టిన కాంగ్రెస్, టీడీపీలు ప్రయత్నించాయి. ఇక స్థానిక సంస్థల ప్రతినిధుల ఆత్మగౌరవ నినాదంతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి కూడా గెలుపుకోసం సర్వశక్తులొడ్డారు. ధనప్రవాహం, ప్యాకేజీలు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలతో హోరెత్తించిన శాసనమండలి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఓటర్ల కొనుగోలుపైనే దృష్టి సారించాయి. * రాజకీయాలకతీతంగా బేరసారాలు జరిపారు. అదేస్థాయిలో ఓటర్లు కూడా పార్టీలకతీతంగా ఫిరాయింపుల పర్వానికి తెరలేపారు. * ఈ క్రమంలో ఓటర్ల నాడి అంతుబట్టడంలేదు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే రెండు సీట్లను గెలుచుకునే దిశగా ఓటర్లను టీఆర్ఎస్ విభజించింది. ఇక కారు దూకుడుకు కళ్లెం వేయాలనే దృఢనిశ్చయంతో రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీలు * శక్తివంచనలేకుండా కృషి చేశాయి. * గులాబీ శిబిరంలో ఉన్న పాతమిత్రుల సహకారంతో గట్టెక్కుతామనే మిణుకుమిణుకుమనే ఆశ ఆ పార్టీల్లో కనిపిస్తోంది. ఇక ఎంపీటీసీల సంఘం తరుఫున బరిలో దిగిన అశోక్గౌడ్ ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఒంటిరిపోరు సాగించిన ఆయన ప్రతి ఓటరును కలిసి మద్దతు కూడగట్టారు. పార్టీలకతీతంగా పెద్దల సభలో స్థానిక సమస్యలపై గళం విప్పేందుకు తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఇలా ఎవరికివారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. 11 గంటల లోపు తుది ఫలితం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఇద్దరు అభ్యర్థులు గట్టెక్కితే 11 లోపు తుది ఫలితం వెలువడుతోంది. ఒకవేళ తొలి ప్రాధాన్య ఓట్లలో అధిక్యత లభించని పక్షంలోనే ఫలితం ఆలస్యమయ్యే అవకాశముంది.