fake promises
-
ఎడాపెడా హామీలిచ్చి ఇప్పుడు కొత్త డ్రామాలు
-
KSR Comment: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే
-
ఏడాది పాలన.. ప్రజలకు బాబు సర్కార్ వెన్నుపోటు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు ఏడాది పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధింపుతోనే గడిచిపోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యకర్మం పోస్టర్ను ఆయన విడుదల చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాబు తీరును నిరసిస్తూ వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు... ఇష్టారీతిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు నట్టేట ముంచుతున్నారన్నారు.తిరుపతి: ఎన్నికల హామీలపై కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని వైస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం పోస్టర్ను భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష విడుదల చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అరాచకాలు, హత్యలు, అన్యాయాలు చేస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 800 మందిపై హత్య రాజకీయాలు చేశారు. 370 మంది పైగా చనిపోయారు. కూటమి నేతలు ప్రతి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పడు కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్ కేసు ద్వారా తప్పుడు కేసులు పెట్టి, నెలలు తరబడి జైల్లో పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అనాగరిక, అరాచక పాలన సాగిస్తోంది..ఏడాది కాలంగా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. గత మూడు నెలలు కాలంలో మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీపీ ఎన్నికలు ద్వారా బల ప్రయోగం ద్వారా లాక్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా అసంతృప్తితో ఉన్నారు. జూన్ 4 వ తేదీ వెన్నుపోటు దినgగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీ చేపడతాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరసన ర్యాలీలో ప్రజలు అందరూ స్వచ్చందంగా పాల్గొంటారు. కూటమి పాలనపై ప్రజలు అందరూ ఆగ్రహంతో ఉన్నారు’’ అని భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. -
బాబు గారడీ మాటలకూ చేతలకు పొంతనలేదు
ఊళ్లలో పరిస్థితులు బాలేవు.. ఎక్కడా పైసా రాలడం లేదు.. చిన్న వ్యాపారాలు సాగడం లేదు.. ఆఖరుకు ఉపాధి హామీ పనులల్లో చేరి జాబ్ కార్డు తీసుకుని చెరువుపనులు చేస్తున్నా వేతనాలు రావడంలేదు. ప్రభుత్వం నుంచి కూడా రూపాయి లేదు. పిల్లాబిడ్డలతో ఎలా బతికేది. ఇక ఇక్కడ బతకడం కష్టమే.. పైదేశం పొతే అక్కడైనా తల్లినాలుగురం కూలీ నాలీ చేసుకుని కలోగంజో తాగొచ్చు.. పోదాం పదండి.. ఇదీ సగటు పేద కుటుంబంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ... ఎప్పుడూ జరిగేదే ఈసారి కూడా జరుగుతోంది.ఎన్నికలకు ముందు రకరకాల రంగురంగుల కరపత్రాలతో జనాన్ని నమ్మించి గెలిచి, తరువాత వారికి రంగుల చిత్రం చూపడం చంద్రబాబు నైజం. అయన గెలిచాక అయన అనుచరులు.. వందిమాగధులు బాగుంటారు.. రాష్ట్రం మొత్తం పస్తులుంటుంది. