మరికొన్ని గంటల్లో ‘పెద్ద’లెవరో తేలిపోనుంది. శాసనమండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం నేడు బయటపడనుంది. బుధవారం రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలోని కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 769 మంది ఓట్లు వేశారు. వీటిని ప్రాధాన్యక్రమంలో లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
నేడు తేలనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం
* రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో కౌంటింగ్
* ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
* బరిలో నిలిచింది ఐదుగురు.. గెలిచేది ఇద్దరే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో విజేతలుగా నిలిచే ఇద్దరు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ తరుఫున పట్నం నరేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, టీడీపీ తరుఫున బుక్కా వేణుగోపాల్, స్వతంత్ర అభ్యర్థిగా కొత్త అశోక్గౌడ్ పోటీపడ్డారు.
రెండు సీట్లనూ కైవసం చేసుకోవాలని అధికారపార్టీ, ఒక సీటయినా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని జతకట్టిన కాంగ్రెస్, టీడీపీలు ప్రయత్నించాయి. ఇక స్థానిక సంస్థల ప్రతినిధుల ఆత్మగౌరవ నినాదంతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి కూడా గెలుపుకోసం సర్వశక్తులొడ్డారు. ధనప్రవాహం, ప్యాకేజీలు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలతో హోరెత్తించిన శాసనమండలి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఓటర్ల కొనుగోలుపైనే దృష్టి సారించాయి.
* రాజకీయాలకతీతంగా బేరసారాలు జరిపారు. అదేస్థాయిలో ఓటర్లు కూడా పార్టీలకతీతంగా ఫిరాయింపుల పర్వానికి తెరలేపారు.
* ఈ క్రమంలో ఓటర్ల నాడి అంతుబట్టడంలేదు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే రెండు సీట్లను గెలుచుకునే దిశగా ఓటర్లను టీఆర్ఎస్ విభజించింది. ఇక కారు దూకుడుకు కళ్లెం వేయాలనే దృఢనిశ్చయంతో రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీలు
* శక్తివంచనలేకుండా కృషి చేశాయి.
* గులాబీ శిబిరంలో ఉన్న పాతమిత్రుల సహకారంతో గట్టెక్కుతామనే మిణుకుమిణుకుమనే ఆశ ఆ పార్టీల్లో కనిపిస్తోంది. ఇక ఎంపీటీసీల సంఘం తరుఫున బరిలో దిగిన అశోక్గౌడ్ ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఒంటిరిపోరు సాగించిన ఆయన ప్రతి ఓటరును కలిసి మద్దతు కూడగట్టారు. పార్టీలకతీతంగా పెద్దల సభలో స్థానిక సమస్యలపై గళం విప్పేందుకు తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఇలా ఎవరికివారు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
11 గంటల లోపు తుది ఫలితం
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఇద్దరు అభ్యర్థులు గట్టెక్కితే 11 లోపు తుది ఫలితం వెలువడుతోంది. ఒకవేళ తొలి ప్రాధాన్య ఓట్లలో అధిక్యత లభించని పక్షంలోనే ఫలితం ఆలస్యమయ్యే అవకాశముంది.
‘పెద్ద’లెవరో?
Published Wed, Dec 30 2015 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement