federal aid
-
ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు.. హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) తగ్గేదే లే అంటోంది. విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులకు ట్రంప్ సర్కార్ కత్తెర వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కత్తెరకు సిద్ధపడుతున్న తరుణంలో విశ్వవిద్యాలయం అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఫెడరల్ నిధులను నిలిపివేయడం ద్వారా.. విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మసాచుసెట్స్ (massachusetts) కోర్టులో దావా వేసింది. అంతేకాదు పలు యూనివర్సిటీలను కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారంటూ దావాలో ప్రస్తావించింది. ట్రంప్ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని.. ఫెడరల్ చట్టాలను, నిబంధలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. నిధులను స్తంభింపజేయడం, ఫెడరల్ సమాఖ్య గ్రాంట్లపై విధించిన షరతులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, హార్వర్డ్ ఖర్చులను చెల్లించేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని దావాలో హార్వర్డ్ యూనివర్సిటీ కోరింది.హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్హౌస్(White House) పలు నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి సంబంధించినవి అవి. అయితే, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు, కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం ప్రచురించింది.అయితే.. వైట్హౌజ్ జారీ చేసిన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్(Alan Garber) స్పష్టం చేస్తున్నారు. వాటిని బహిరంగంగా తిరస్కరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గార్బర్ చర్యలపై ట్రంప్ యంత్రాంగం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ వర్సిటీకి ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే.. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ కార్యక్రమం (ఎస్ఈవీపీ) ధ్రువీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. కానీ, ఈ పరిణామాలను హార్వర్డ్ తేలికగా తీసుకుంటోంది. ‘ఆ లేఖ మా దృష్టికీ వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం’ అని వర్సిటీ ప్రతినిధి స్పష్టంచేశారు.తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వైట్హౌస్ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని వాల్స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.ట్రంప్ యంత్రాంగంతో ఘర్షణ వైఖరి కారణంగా హార్వర్డ్ యూనివర్సిటీ.. ఫెడరల్ నిధుల నుంచి దాదాపుగా 9 బిలియన్ డాలర్లను కోల్పేయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది. -
ట్రంప్కు కోర్టు మరో షాక్
వాషింగ్టన్:అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలకు అక్కడి కోర్టులు వరుస బ్రేకులు వేస్తున్నాయి. ఉదార కార్యక్రమాలకు అమెరికా ప్రభుత్వ సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై వాషింగ్టన్ జిల్లా కోర్టు తాజాగా స్టే ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించిన కోర్టు విచారణను వారంపాటు వాయిదా వేసింది.ట్రంప్ ఆదేశాల చట్టబద్ధతను విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నించారు. విదేశాలు, స్వచ్ఛంధ సంస్థలు,పలు కార్యక్రమాల కింద సాయాన్ని మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేయాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు.ఈ ఆదేశాలపై వాషింగ్టన్ కోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోర్టుల నుంచి చుక్కెదురవడం ఇది రెండోసారి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ జారీ చేసిన జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆదేశాలను కోర్టు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించడం గమనార్హం. -
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు
♦ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి వ్యాఖ్య ♦ పన్ను ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం అందిస్తున్నందువల్ల ♦ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు ♦ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉంది ♦ 14వ ఆర్థిక సంఘం హోదా రాష్ట్రాలకు, ♦ సాధారణ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదు ♦ రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ ♦ కోరం లేక అసంపూర్తిగా ముగిసిన వైనం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి తేల్చిచెప్పారు. విభజన చట్టం అమలు చేయడమే కాకుండా పన్ను ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం అందిస్తున్నందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చకు జవాబిచ్చిన తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నీతి ఆయోగ్ పన్నుల హాలిడే, పన్నుల ప్రోత్సాహకాలు అందించింది. అభివృద్ధి కోసం కేంద్రం పూర్తిగా నిధులందించింది. అందువల్ల ప్రత్యేక హోదా అవసరం లేదనిపిస్తోంది. ప్రైవేట్ మెంబర్ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్ చే శారు. మీకు కావాల్సినవి చట్టంలో ఉన్నాయని (ప్రత్యేక హోదా చట్టంలో లేదని పరోక్షంగా చెబుతూ) వారికి చెప్పాను. చట్టం అమలు పురోగతిని వివరించాను’ అని చౌదరి వెల్లడించారు. అంతకుముందు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి జవాబిచ్చారు. ప్రత్యేక హోదా ప్రస్తావన తేకుండా విభజన చట్టం అమలులో పురోగతిని వివరించారు. చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు జేడీ శీలం స్పష్టత కోరగా.. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని పేర్కొన్నారు. 2018 కల్లా పోలవరం పూర్తి ఏపీకి పన్నుల ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం గురించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని చౌదరి పేర్కొన్నారు. ‘చట్టంలోని అంశాల అమలు కోసం కమిటీలు వేశాం. సమీక్షలు జరుపుతున్నాం.ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థలు ఏర్పాటయ్యాయి. కేంద్రీయ వర్సిటీకి భూసేకరణ జరుగుతోంది. పనుల పురోగతిని బట్టి నిధులు ఇస్తాం. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన రూ.7 వేల కోట్లను ఇస్తాం. 2018 కల్లా పూర్తి చేస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.2,050 కోట్లు అందించాం. త్వరలోనే ఏపీలో నూతన హైకోర్టు ఏర్పాటవుతుంది..’ అని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తెలుగు రాష్ట్రాలలో నెరవేరుస్తామన్నారు.మరోసారి హోదాపై సభ్యులు పట్టుబట్టగా.. టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ కోరం లేదంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది. తదుపరి వారంలో ఈ చర్చ కొనసాగనుంది. తెలంగాణాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి: కేశవరావు ఏపీతో పాటు తెలంగాణాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్థానాలు పెంచాలని తెలుగుు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారని గుర్తుచేస్తూ అసెంబ్లీ స్థానాలు పెంచే దిశగా కేంద్రం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు విభజన చట్టం అమలుకు ఎందుకు ప్రయత్నించడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ నిలదీశారు. మోదీ చెప్పిన మంచి రోజులు ఎప్పడొస్తాయని ప్రశ్నించారు. విభజన చట్టం అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కేంద్ర మంత్రి జవాబు తర్వాత కేవీపీ వివరణ కోరాల్సిన సమయంలో సభలో కోరం లేకపోవడంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది. కేంద్రానికి చిత్తశుద్ధి లేదు: జేడీ శీలం అంతకుముందు చర్చలో పాల్గొంటూ విభజన చట్టం అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు, తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని జేడీ శీలం ఆరోపించారు. విభజన చట్టం అమలు విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మట్టి, నీరు తెచ్చి ఏపీ ప్రజలను అవమానపర్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కుంటిసాకులు చెబుతున్నారని, 11 రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కల్పిస్తేనే ఏపీలో అభివృధ్ది సాధ్యమవుతుందన్నారు. విభజన చట్టం అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంలేదన్నారు.