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు వస్తూనే వాలంటీర్లు ఓ రెండులక్షలమందిని తీసేసారు.. అంటే ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఆధారంగా ఉన్న చిన్న ఆదాయం పోయినట్లే.. ఇప్పుడు తాజాగా రేషన్ బళ్ళను సైతం తీసేస్తున్నారు.. వీళ్ళొక పదివేలమంది. ఇలా రకరకాల శాఖల్లో వేలాదిమందికి ఉపాధికి గండి పడుతోంది. కొత్తగా పరిశ్రమలు రావడం మాట అటుంచి ఎక్కడికక్కడ చిన్న పరిశ్రమలు.. కుటీర పరిశ్రమలు మూతబడుతున్నాయి. ఊళ్లో ఏదో చిన్నా చితకా టీ దుకాణం పెట్టుకుందాం అంటే అవి కూడా సరిగా నడవడం లేదు. ఇంకేదైనా పెడదాం అన్నా డబ్బుల్లేవు.. నా దగ్గరే కాదు జనం దగ్గర పైసలు లేవు... ఎవరూ కాస్త ధారాళంగా వందనోటు మార్చేందుకు ధైర్యం చేయడం లేదు.. అవసరం అంటేనే ఆచితూచి మూడుసార్లు ఆలోచించి జేబులోంచి నోటు తీస్తున్నారు.. ఇక ఇక్కడ అందరిమధ్యా ఉంటూ పస్తులుండడం మేలన్న భావనకు వచ్చేసిన పెదాబిక్కీ జనం మద్రాస్.. ముంబై.. హైదరాబాద్.. విజయవాడ ఇలా ఎక్కడ పనిదొరికితే అక్కడికి కడుపు చేతబట్టుకుని వెళ్లిపోతున్నారు.రాయలసీమనుంచి ఎక్కువగా మద్రాస్.. బెంగళూర్ వంటి నగరాలకు చేరుతున్నారు. పాలనలోకొచ్చి ఏడాదైంది కదా తమ వీరత్వం గురించి జనం ఏమనుకుంటున్నారో అన్నది తెలుసుకునేందుకు గ్రామా సచివాలయాల ద్వారా సర్వ్ చేయించిన ప్రభుత్వానికి షాకిచ్చే ఫలితాలొచ్చాయి. ఈ ఏడాదిలో అక్షరాలా 12 లక్షలమంది జనం ఊళ్లొదిలి అన్నాన్ని వెళ్లిపోయారట. ఉన్నఊళ్ళో కష్టమో సుఖమో అందరిమధ్యా ఉందామనుకున్న వాళ్ళను సైతం ఈ చేతగాని సర్కారు ఉండనీయడం లేదు.ఇక్కడ ఉంటె గుక్కెడు గంజి.. పిడికెడు మెతుకులు కూడా దొరికే ఛాన్స్ లేదు. పోనీ ప్రభుత్వం అయినా ఏదో పథకం కింద పావలా ఇస్తుందనుకుంటే పన్నులు.. చార్జీల రూపంలో బాదడం మినహా పైసా ఇచ్చేరకం కాదని తేలిపోయింది. పోనీ వైఎస్ జగన్ మాదిరిగా ప్రభుత్వం అప్పుడో ఇప్పుడో పదో పరకో ఏదో పథకం కింద ఇస్తే దానికి తోడు ఏదో పనిచేసుకుని ఊళ్ళో ఉండచ్చు అనుకుంటే చంద్రబాబులో ఏ కోశానా ఆ ఆలోచన లేదు.. దీంతో పేద .. దిగువ మధ్యతరగతివాళ్ళు ఊళ్లొదిలి వెళ్లిపోతున్నారు. వేరే ఊళ్ళో పస్తులున్నా.. కూలీ చేసుకున్నా ఎవరూ అడగరు... అవమానం లేదు.. అందుకే వెళ్ళిపోతున్నాం అంటూ కన్నీళ్లతో ఊరు విడుస్తున్న కుటుంబాలు అక్షరాలా 12 లక్షలని తేలింది.. ఇక బాబు పేదరిక నిర్మూలన ఆలోచనలు ఇంకెప్పుడు అమల్లోకి వస్తాయో.. పేదలు ఎప్పుడు కాస్త ఎదుగుతారో.. ఈలోపు ఎన్ని పేద ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో..-సిమ్మాదిరప్పన్న -
RK Roja: చంద్రబాబు ప్రతి రోజు రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు
-
బాబు ఉగాదికి ఇచ్చిన మాట ఎక్కడ?
-
ఏపీ ప్రజలపై పెట్రోల్ బాదుడు
-
Fake Promise: ఇంటింటికీ వెళ్లి.. అవ్వా నీకు 50,000 నీకు 50,000 అన్నాడు!
-
రాజకీయ అవసరాల కోసం ఊసరవెళ్లి సిగ్గుపడేలా చంద్రబాబు రాజకీయాలు
-
బాబు మార్క్ మోసం
-
నిరుద్యోగుల నోట్లో కూటమి సర్కారు మట్టి
-
పోతారు మొత్తం పోతారు.. ఇది నా తుగ్లకీయం
-
బాబు అబద్ధాలతో రాజకీయ దుమారం
-
అది నేనే.. ఇది నేనే..!
తిరుపతి రూరల్/చంద్రగిరి: దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని తానే ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం నారావారిపల్లె పర్యటనలో భాగంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. స్వర్ణ నారావారిపల్లె విజన్ తీసుకువస్తున్నామని వెల్లడించారు. అన్నీ నేనే చేశా.. అన్నీ నేనే చేస్తానంటూ హామీలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..⇒ ప్రకృతి సేద్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లోనే కుప్పంలో నేనే ప్రారంభించా.⇒ నారావారిపల్లె పరిధిలోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు తయారు చేయాల ని కలెక్టర్కు సూచించా.⇒ శ్రీసిటీ సౌజన్యంతో రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు, ఏఐ టెక్నాల జీ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం.⇒ ఫిబ్రవరి లోపు వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తాం.⇒ జల్ జీవన్ మిషన్ కింద రక్షిత మంచినీరు నిరంతరం అందిస్తాం.⇒ ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయిస్తాం.⇒ రంగంపేట నుంచి భీమవరం, మంగళం పేట వరకు రూ.8కోట్లతో రోడ్లు నిర్మిస్తాం.⇒ ప్రతి వీధికీ సీసీ రోడ్డు ఉండేలా చర్యలు చేపడతాం.⇒ విద్యార్థులు, గృహిణులు చదువుకునేందుకు, పనిచేసేందుకు ఐటీ టవర్ నిర్మిస్తాం.⇒ కల్యాణీ డ్యామ్ను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు.పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు? -
క్రిస్మస్ కానుకలకు కూటమి ఎగనామం
-
మంగళం హామీలు మంగళం.. చంద్రబాబుకు అలవాటుగా మారిన సంప్రదాయం
-
ఎన్నికల ముందు చంద్రబాబు బూటకపు హామీలు
2014లోఎన్నికలకు ముందు. ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం. ఏం అక్కచెల్లెమ్మలూ..! మీరెవ్వరూ బ్యాంక్ల్లో రుణాలు చెల్లించొద్దు. అంతేకాదు.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాం. ప్రతి రైతునీ రారాజుని చేస్తాం’ అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రజలందర్నీ బురిడీ కొట్టించారు. 2014 నుంచి 2019 వరకు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఎన్నికల ముందు మేల్కొన్నారు. మహిళల పవిత్రతకు ప్రతీకైన పసుపు–కుంకుమ పేరుతో ముష్టివిదిల్చినట్టు చిల్లర వేసి మహిళల ఓట్లు దండుకోవాలని చూసి బోల్తాపడ్డారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో మరో మారు మాయచేసేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై మహిళలు మండిపడుతున్నారు. మాయలోడి మాటలు నమ్మబోమని తేలి్చచెబుతున్నారు. ఇచ్చినమాటకు కట్టుబడిన జగనన్నకే మా మద్దతు అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. నట్టేట ముంచేశారు చంద్రబాబు మాయ మాటలకు ఒకసారి మోసపోయాం. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మేము కూడా సంబరపడిపోయాం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అధికారం వచ్చింది.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశించాం. అయితే చంద్రబాము మమ్మల్ని నట్టేట ముంచేశారు. ఐదేళ్లపాటు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కట్టలేక నానా అవస్థలు పడ్డాం. వడ్డీలు పెరిగిపోయాయి. కొత్త రుణాలు రాని పరిస్థితి. మళ్లీ 2019 ఎన్నికలు వచ్చే సరికి పసుపు–కుంకుమ పేరుతో రూ.10వేలు మా చేతిలో పెట్టారు. ఆ డబ్బులు వడ్డీలకు కూడా సరిపోలేదు. అందుకే ఆ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాం. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా మా రుణాలు మాఫీ చేశారు. మాకు కొత్తగా రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. సున్నావడ్డీకే బ్యాంకర్లు రుణం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మేము ఆర్థికంగా ఎదిగేందుకు సహకారం అందించారు. ఈ ఐదేళ్లలో జగనన్న ఏం చేశారో మాకు గుర్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మం. – బుజ్జి, చిత్తూరు బాబు మోసం చేశారు చంద్రబాబు మీద కుప్పం ప్రజలకు అభిమానం తగ్గిపోయింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని నమ్మించి మోసంచేశారు. దీంతో చాలా నష్టపోయాం. ఎన్నికలు దగ్గర వచ్చినప్పుడు పసుపు– కుంకుమ పేరిట రూ.10 వేలు భిక్షంగా వేసి ఓట్లు కోసం డ్రామా చేసిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు చెప్పే మాటలను అసలు నమ్మలేం. అప్పట్లో మహిళలు ఆశ పడింది డ్వాక్రా రుణమాఫీ , రైతు రుణమాఫీ రెండింటినీ ఇవ్వకుండా మోసం చేశారు.ఇప్పుడు బాబు ఎంత చెప్పినా జనం నమ్మరు. ఏళ్ల తరబడిగా కుప్పం ప్రజలు చంద్రబాబును చూశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది. మాకు కుటుంబానికి అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న ఇల్లు వచ్చాయి. అదే స్కీమ్లు మేము ఇస్తామని టీడీపీ వాళ్లు వస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం మాకు అన్ని పథకాలు అందిస్తోంది. ఇంకా వీళ్లు వచ్చి ఇచ్చేదేంటో అర్థం కావడంలేదు. మమల్ని నిలువునా మోసం చేసిన చంద్రబాబును జీవితంలో నమ్మం. – మంజుల, ఎన్టీఆర్ కాలనీ, కుప్పం చంద్రబాబును ఎవ్వరూ నమ్మరు చంద్రబాబు మాటలు విని.. నమ్మి అలసిపోయాం. ఇప్పడు కుప్పంలో బాబు మాటలు ఎవ్వరూ నమ్మరు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు ఏవీ నెరవేర్చలేదు. మాకైతే డ్వాక్రా రుణాలు మాఫీ, రైతులు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. అప్పట్లో డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో అప్పులు, నగలు తాకట్టు పెట్టి కట్టాల్సి వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇచ్చి చాలు పొమ్మున్నారు. సుమారు 35 ఏళ్లుగా చంద్రబాబును చూస్తునే ఉన్నాం. మాకైతే ఆయన చేసింది ఏమీ లేదు. వాళ్ల నాయకులు మాత్రమే బాగుపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కుప్పంలో అదే రోడ్లు, అదే భవనాలే తప్పా అభివృద్ధి జరిగిందే లేదు. ఇప్పుడు చంద్రబాబుపై మాకు నమ్మకం పోయింది. ఇచ్చిన హమీలు కూడా జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలనే మేమూ ఇస్తాం అంటున్నారు. గతంలో టీడీపీ ఉన్నప్పుడు వాటిని ఎందుకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో మాకు అమ్మఒడి, జగనన్న తోడు, పక్కా ఇల్లు వచ్చింది. జగనన్న గోరు ముద్ద పథకం కింద పిల్లలు తృప్తిగా¿ోజనం చేస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. – ధనలక్ష్మి, అర్బన్ కాలనీ, కుప్పం బాబు మాటలకు ఏమారే ప్రసక్తే లేదు నేను ఉమామహేశ్వరి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే డ్వాక్రా రుణం మాఫీ అవుతుందని ప్రకటించారు. మా గ్రూపునకు రూ. లక్ష అప్పు ఉండటంతో రుణమాఫీ అవుతుందని ఆశపడ్డాం. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా రుణమాఫీ గురించి పట్టించుకోలేదు. 2019 ఎన్నికలు సమీపించే సమయంలో మహిళలు అందరూ ఆగ్రహంగా ఉన్నారని తెలుసుకుని మభ్యపెట్టడం కోసం పసుపు–కుంకుమ పేరిట మమ్మల్సి మోసం చేయాలని చూసిన ఘనుడు చంద్రబాబు. ఆయన పసుపు–కుంకుమతో ఏమార్చాలని చూస్తే మేమందరం ఓటుతో ఉప్పు, కారం పెట్టి సాగనంపాం. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఆసరా పేరిట రుణమాఫీ చేశారు. ఏడాదికి రూ. 24,950 చొప్పున నాలుగేళ్లకు మా రుణం మొత్తం మాఫీ అయింది. ఎన్నికల్లో చెప్పిన మాటపై నిలబడింది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. మళ్లీ ఇప్పుడొచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా ఏమారే ప్రసక్తే లేదు. – జైలా, ముడిపల్లె, నగరి మండలం మాకు అప్పులే మిగిల్చారు నేను గత 15 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నా. చంద్రబాబు మాట లు నమ్మి 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేశాం. డ్వాక్రా రుణం మాఫీ చేస్తారని ఆశపడ్డాం. బ్యాంకులో తనఖా పెట్టిన నగలు విడిపిస్తారని నమ్మాం. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు. రుణం మాఫీ చేయలేదు. తాకట్టు పెట్టిన నగలను విడిపించలేదు. చివరకు మాకు అప్పులే మిగిల్చారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు మా ఓట్లు గుర్తుకు వచ్చినట్టు ఉన్నాయి. పసుపు– కుంకుమ అంటూ రూ.10వేలు ఇచ్చి మాయ చేయాలని చూశారు. ఎక్కడికక్కడ సభలు పెట్టి బూటకపు హామీలు గుప్పించారు. సెల్ఫోన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. అందుకే ఆ ఎన్నికల్లో టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా డ్వాక్రా రుణమాఫీ చేసింది. నాకు నాలుగు విడతల్లో రూ.66వేల రుణం తీరిపోయింది. అలాగే సున్నావడ్డీ కింద మరో రూ.12వేలు వచ్చింది. మాకు ఇంత సాయం చేసిన జగనన్నకే జీవితాంతం అండగా ఉంటాం. – ఈశ్వరి, డ్వాక్రా మహిళ, గుడిపాల మండలం చంద్రబాబు మమ్మల్ని నవ్వుల పాలు చేశారు నేను ఓంశక్తి గ్రూపులో ఉండా. ముందు చంద్రబాబు మా డ్వాక్రా వాళ్లకి రుణమాఫీ చేస్తామని చెప్పారు. దీంతో మా గ్రూపు సభ్యులంతా సంతోషపడిరి. నేను అప్పుడే చెప్పినా ఈ చంద్రబాబు మాట నమ్మితే పుట్టగతులుండవు అని. అప్పుడు ఎవరూ పట్టించుకోలే. తర్వాత ఆయన మమ్మల్ని పట్టించుకోకపోవడంతో అందరికీ తెలిసివచ్చింది. మళ్లీ అప్పుడు ఎలక్షన్ రాగానే పసుపు–కుంకుమ ఇస్తాం.. పచ్చచీరలు కట్టుకురండని మా గ్రూపోళ్లకి మీటింగులే మీటింగులు పెట్టారు. అప్పుడూ చెప్పి నా ఆ యబ్బను నమ్మకండి మళ్లీ టోపీ పెడతాడు అని. అప్పుడు ఆడోళ్లందరూ నాపై ఎగిరినారు. మా గ్రూపోళ్లకైతే పసుపు–కుంకుమ రాలే. దీంతో అందరిలో మేమే నవ్వులపాలయ్యాం. అదే జగన్మోహన్రెడ్డి వచ్చాక సక్రమంగా వడ్డీ మాఫీ అయ్యింది. రుణం మాఫీ అయ్యింది. మాకు కొత్త గా రుణాలు కూడా ఇచ్చారు. ఆ బిడ్డ చల్లగా ఉండా ల. అప్పుడే మాలాంటి పేదలు సల్లగా ఉంటారు. ఇక బతుకులో ఎప్పటికీ చంద్రబాబును మాత్రం నమ్మం అని మా గ్రూపోళ్లందరం తీర్మానం చేసుకున్నాం. – ఈశ్వరమ్మ, శెట్టిపల్లె, బైరెడ్డిపల్లె మండలం వడ్డీలకే పోయింది అధికారం కోసం చంద్రబాబు నాయుడు 2014లో తప్పుడు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తామని చెప్పిన రుణమాఫీని గాలికి వదిలేశారు. దీంతో మేము బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తడిసిమోపెడాయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో మాత్రం పసుపు– కుంకుమ అంటూ మాకు ముష్టి వేశాడు. అది కూడా బ్యాంకు వడ్డీలకే పోయింది. మా చేతికి పైసా రాలేదు. ఆయన ఇచ్చిన పసుపు–కుంకుమతో మాకు ఒరిగిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకే అండగా నిలుస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణమాఫీని విడతల వారీగా అమలు చేశారు. నాలుగేళ్లుగా వివిధ పథకాలతో మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. జగనన్న పుణ్యాన హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు బూటకపు హామీలతో వస్తున్నారు. ఆయన మాటలను ఎలా నమ్మ గలం. – ఎస్.ప్రభావతి, ఈస్ట్పేట, పుంగనూరు బాబుది పచ్చి మోసం హిందూ మహిళలు పవిత్రంగా భావించే పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు మమ్మల్ని మోసం చేసేందుకు ప్రయతి్నంచారు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. ఆయన కారణంగా మేము బ్యాంకర్లతో నానా మాటలు పడాల్సి వచ్చింది. మనశ్శాంతిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. డిఫాల్టర్గా మా గ్రూపు మారడంతో ఇతర అప్పులు కూడా రాని పరిస్థితి ఎదురైంది. అందుకే 2019 ఎన్నికల్లో పసుపు–కుంకుమ పేరుతో రూ.10వేలు ఇచ్చి మాయ చేయాలని చూసినా కీలెరిగి వాతపెట్టాం. ఓటుతో తగిన గుణపాఠం నేర్పించాం. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి సూపర్ సిక్స్ అంటూ వస్తున్నారు. చంద్రబాబు ఎలా నమ్మగలం. గతంలో డ్వాక్రా మహిళలకు రూ.3వేలు కూడా రుణ మాఫీ చేయలేని చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అధికారం ఇస్తే ఏదో చేస్తాడంటే ఎలా. సీఎం జగనన్న కరోనా కష్టాల్లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏటా క్రమం తప్పకుండా డ్వాక్రా రుణమాఫీ చేశారు. వచ్చిన రుణమాఫీ నిధులతో చిన్న వ్యాపారాలు, పాడి ఆవులతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటాం. – లక్ష్మీ, కనికాపురం, పాలముద్రం మండలం మా ఉసురు తగిలింది డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉంటూ ఆర్థికంగా ఎదుగుతున్న మాలాంటి మహిళలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. తనను గెలిపిస్తే పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని, అడవాళ్లు ఎవరూ బ్యాంకులకు రుణాలు తిరిగి కట్టవద్దని 2014 ఎన్నికల ముందు ఆయన పదే పదే చెప్పారు. దాన్ని నమ్మి ఇందిరా పొదుపు సంఘంలోని మేము బ్యాంకుకు రూ.2లక్షల రుణం రీ పేమెంట్ చేయకపోవడంతో గ్రూపు డిఫాల్టర్ జాబితాలోకి వెళ్లిపోయింది. గ్రూపులు బాగా జరిగితే తక్కువ వడ్డీతో అవసరానికి అప్పులు దొరికేవి. అదీ లేకుండా చేశారు. ఆయన సీఎం అయినా రుణాలు మాఫీ చేయకుండా మళ్లీ 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తామని కొందరికే ఇచ్చారు. అందుకే మా ఆడవాళ్ల ఉసురు తగిలి అప్పుడు అధికారం నుంచి దిగిపోయారు. ఇక ఎప్పటికీ చంద్రబాబు సీఎం కాలేరు. కానీ జగన్మోహన్రెడ్డి వయసులో చిన్నవాడైనా 2019లో చెప్పిన మాట ప్రకారం మా గ్రూపునకు ఉన్న రూ 5,49,600 రుణం మాఫీ చేశారు. ఒక్కో సభ్యురాలికి రూ.13,750 వంతున నాలుగు విడతలుగా మా అకౌంట్లలో నగదు జమ చేశారు. మాకు మేలు చేసిన జగనన్న వెంటనే మేము నిలబడతాం. – ఈశ్వరి, కడపల్లె, శాంతిపురం చంద్రబాబు అవకాశవాది డ్వాక్రా మహిళలకు కనీసం రూ.3వేలు రుణమాఫీ చేయని చంద్రబాబు, ఎన్నికలు వచ్చేసరికి అమ్మకు వందనం, వృద్ధాప్య పింఛన్ పెంపు అంటూ హామీలు గుప్పిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ మాయమాటలు చెప్పి నిలువునా మోసం చేశారు. ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలను డీ గ్రేడ్కు తీసుకువచ్చి బ్యాంకు అధికారులతో తిట్టించారు. మళ్లీ 2019 ఎన్నికలు వచ్చినప్పుడే మహిళలు గుర్తుకు వచ్చారు. ఏదో చిల్లర డబ్బులు పడేస్తే నమ్మి ఓటేస్తారులే అని పథకం ప్రకారం పసుపు–కుంకుమ పేరుతో రూ.10వేల చొప్పున కొందరికే డబ్బులు వేశారు. అందుకే ఆ ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాం. అదే సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా విడతల వారీగా రుణమాఫీ చేశారు. ఆయన చేసిన రుణమాఫీ, అందించిన సంక్షేమ పథకాలతోనే మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. జగనన్న వల్ల ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మేము ఎప్పుడూ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఆయనను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. – వసంతమ్మ, పెద్దతయ్యూరు, ఎస్ఆర్పురం మండలం -
కుప్పం కూరగాయలు విదేశాలకు పంపిస్తాడట..కుప్పం తాత కథలు !
-
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా
ముంబై : 73 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కోటి రూపాయలతో మహిళ ఉడాయించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మలద్ ప్రాంతానికి చెందిన జెరాన్ డిసౌజా అనే వృద్ధుడు 2010లో తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన రూ. 2 కోట్లకు పైగా డబ్బులు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఓ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఇటీవలె వాటిపై వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తాన్నివిత్డ్రా చేసుకున్నాడు. అయితే అదే బ్యాంకులో పనిచేసే షాలిని అనే మహిళ ఈ మొత్తం వ్యవహారాన్ని క్షణ్ణంగా పరిశీలించింది. వృద్ధుడితో పరిచయం చేసుకుని స్నేహం చేయసాగింది. అతడ్ని పెళ్లి చేసుకుంటానని, వృద్ధాప్యంలో తోడుగా ఉంటానని నమ్మబలికింది. దీంతో ఇద్దరూ కలిసి సినిమాలు, రెస్టారెంట్లకు షికార్లు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాను ఓ వ్యాపారం ప్రారంభిస్తున్నానని, ఇందుకు ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఇచ్చే లాభాలను ఇద్దరం పంచుకుందామని నమ్మబలికింది. దీంతో దాదాపు 1.3 కోట్ల రూపాయలను ఆమెకు అప్పజెప్పాడు. డబ్బులు తన ఖాతాలో ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మొభైల్ స్విచ్ఛాఫ్ చేసివేరే ఊరికి మకాం మార్చింది. అక్కడే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకు తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు డిసౌజా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : (నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..) (అత్యాచారం: ఇరవై ఆరేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు) -
బీజేపీతో మళ్ళీ మళ్ళీ!
-
ఇదేమి ధర్మం?
-
ప్రజలను మభ్యపెడుతున్న కేఈ
- చెరువులు నింపుతామని చెపి్ప ఇప్పటి వరకు పట్టించుకోలేదు -జనం తాగునీటి కోసం అల్లాడుతున్నారు - తక్షణమే పదవికి రాజీనామా చేయాలి – విలేకరుల సమావేశంలో చెరుకులపాడు నారాయణరెడ్డి వెల్దుర్తి రూరల్: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉత్తుత్తి హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకుల పాడు నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. పెరవలి రంగస్వామి సమక్షంలో నూరు రోజుల్లో 106 చెరువులు నింపుతానని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈప్రాంతంలోని చెరువులు నింపుతారో..లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందని, జనం గొంతు తడుపుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మంత్రులు, అధికారులు జిల్లాలో భూగర్భజలాలు పెరిగాయంటున్నారని మరి నీటిసమస్య ఎందుకు తలెత్తిందో తెలపాలన్నారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రవిరెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకటనాయుడు, నాయకులు అగస్టీన్, బొమ్మిరెడ్డిపల్లె రంగయ్య, ఆటో మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో అబద్ధాలు
-
అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న బాబు!